-
784 Posts
-
2 Photos
-
0 Videos
-
Followed by 7 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చపుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్గా స్టేట్ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, నియోజకవర్గ అబ్జర్వర్గా శాప్ చైర్మన్ రవి నాయుడు, ఇన్చార్జ్గా చల్లా బాబు ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమంపై చర్చించారు. కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీకి...0 Comments 0 Shares 5 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
పుంగనూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిపుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం శవపరీక్ష నిర్వహించిన అనంతరం, తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు...0 Comments 0 Shares 6 Views 0 Reviews
-
పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలిఅన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పండుగ సందర్భంగా గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు ఇబ్రహీం, ఇస్మాయిల్,...0 Comments 0 Shares 6 Views 0 Reviews
-
పుంగనూరులో సిపిఐ నాయకుల నిరసనపుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సీపీఐ నాయకులు ఆదివారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీపీఐ నాయకుడు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దశలవారీగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 6 Views 0 Reviews
-
పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కే మాధవ్, రాష్ట్ర సమితి సభ్యులు మున్నా ఆదివారం తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు హాజరై విద్యారంగ సమస్యలు, నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించనున్నట్లు...0 Comments 0 Shares 6 Views 0 Reviews
-
బంగ్లా గ్రామంలో వికసించిన మే పుష్పంపుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, బంగ్లా గ్రామంలో ఆదివారం అరుదుగా కనిపించే మే పుష్పం వికసించింది. ఈ పుష్పాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి చూపారు. ప్రతి సంవత్సరం మే నెలలో మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తాయని ఇంటి యజమాని శివయ్య నాయుడు తెలిపారు. ఈ పువ్వు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉందని ప్రజలు అభిప్రాయపడ్డారు#కొత్తూరు మురళి.0 Comments 0 Shares 6 Views 0 Reviews
-
పులిచెర్ల: అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సరకులు "పంపిణీ"పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురైన కుటుంబానికి శనివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ ముబారక్ తెలిపిన వివరాల ప్రకారం, 50 కిలోల బియ్యంతో పాటు ఇతర అవసరమైన వస్తువులను వారికి అందజేశారు. ప్రభుత్వపరంగా పూర్తి సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు#కొత్తూరు మురళి.0 Comments 0 Shares 6 Views 0 Reviews
-
చౌడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంపుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె-పలమనేరు మార్గంలో శనివారం చిట్టిరెడ్డి పల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి వస్తున్న సుబ్రహ్మణ్యం, పాపన్న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ముందు వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బైక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కాలు విరగగా, పాపన్న తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు...0 Comments 0 Shares 23 Views 0 Reviews
-
పుంగునూరులో చీపురు పట్టిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిస్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాల్లో భాగంగా, అన్నమయ్య జిల్లా సబ్ కలెక్టర్ మరియు పుంగనూరు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ చల్లా కళ్యాణి పుంగనూరు మున్సిపాలిటీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోకుల్ సర్కిల్ వద్ద మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆమె స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. రాయల చెరువు డ్రైన్ క్యానల్ ను పరిశీలించి, అన్న క్యాంటీన్ లో అధికారులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు....0 Comments 0 Shares 23 Views 0 Reviews
-
సీఎం చంద్రబాబును కలిసిన పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్శనివారం యాదమరిలో ఏపీ సీఎం చంద్రబాబును పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చల్లా బాబు పుంగనూరు నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల గురించి సీఎంకు వివరించారు. అనంతరం సీఎం చంద్రబాబు చల్లా బాబుకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .0 Comments 0 Shares 23 Views 0 Reviews
-
చిత్తూరు: ఉపాధ్యాయురాలు శాశ్వతంగా విధుల నుంచి తొలగింపు: డీఈవోఉమ్మడి చిత్తూరు జిల్లా, పుంగనూరు మండలం, బండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిలక్ష్మి, డిసెంబర్ 3, 2024 నుండి అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. విద్యాశాఖ అధికారుల అనుమతి లేకుండా అమెరికా వెళ్లినట్లు విచారణలో తేలడంతో, డీఈవో రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఆమెను ఉపాధ్యాయ వృత్తి నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 23 Views 0 Reviews
-
పుంగనూరు మార్గంలో రోడ్డు ప్రమాదంఅన్నమయ్య జిల్లా, చౌడేపల్లె-పుంగనూరు మార్గంలో పుదిపట్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. పుంగనూరు నుంచి ఇంటికి వెళ్తున్న సుబ్రహ్మణ్యం, వినయ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని, తిరుపతి నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం కాలు విరగగా, వినయ్ స్వల్పంగా గాయపడ్డాడు. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు...0 Comments 0 Shares 28 Views 0 Reviews
-
రైతులకు భూములు ఇవ్వండి.. పుంగనూరులో తహసీల్దార్ కు వినతిపుంగనూరులో గత ప్రభుత్వంలో 5వేల కోట్లతో ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అయితే, తమ సాగు భూములను కోల్పోతామని గోపిశెట్టిపల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, భూములు తమకే ఇవ్వాలని తహసీల్దార్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఇప్పటికే 260 ఎకరాలు గత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పరిశ్రమకు 800 ఎకరాలు కేటాయించగా, ఇది ఏర్పడితే 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా₹ కొత్తూరు మురళి.0 Comments 0 Shares 29 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరులో అగ్నిప్రమాదంపుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం ఒక భవనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 34 Views 0 Reviews
-
పుంగనూరు: అదుపుతప్పి పొలాల్లోకి వెళ్లిన వాహనంపుంగనూరు పరిధిలో శుక్రవారం రోజున ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి ముల్బాగల్ కు వెళ్లే మార్గంలో ఒక కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దెబ్బతింది మరియు అందులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించగా, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు...0 Comments 0 Shares 30 Views 0 Reviews
-
పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళిపుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు రొంపిచర్ల క్రాస్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని తిరుపతి వైపు వెళ్లిన గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొన్నట్లు స్థానికులు తెలిపారు. రోడ్డుపై పడిన అతడిని స్థానికులు గుర్తించి 108 వాహనంలో పీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 30 Views 0 Reviews
-
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలుపుంగనూరు మండలం భీమగానిపల్లి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ గుణశేఖర్, ఆయన భార్య శ్రావణి, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. మదనపల్లె నుంచి పుంగనూరు వైపు వస్తున్న వాహనాన్ని ద్విచక్ర వాహనం ఓవర్ టేక్ చేసే క్రమంలో ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారంతా కలికిరి గుట్టపల్లికి చెందినవారు, అత్తగారింటికి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు....0 Comments 0 Shares 31 Views 0 Reviews
-
పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలిఅన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పుంగనూరు అధ్యక్షులు మునాఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను అరియర్స్ మరియు లీవ్ ఎన్ క్యాష్ మెంట్...0 Comments 0 Shares 31 Views 0 Reviews
More Stories