0 Comments
0 Shares
337 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
*మార్కాపురం జిల్లా *పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతిమార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి పెద్ద దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సచివాలయం ఎదురుగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన మినీ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో భ్రమరాంబ చెంచు కాలనీకి చెందిన దాసరి అంకన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అంకన్న పెద్ద దోర్నాలలో పనులు ముగించుకుని తన నివాసమైన బి.ఎం.సి కాలనీకి తిరుగు ప్రయాణం అవుతుండగా, మార్గమధ్యలో చిన్న...0 Comments 0 Shares 385 Views 0 Reviews
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం!అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలంగాణకు చెందిన ఇద్దరమ్మాయిల దుర్మరణం! అమెరికాలో కారు లోయలో పడడంతో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.... మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన పులఖండం మేఘనారాణి(25), కరీంనగర్ జిల్లా ముల్కనూరు చెందిన కడియాల భావన(24) ఎంఎస్ చేయడానికి మూడు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం సెర్చ్...0 Comments 0 Shares 299 Views 0 Reviews
-
ఈడిగపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంపుంగనూరు మండలం, ఈడిగపల్లి గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి మదనపల్లికి వెళ్తున్న బొలెరో వాహనాన్ని, మదనపల్లి నుంచి వస్తున్న కారు ఓవర్టేక్ చేయబోతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి# కొత్తూరు మురళి .0 Comments 0 Shares 265 Views 0 Reviews
-
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. మదనపల్లె యువకుడు మృతి.కర్ణాటకలోని చింతామణిలో సొంత పనిమీద వెళ్లిన మదనపల్లెకు చెందిన సమీర్ భాష (38) శుక్రవారం వేకువజామున తిరిగి వస్తుండగా, రాయల్పాడు మండలం తూపల్లి క్రాస్ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న లారీని బైక్తో ఢీకొట్టాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో సమీర్ భాష అక్కడికక్కడే మృతి చెందాడు. తాలూకా సీఐ కళా వెంకటరమణ ఈ విషయాన్ని తెలిపారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.0 Comments 0 Shares 181 Views 0 Reviews
-
కాకినాడలో రోడ్డు ప్రమాదం – చికిత్స పొందుతూ వ్యక్తి మృతిసామర్లకోట–కాకినాడ కెనాల్ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని కలిగించింది. వెంకటకృష్ణరాయపురం గ్రామానికి చెందిన తుమ్మల కొండలరావు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం, కొండలరావు సోమవారం సాయంత్రం రహదారిపై ప్రయాణిస్తుండగా మాధవపట్నం సమీపంలో జేసీబీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటనను...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
గుంటూరు జిల్లాలో 25% మేర తగ్గిన రోడ్డు ప్రమాద మరణాలుగుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై నియంత్రణకు చేపట్టిన చర్యలు ఫలితాన్నిచ్చాయి. 2025 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ ఏడాది 322 మంది మృతి చెందగా, 2024లో 429 మంది మరణించారు. దీంతో 25 శాతం మేర తగ్గుదల నమోదైంది. అలాగే ఈ సంవత్సరం 76 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది తో పోలిస్తే 6% తగ్గాయి. ఈ కేసులలో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారంతో కూడినవిగా ఉన్నవి.0 Comments 0 Shares 262 Views 0 Reviews
-
ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతిభద్రాచలం నుడి ఛత్తీస్గఢ్ వెళ్ళే జాతీయ రహదారి NH30 పై శనివారం రాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వలస కూలీలు పనులు ముగించి 11 మంది బొలెరో వాహనంలో వారి స్వగ్రామాలకువెళ్తుండగా అదుపుతప్పి కల్వర్టును ఢీకొనగ ఒకరు మృతి చెందారు.0 Comments 0 Shares 249 Views 0 Reviews
-
చీరాల పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంచీరాల - పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఆటో ఢీకొని అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మయ్య, సుబ్బయ్య, ఉదయం పొలానికి వెళ్లి తిరుగు వస్తుండగా వెనుకవైపుగా ఆటో ఢీకొట్టడంతో తలకు బలంగా గాయలై అక్కడికక్కడ మృతి చెందగా సమాచారం అందుకున్న పోలీసు వారు పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న చీరాల టిడిపి అధికార...0 Comments 0 Shares 431 Views 0 Reviews
-
చౌడేపల్లి మండలంలో రోడ్డు ప్రమాదంపుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె-పలమనేరు మార్గంలో శనివారం చిట్టిరెడ్డి పల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చేపలు పట్టడానికి వెళ్లి తిరిగి వస్తున్న సుబ్రహ్మణ్యం, పాపన్న ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ముందు వెళ్తున్న ఆటో అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బైక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం కాలు విరగగా, పాపన్న తలకు బలమైన గాయాలయ్యాయి. వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు...0 Comments 0 Shares 38 Views 0 Reviews
-
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంపైడి భీమవరం నుంచి రణస్థలం రూట్ లో ఇద్దరు యువకులు 400 సిసి స్పోర్ట్స్ బైక్ అధిక వేగం నడవడం వలన అదుపుతప్పి డివైడర్ గుద్ధి ఒకరు స్పాట్ లో. లంక మోహన్ రావు19 వయసు.చనిపోయారు. ఒకరు కొనఊపిరితో ఉన్నట్టు గుర్తించి మెరుగైన వైద్యం కోసం డ్రీమ్స్ హాస్పిటల్ కి తరలించారు0 Comments 0 Shares 275 Views 0 Reviews
-
జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదంకాణిపాకం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీని - కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొంది. ఘటనలో కారులో చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు చిత్తూరులోని గిరింపేటకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.0 Comments 0 Shares 181 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో యువ అధ్యాపకుని దుర్మరణంతూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ అధ్యాపకుడు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్న అనపర్తికి చెందిన కోకా దినేష్ (25) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, శనివారం సూరంపాలెంలోని ఆదిత్య కళాశాలకు పనిమీద వెళ్లిన దినేష్, తిరిగి బైక్పై ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో...0 Comments 0 Shares 836 Views 0 Reviews
-
లారీ ఢీకొని పోస్ట్మాస్టర్కు తీవ్ర గాయాలుసామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని పెట్రోల్ బంకు సమీపంలో స్కూటీపై ప్రయాణిస్తున్న పోస్ట్మాస్టర్ మలకల సూర్యారావును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రజలు సూర్యారావును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని...0 Comments 0 Shares 1K Views 0 Reviews
More Results