Recent Updates
  • పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.
    పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు చెందిన రోహిత్ (21) పై కల్లూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికతో పరిచయం పెంచుకుని, ఫోన్లో వేధించి, బెదిరించి, గత నెల 28న బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడాడ్డు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 21న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది....
    0 Comments 0 Shares 21 Views 0 Reviews
  • "షైనింగ్ అవార్డు" అందుకున్న పుంగనూరు అమ్మాయి "అక్షిత"
    మదనపల్లిలో ఈరోజు ఎమ్మెల్యే షాజహాన్ భాష గారి చేతుల మీదుగా "షైనింగ్  అవార్డు" అందుకున్న పుంగునూరు మండలం ఏ ఎన్  కుంట ఎంఈసి చదువుతున్న ఇంటర్ విద్యార్థి "అక్షిత", ఈ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి గారు  గారు కలెక్టర్ సుమిత్ రు డీఈఓ సుబ్రమణ్యం గారి చేతులమీదుగా ప్రశంసా పత్రం నగదు బహుమతి అందజేశారు విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు, ఇవా అవార్డుకు ఎన్నికైనందుకు...
    0 Comments 0 Shares 32 Views 0 Reviews
  • పుంగనూరు:పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు
    పుంగనూరు సబ్ ట్రెజరీ అధికారిగా వసంత రాంబాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మదనపల్లి సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాంబాబు పదోన్నతి పై పుంగనూరు కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ట్రెజరీ సేవలు సత్వరమే అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఎస్టిఓ గా పదోన్నతి పొందిన రాంబాబును అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ డి టి ఎ ఓ లోకేష్ బాబు, ఎస్ టిఓ లు నరేష్ కుమార్ నాయక్ , పద్మనాభం సీనియర్ అకౌంటెంట్...
    0 Comments 0 Shares 31 Views 0 Reviews
  • రికార్డు స్థాయిలో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం హుండీ ఆదాయం
    శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో 54 రోజుల హుండీ ఆదాయం రూ. 1, 25, 45, 420 వచ్చింది. హుండీలో 43. 950 గ్రాముల బంగారంతో పాటు 55. 100 గ్రాముల వెండి, 6 విదేశీ కరెన్సీ నోట్లు. –2, కువైట్ దినార్–1, థాయ్ బాత్–1, ట్రినిడాడ్ & టొబాగో డాలర్లు–2 అలాగే అన్నదాన హుండీ ఆదాయం రూ. 22, 179, శ్రీ రణభేరి గంగమ్మ దేవస్థాన హుండీ ఆదాయం రూ. 96, 241 వచ్చింది. బోయకొండ దేవస్థానం ఉప కమిషనర్ &...
    0 Comments 0 Shares 51 Views 0 Reviews
  • పుంగునూరు: ఇన్చార్జి మార్పు విషయంలో తిరుపతి సమావేశంలో తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ,
        పుంగనూరు తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ.తిరుపతిలో జరుగుతున్న సమావేశంలో పరస్పరం కొట్టుకున్న టీడీపీ నేతలు.పుంగనూరు ఇంఛార్జ్‌ మార్పు విషయంలో రగడ.ఇవాళ ఇంఛార్జ్‌ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం.భేటీ ప్రారంభానికి ముందే గొడవకు దిగిన ఇంఛార్జ్‌ చల్లా బాబు అనుచరులు, స్థానిక నేతలు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • పుంగనూరులో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర
    చిత్తూరు జిల్లా పుంగనూరులో సోమవారం చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'భారత్ మాతాకీ జై, చత్రపతి శివాజీ మహారాజ్ కి జై' నినాదాలతో పురవీధులు మారుమోగాయి. మహిషాసుర మర్దిని, కోలాటాలు, డీజేలతో పెద్ద సంఖ్యలో హిందువులు ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణ పురవీధులను కాషాయపు జెండాలతో అలంకరించారు. ఈ...
    0 Comments 0 Shares 55 Views 0 Reviews
  • పుంగనూరు:పుంగనూరు అన్నమయ్య జిల్లా జనసేన నాయకులను ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు.
    ఈ నెల 12 వ తేదీ ఆదివారం మన పుంగనూరు పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రకు జనసేన పార్టీ నాయకులు నరేష్ గారిని మరియు విరుపాక్షి గారిని చైతన్య రాయల్ గారిని ఆహ్వానించిన హిందూ జాగరణ సమితి సభ్యులు గౌరవ అధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి గారు, అధ్యక్షులు పరమేష్ గారు, ఉపాధ్యక్షులు హరి గారు, పి ఆర్ ఓ వెంకటేష్ గారు పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని హిందువులు అత్యధిక శాతం లో...
    0 Comments 0 Shares 70 Views 0 Reviews
  • పుంగనూరు అన్నమయ్య జిల్లా సోమల వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
    అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని తెలియజేశారు. ప్రణాళిక బద్ధమైన, మాతృత్వం, గర్భధారణ కోసం ఆరోగ్యకరమైన సమయం అవసరం అని చెప్పారు. ప్రపంచ జనాభా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రణాళిక చేసుకోవడం మంచిదని వైద్యులు తెలియజేశారు. ర్యాలీలో వైద్య బృందం పాల్గొన్నారు#...
    0 Comments 0 Shares 77 Views 0 Reviews
  • పుంగనూరు:నేడు కేసుల పరిష్కారానికి లోక్‌అదాలత్
    పుంగనూరు పట్టణ కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి ఆరీఫా షేక్ తెలిపారు. న్యాయమూర్తులు పరేష్‌కుమార్, కృష్ణవంశితో కలిసి సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరిస్తామని అన్నారు. న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, కక్షిదారులు సమయానికి హాజరై అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకోవాలని ఆమె కోరారు# కొత్తూరు మురళి .
    0 Comments 0 Shares 72 Views 0 Reviews
  • ఘనంగా గుర్రప్ప స్వామి వార్షికోత్సవం
    సోమల మండలం కందూరు గ్రామంలో బోయ వీధిలో వెలసిన శ్రీ గురప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని, నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ వార్షికోత్సవానికి దేవరెద్దులు పిలిచి కందూర్ పురవీధుల్లో వైభవంగా చాందిని బండి ద్వారా స్వామివారి ఊరేగింపు జరిగింది. అనంతరం స్వామివారి పుష్ప పల్లకి, చెక్కభజన బృందాలు, కోలాటాలు ఇతర కార్యక్రమాలతో వైభవంగా ఈ కార్యక్రమం ముగిసింది. చాలా...
    0 Comments 0 Shares 76 Views 0 Reviews
  • పసుపు అలంకారంలో శ్రీ విరూపాక్షి మారెమ్మ దివ్యదర్శనం
    పుంగనూరు ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసిన మహిమాన్విత స్వరూపిణి శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ను ఆలయ అర్చకులు ఉదయాన్నే పంచామృతాలతో అభిషేకించి సుగంధ ద్రవ్యాలతో ఫల పుష్పాలతో పసుపు అలంకారంలో భక్తులకు దర్శనం కల్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 80 Views 0 Reviews
  • పుంగనూరులో నూతన ఆటో స్టాండ్ ప్రారంభం
    చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాళ్యం వద్ద జై శ్రీరామ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆటో స్టాండ్‌ను రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని సూచించారు. జైశ్రీరామ్ ఆటో యూనియన్‌కు తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన...
    0 Comments 0 Shares 85 Views 0 Reviews
  • సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ
    సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ రాజకుమార్, ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్, ఎన్. ఎస్. ఎస్. కోర్డినేటర్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యాధుల నివారణకు ర్యాలీ, ప్రతిజ్ఞ, కరపత్రాల పంపిణీ...
    0 Comments 0 Shares 81 Views 0 Reviews
  • పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం
    పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ఆ ప్రాంగణం అంతా ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న రైతులు, వ్యాపారులు, భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడున్న రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకుని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో మూడు...
    0 Comments 0 Shares 81 Views 0 Reviews
  • ఆర్ఎస్ఎస్ పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం
    చిత్తూరు జిల్లా పుంగనూరులోని జేఎండీ కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విభాగ్ సద్భావన ప్రముఖ్ మోహన్‌రామిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ జీవనానికి, హిందూ సంస్కృతికి భగవాధ్వజం ప్రతీక అని, దానిని సంఘం గురువుగా భావిస్తుందని తెలిపారు. దేశ వైభవం కోసం సేవాభావం, క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తితో పనిచేయాల్సిన...
    0 Comments 0 Shares 92 Views 0 Reviews
  • BC సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా రెడ్డప్ప,సుబ్రహ్మణ్యం
    జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి షణ్ముగం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా రెడ్డి గౌని రెడ్డప్ప, కార్యదర్శిగా సుబ్రహ్మణ్యం లను నియమిస్తూ ఉత్తర్వు పత్రాలను అందించారు. పుంగనూరు మండలం దిగువపల్లి గ్రామం కి చెందిన రెడ్డప్ప, బత్తలాపురం గ్రామంకి చెందిన ఎం సుబ్రహ్మణ్యం బీసీల పక్షాన నిలబడి బీసీల సమస్యలపై చేసిన పోరాటాలు, సేవలను గుర్తించి, జాతీయ...
    0 Comments 0 Shares 93 Views 0 Reviews
  • పుంగునూరు నియోజకవర్గం:సోమల ఇలా ఉంటే రోగాలు రాకుండా ఏమవుతాయి
    పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో మూడు రోజుల క్రితం చనిపోయిన వీధి కుక్క కుళ్ళిపోయి, పురుగులు వచ్చి భయంకరమైన దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఈ దుర్గంధంతో అటుగా వెళ్లే పాదచారులు, వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, బ్యాంక్ వంటి కార్యాలయాలకు వెళ్లే మార్గంలోనే ఈ దుస్థితి నెలకొన్నప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు మంగళవారం అసహనం వ్యక్తం...
    0 Comments 0 Shares 102 Views 0 Reviews
  • పుంగునూరు నియోజకవర్గం :ఒంగోలు ట్రిపిల్ ఐటీ కి సదుం విద్యార్థి ఎంపిక.
    పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల విద్యార్థి మహమ్మద్ అఫాక్ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించినట్లు ప్రిన్సిపల్ జయసింహ నాయుడు సోమవారం తెలిపారు. పదో తరగతిలో 572 మార్కులు సాధించి ప్రతిభ చూపిన అఫాక్‌ను పాఠశాల బృందం, గ్రామస్తులు అభినందించారు# కొత్తూరు మురళి .
    0 Comments 0 Shares 102 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com