Andhra Pradesh
    పుంగనూరులో కార్యకర్తల సమీక్ష.. మహానాడుపై చర్చ
    పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు జోనల్ కోఆర్డినేటర్‌గా స్టేట్ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, నియోజకవర్గ అబ్జర్వర్‌గా శాప్ చైర్మన్ రవి నాయుడు, ఇన్చార్జ్‌గా చల్లా బాబు ఆధ్వర్యంలో కార్యకర్తల సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమంపై చర్చించారు. కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీకి మంచి పేరు తేవాలని దామచర్ల సత్య సూచించారు# కొత్తూరు మురళి.
    By Kothuru Murali 2026-05-24 17:39:08 0 6
    Andhra Pradesh
    పుంగనూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
    పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం శవపరీక్ష నిర్వహించిన అనంతరం, తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పోలీసులు వెల్లడించారు# కొత్తూరు మురళి .
    By Kothuru Murali 2026-05-24 17:36:00 0 7
    Andhra Pradesh
    పుంగనూరు: ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ లో బక్రీద్ పండుగ సందర్భంగా ఆదివారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఐ సుబ్బరాయుడు మాట్లాడుతూ, పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పండుగ సందర్భంగా గొడవలు సృష్టిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ సభ్యులు ఇబ్రహీం, ఇస్మాయిల్, హిందూ సంఘాల కమిటీ సభ్యులు త్రిమూర్తి రెడ్డి పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    By Kothuru Murali 2026-05-24 17:33:19 0 7
    Andhra Pradesh
    పుంగనూరులో సిపిఐ నాయకుల నిరసన
    పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సీపీఐ నాయకులు ఆదివారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీపీఐ నాయకుడు వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దశలవారీగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
    By Kothuru Murali 2026-05-24 17:30:51 0 7
    Andhra Pradesh
    పుంగనూరులో కరపత్రాలు విడుదల చేసిన ఏఐఎస్ఎఫ్
    అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో బసరాజ పాఠశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులు జూన్ 6, 7 తేదీలలో నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి కే మాధవ్, రాష్ట్ర సమితి సభ్యులు మున్నా ఆదివారం తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థి ప్రతినిధులు, నాయకులు హాజరై విద్యారంగ సమస్యలు, నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించనున్నట్లు వారు పేర్కొన్నారు#కొత్తూరు మురళి.
    By Kothuru Murali 2026-05-24 17:27:53 0 7
    Andhra Pradesh
    బంగ్లా గ్రామంలో వికసించిన మే పుష్పం
    పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, బంగ్లా గ్రామంలో ఆదివారం అరుదుగా కనిపించే మే పుష్పం వికసించింది. ఈ పుష్పాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆసక్తి చూపారు. ప్రతి సంవత్సరం మే నెలలో మాత్రమే ఈ పుష్పాలు వికసిస్తాయని ఇంటి యజమాని శివయ్య నాయుడు తెలిపారు. ఈ పువ్వు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉందని ప్రజలు అభిప్రాయపడ్డారు#కొత్తూరు మురళి.
    By Kothuru Murali 2026-05-24 17:24:46 0 7
    Andhra Pradesh
    పులిచెర్ల: అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సరకులు "పంపిణీ"
    పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురైన కుటుంబానికి శనివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ ముబారక్ తెలిపిన వివరాల ప్రకారం, 50 కిలోల బియ్యంతో పాటు ఇతర అవసరమైన వస్తువులను వారికి అందజేశారు. ప్రభుత్వపరంగా పూర్తి సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు#కొత్తూరు మురళి. 
    By Kothuru Murali 2026-05-24 17:21:18 0 7
    Andhra Pradesh
    హాలహరివి గ్రామంలో తాగునీటి కష్టాలు
    కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి గ్రామపంచాయతీ సెక్రెటరీ త్రాగునీటి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ అధికారి /MPDO గారికి హాలహర్వి గ్రామం తాగునీటి కష్టాలు అని చాలా సార్లు తెలియజేయడం జరిగింది. కానీ ఏమాత్రం చూసి చున్నట్టు ఉండడం చాలా బాధాకరమని తెలియజేశారు. ప్రజలు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యమని మా గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు, ఈ విషయాన్ని పంచాయతీ సెక్రెటరీ గారికి పలుమార్లు తెలియజేసిన కూడా సరైన చర్యలు...
    By Boya Dasthagiri 2026-05-24 15:13:59 0 17
    Andhra Pradesh
    ఎమ్మిగనూరు మండలంలోని కడిమెట్ల గ్రామంలో తాగునీటి కష్టాలు
    కడిమెట్ల పంచాయతీ సెక్రెటరీ అధికార త్రాగునీరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని  గ్రామ పంచాయతీ అధికారి MPDO గారికి కడిమెట్ల విషయం గ్రామంలో త్రాగునీటి సమస్యపై పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. మా గ్రామంలో త్రాగునీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ సెక్రటరీ గారికి పలుమార్లు తెలియజేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది.కాబట్టి వెంటనే సమస్యను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుని గ్రామానికి...
    By Boya Dasthagiri 2026-05-24 14:14:06 0 24
    Andhra Pradesh
    మదనపల్లె-రామసముద్రం ఆర్టీసీ బస్సుల దుస్థితి.. ప్రయాణికుల ఆవేదన.
    మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు సరిగా లేకపోవడం, ఉన్నవి కూడా తరచూ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర పనులపై వెళ్లేవారు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సి వస్తోంది. మెరుగైన సేవలు అందించాలని, అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.
    By Pagadala Venkateswar 2026-05-24 07:41:39 0 18
    Andhra Pradesh
    మదనపల్లిలో "ఆపరేషన్ క్లీన్ స్విప్పు" ప్రారంభం
    మదనపల్లిని పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. నాలుగు వారాల కార్యాచరణలో భాగంగా మున్సిపల్ అధికారులు, కార్మికులు పట్టణంలో చెత్త తొలగింపు చేపట్టారు. చెత్త వేస్తే జరిమానాలు, షాపుల సీజింగ్ తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి పౌరుడు పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
    By Pagadala Venkateswar 2026-05-24 07:39:22 0 19
    Andhra Pradesh
    చౌడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె-పలమనేరు మార్గంలో శనివారం చిట్టిరెడ్డి పల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి వస్తున్న సుబ్రహ్మణ్యం, పాపన్న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ముందు వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బైక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కాలు విరగగా, పాపన్న తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు  మురళి .
    By Kothuru Murali 2026-05-23 14:19:15 0 24
More Blogs
Read More
Andhra Pradesh
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం
*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*   *-నియోజకవర్గ యువనాయకులు మండలి...
By Rajini Kumari 2026-03-27 13:12:42 0 164
Andhra Pradesh
జై భీమ్ సినిమా స్పూర్తి ప్రదాత, రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు నేడు కర్నూలు రాక!!
కర్నూలు : జై భీమ్ సినిమా స్పూర్తి దాత జస్టిస్ చంద్ర ఈరోజు కర్నూల్ లో జరిగే  రాజ్యాంగం...
By Hari Krishna 2025-12-13 02:15:17 0 311
Andhra Pradesh
మదనపల్లె: RTC బస్సు కండక్టర్ దురుసు ప్రవర్తన.
పుంగనూరు డిపోకు చెందిన ఓ ఆర్టీసీ కండక్టర్ మదనపల్లెలో బస్సు ఎక్కిన వృద్ధురాలితో దుర్భాషలాడటం తీవ్ర...
By Pagadala Venkateswar 2026-04-11 06:20:11 0 75
Andhra Pradesh
అనంతపురం జిల్లా :కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
జిల్లా కేంద్రంలోని నంబూరి వైన్ షాప్ పై దాడి, నిప్పంటించడంతో పాటు ఆస్తి నష్టపరిచిన కేసులో ముగ్గురు...
By Eslavath RameshNaik 2026-01-17 11:15:33 0 464
Andhra Pradesh
గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు
కృష్ణాజిల్లా పోలీస్   *గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా...
By Rajini Kumari 2026-01-25 11:11:48 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com