-
548 Posts
-
2 Photos
-
0 Videos
-
Followed by 6 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
పుంగనూరు మండలంలో దారుణంపుంగనూరు మండలం, నల్లగుట్లపల్లి తండాలో శనివారం రాత్రి ఒక చిన్నారిపై ఆమె పెదనాన్న అఘాయిత్యానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక దుకాణానికి వెళ్తున్న చిన్నారిని ఆటోలో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారి కడుపునొప్పితో ఏడుస్తుండగా, తల్లి విచారించగా అసలు విషయం బయటపడింది# కొత్తూరు మురళి .0 Comments 0 Shares 61 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
పుంగనూరులో అగ్ని ప్రమాదంపుంగనూరు మండలంలోని బర్నేపల్లెలో శనివారం మాధవికి చెందిన పూరి గుడిసె అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పుంగనూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఇంట్లో దీపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో బాధితులకు సుమారు రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
పుంగనూరులో పర్యటించిన స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులుఅన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో శనివారం స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ సభ్యులు కేజీ పద్మలత, జిల్లా డీఈఓ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. కేజీబీవీ, ప్యాలెస్ కాంపౌండ్ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 61 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం:ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేపుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం పాపిరెడ్డిగారి పల్లిలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు దామోదర, మధు, వాసు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మహా మంగళ...0 Comments 0 Shares 66 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం : ఆ వార్త పూర్తిగా అవాస్తవం: సీఐపుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ అనే వ్యక్తి పోలీసుల వేధింపులతో కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్టు వచ్చిన కథనం అవాస్తవమని సీఐ జయరామయ్య శుక్రవారం తెలిపారు. అతను బెట్టింగ్ యాప్ ద్వారా లక్షల రూపాయలు నష్టపోయి, అప్పులు చేశాడని, చోరీయత్నం చేస్తూ మహిళపై కత్తితో దాడి చేశాడని వివరించారు. కోర్టు ఆదేశాలతోనే స్టేషన్ కు హాజరై సంతకాలు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు#...0 Comments 0 Shares 58 Views 0 Reviews
-
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యేలుశుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఎమ్మెల్యేలు తెలిపారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 54 Views 0 Reviews
-
చౌడేపల్లిలో గంగమ్మ జాతర: ఎనిపోతు ఊరేగింపుతో ఘనంగా వేడుకలుచిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర సందర్భంగా ఎనిపోతు ఊరేగింపు ఏప్రిల్ 7, 8 తేదీలలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ వేడుకల కోసం గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఎనిపోతును ప్రత్యేకంగా అలంకరించి, మేళతాళాలు, డప్పుల శబ్దాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్తారు. యువతతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు...0 Comments 0 Shares 51 Views 0 Reviews
-
ఆంజనేయ స్వామి తిరునాళ్లలో కూటమి నాయకులు కొత్తూరు మురళిగురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం, మోదుగుల పల్లె పంచాయతీ, బడిగిరెడ్డి పల్లె గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ ఆంజనేయ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా స్వామి వారిని పుంగనూరు మండల టిడిపి నాయకులు మాధవ రెడ్డి, పుంగనూరు పట్టణ జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, జనసేన జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు చైతన్య రాయల్, క్లస్టర్ ఇంచార్జి గంగాధర్, AMC డైరెక్టర్ మసేన్న, APYSS జిల్లా అధ్యక్షుడు సుబ్రమణ్యం, EX సర్పంచ్...0 Comments 0 Shares 50 Views 0 Reviews
-
పుంగనూరు: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదంగురువారం సాయంత్రం పుంగనూరు మండలం, సుగాలిమిట్ట వద్ద మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలుగురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని పార్లమెంట్ ఆమోదించి తీర్మానించడమే దీనికి కారణం. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో బాణాసంచా కాల్చి, క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జెండాలు చేతబూని 'జై అమరావతి, జై చంద్రబాబు, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి' అంటూ నినాదాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు# కొత్తూరు...0 Comments 0 Shares 48 Views 0 Reviews
-
పుంగనూరు: మాజీ సీఎంను కలిసిన యువ నాయకులుగురువారం విజయవాడలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరు నియోజకవర్గానికి చెందిన యువ నాయకులు వేణు నాయక్, మహేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సుమంత్, మనోజ్ నాయక్, యుగంధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను జగన్కు వివరించారు. అనంతరం జగన్మోహన్...0 Comments 0 Shares 50 Views 0 Reviews
-
అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో సంబరాలు.డి. డి.ఆర్.డి.ఎ ఆదేశాల మేరకు, అమరావతిని రాజధానిగా ప్రకటించినందుకు పుంగనూరులో ప్రజలు గురువారం సాయంత్రం 7 గంటలకు వీ.ఓ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి, ఎస్.హెచ్.జి స్థాయిలో ఇళ్ల ముందు దీపాలు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీ.ఓ.ఎ మహమ్మద్ అలీ, పి. తులసి సంఘ, ఓ.బి పల్లవి సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు గ్రామ స్థాయిలో తమ సంతోషాన్ని చాటుకున్నారు# పుత్తూరు మురళి.0 Comments 0 Shares 50 Views 0 Reviews
-
పుంగనూరు ఏప్రిల్ 11 నుంచి రామచంద్ర యాదవ్ ధర్మదీక్షబీసీల న్యాయమైన హక్కుల సాధనకై బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలోని పూలే మండల్ వేదికగా ఈ దీక్ష జరుగుతుంది. బీసీ సింహ గర్జన సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లకు ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో రామచంద్ర...0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
పుంగునూరు:పుంగనూరులో ఫుడ్ సేఫ్టీ అధికారి పరిశీలనపుంగనూరు పట్టణంలో బుధవారం మధ్యాహ్న భోజనంలో బల్లి పడిన ఘటనపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గురు లక్ష్మి స్పందించారు. గురువారం నగరి కాంపౌండ్ మున్సిపల్ స్కూల్లో పరిశీలనలు చేసిన ఆమె, ఆహార పదార్థాల తయారీ శాంపిల్స్ ను ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 50 Views 0 Reviews
-
పుంగునూరు నియోజకవర్గం:గాజుల పల్లెలో వ్యక్తిపై కొడవలితో దాడిరొంపిచర్ల(M) గాజులపల్లిలో చంద్ర అనే వ్యక్తిపై దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముగ్గురు ఈశ్వరయ్యను తిట్టారు. ఆయన తిట్టడం ఏంటని ఈశ్వరయ్యకు సపోర్టుగా చంద్ర వచ్చి మాట్లాడాడు. ఈక్రమంలో ఆ ముగ్గురు చంద్రయ్యపై కొడవలితో దాడి చేశారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 62 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం : సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలుపుంగనూరు నియోజకవర్గం, సదుం మండల కేంద్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్య కిరణాలు నేరుగా స్వామివారి విగ్రహాలపై ప్రసరించాయి. ఈ అరుదైన సంఘటనను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో ఆలయ పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుబ్రహ్మణ్య, సూర్యాష్టకాలను పఠించారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 66 Views 0 Reviews
-
పుంగనూరు న్యాయవాదుల సంఘం బాధ్యతలు స్వీకరణ, న్యాయమూర్తుల నియామకంపై వినతిఅన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన కార్యదర్శి అరవింద్, ఉపాధ్యక్షులు గురుమూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిత్తూరు జిల్లా జడ్జి శ్రీమతి అరుణ సారికను కలిసి పుంగనూరు కోర్టులో న్యాయమూర్తుల నియామకం చేయాలని వినతిపత్రం సమర్పించారు. జిల్లా జడ్జి సానుకూలంగా స్పందించి, త్వరలోనే న్యాయమూర్తుల నియామకం హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని హామీ...0 Comments 0 Shares 64 Views 0 Reviews
More Stories