Andhra Pradesh
    మన ఎర్రచందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలొద్దు: పవన్ కల్యాణ్.
    రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమూలంగా నిర్మూలించాలని, అక్రమ రవాణాపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ఎర్రచందనాన్ని దేశంలో ఏ మూలన దాచిపెట్టినా వదలొద్దని, స్మగ్లర్లతో పాటు వారి వెనుకున్న కింగ్ పిన్‌లపైనా ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి...
    By Pagadala Venkateswar 2026-07-24 05:33:47 0 4
    Andhra Pradesh
    ఏపీ అస్త్రం' ఆవిష్కరణ.. భవిష్యత్ పోలీసింగ్‌పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
    ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీసులు రూపొందించిన 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో మూడు రోజుల పాటు జరిగిన 'ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్' కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నేరాల స్వరూపం, నేరస్థుల పద్ధతులు పూర్తిగా మారిపోయాయని, ఈ సవాళ్లను...
    By Pagadala Venkateswar 2026-07-24 05:32:05 0 4
    Andhra Pradesh
    Madanapalle: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని మదనపల్లె నేత కట్టా దొరస్వామి నాయుడు కొనియాడారు.
    మదనపల్లె: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నా వారందరికీ 'తల్లికి వందనం' పథకం వర్తింపజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు అన్నారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 22న బుధవారం అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను నేరుగా జమ చేయడం ద్వారా ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఒకే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు...
    By Pagadala Venkateswar 2026-07-24 05:26:59 0 7
    Andhra Pradesh
    భోగాపురంలో ప్రధాని సభకు 2 లక్షల మంది..!
    ఆగస్టు 1న PM మోదీ పాల్గొనే భోగాపురం బహిరంగ సభకు సుమారు 2 లక్షల మంది హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీగా పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్ కార్పెట్, ప్రకృతి, సన్దే, PSR లేఔట్లలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, VZM, విశాఖ జిల్లాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు కేటాయిస్తున్నారు. VIP, VVIP వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. #Rajesh
    By Boiena Rajesh 2026-07-24 05:25:51 0 9
    Andhra Pradesh
    Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్‌ను వీడియో కాల్‌లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
    Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్ (చిన్న)ను మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. వీడియో కాల్‌లో యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సమీమ్ అస్లాం, ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు.   మెరుగైన వైద్యం పొందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా, అంగళ్లు బైపాస్ వద్ద జరిగిన...
    By Pagadala Venkateswar 2026-07-24 05:25:17 0 7
    Andhra Pradesh
    అంగరంగ వైభవంగా జగన్నాథ స్వామి రథయాత్ర
    బొబ్బిలి పట్టణంలో శుక్రవారం జగన్నాధస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కంచరవీధిలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రథయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యే బేబినాయన స్వామిని దర్శంచుకొని పూజలు చేశారు. రథయాత్రకు పట్టణం, గ్రామీణ ప్రాంతాలు నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. #Rajesh
    By Boiena Rajesh 2026-07-24 05:24:03 0 10
    Andhra Pradesh
    Mulakalacheruvu: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం వర్తించకపోవడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ను వేడుకున్న తాత నాగమల్లప్ప.
    Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామంలో నివాసముంటూ కొమ్మిరి శ్రీవాణి కొమ్మిరి జనార్ధన మా తల్లిదండ్రులు మేము ముగ్గురము పిల్లలను ఉన్నాము. మాకు తల్లికి వందనం డబ్బులు అర్హుల జాబితాలో మా పేర్లు లేవు మేము కొత్తకోట కస్తూరిబాయ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కొమ్మిరి కీర్తన, ఏడో తరగతి చదువుతున్న కొమ్మిరి మాతా శ్రీ, సోంపల్లి పంచాయతీ రెడ్డివారి పల్లి స్కూల్లో కొమ్మిరి శ్రావణీంద్ర ఐదవ తరగతి చదువుతున్నారు, కానీ మేము తల్లికి వందనం డబ్బుల అర్హుల జాబితాలో మా పేర్లు లేవు మాకు...
    By Pagadala Venkateswar 2026-07-24 05:22:19 0 7
    Andhra Pradesh
    Madanapalle: అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వెల్లడించిన అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ.
    మదనపల్లె: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEs)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు.   మేధావులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు IIT-JEE, NEET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం,...
    By Pagadala Venkateswar 2026-07-24 05:20:07 0 7
    Andhra Pradesh
    Madanapalle: మదనపల్లె తాగునీటి బోరు తవ్వకాలను వేంపల్లి ప్రజలు అడ్డుకున్నారు. భూగర్భ జలాలు పడిపోతాయని ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
    మున్సిపాలిటీ కోసం బోరు తవ్వకాలు.. అడ్డుకున్న వేంపల్లి గ్రామస్థులు   మదనపల్లె, జూలై 23: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో నెలకొన్న తాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని అర్బన్ మున్సిపాలిటీకి నీటి సరఫరా కోసం వేంపల్లి పంచాయతీ పరిధిలో బోరు తవ్వేందుకు అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు.   అయితే గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోతాయని, తమ గ్రామానికి భవిష్యత్తులో నీటి సమస్య మరింత తీవ్రమవుతుందనే ఆందోళనతో గ్రామస్థులు అధికారులను అడ్డుకున్నారు.   ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ,...
    By Pagadala Venkateswar 2026-07-24 05:16:51 0 7
    Andhra Pradesh
    జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!
    అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. ఆలయంలో నేడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
    By Pagadala Venkateswar 2026-07-24 05:14:24 0 6
    Andhra Pradesh
    అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
    అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4 స్ఫూర్తితో కనిగిరి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి, ఈరోజు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించాను. కనిగిరి ప్రజలకు ఆధునిక, పారదర్శకమైన ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడం ఎంతో...
    By Chennaiah Kati 2026-07-23 15:52:30 0 20
    Andhra Pradesh
    రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
    రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మౌలిక వసతుల లోపం వల్ల ఒక్క రైతు కూడా నష్టపోకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యం,ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన పంట తడిసి నష్టపోవడం అత్యంత బాధాకరం.2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు, ఆ ఐదేళ్లలో మార్కెట్ యార్డుకు ఎంత నిధులు కేటాయించారో, ఎన్ని గోదాములు నిర్మించారో, డ్రైనేజీ అభివృద్ధికి ఏ పనులు చేపట్టారో...
    By Chennaiah Kati 2026-07-23 15:48:10 0 20
More Blogs
Read More
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో వెలసిన సుగుటూరు గంగమ్మ జాతరకు రెండో చాటింపు ఇదే
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ...
By Kothuru Murali 2026-03-07 06:54:48 0 163
Telangana
ఎన్. టీ. ఆర్ పరిపాలనను ఆదర్శంగా తీసుకోవాలి: ఆర్. వి. కె
ఖమ్మం: ఖమ్మం నగరంలో జరిగిన ఎన్. టీ. ఆర్  వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న శత తారక ఆర్గనైజేషన్...
By Krishna Balina 2026-01-19 04:30:38 0 495
Andhra Pradesh
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ముగిసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీ లో మంగళవారం నిర్వహించిన స్పెషల్...
By Pagadala Venkateswar 2026-07-15 05:26:07 0 43
SURAKSHA
Karnataka Police's Special Initiatives for Women's Safety
Karnataka Police has taken several significant initiatives to ensure the safety and security of...
By Kalaga Sailaja 2026-06-26 10:30:19 0 76
Andhra Pradesh
Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు.
విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన...
By Pagadala Venkateswar 2026-01-25 06:25:53 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com