-
69 Posts
-
4 Photos
-
0 Videos
-
Followed by 0 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
చింతూరు ఐటిడిఏ ముందు గిరిజనుల ధర్నా!పోలవరం జిల్లా కేంద్ర రంపచోడవరంలో ఈరోజు గిరజన చట్టాల సాధనకై జరుగుతున్న మహాగర్జన సభకు వెళ్తున్న గిరిజనులను చింతూరు పోలీసులు అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో జీఓ నెంబర్ 3 కి సమానమైన చట్టం తెస్తాము అని గిరిజనులకు హామీ ఇచ్చి సరిగ్గా రెండు సంవత్సరాలు గడుస్తున్న ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో. పోలవరం జిల్లాలో సీఎం పర్యటన ఈనెల ఉండగా గిరిజన...0 Comments 0 Shares 32 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
పోలవరం జిల్లాలో: చేపల వేటకు వెళ్లి నలుగురు ప్రమాద వశత్తు గోదావరిలో గల్లంతు!పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ప్రమాద వశత్తు నీటిలో గల్లంతు కాగా అంతరం చేపట్టి గాలింపు చర్యల్లో మృత దేహాలను వెలికి తీశారు. మృతి చెందిన వారు గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే సుశీల, ఊకె లక్ష్మీ, తుర్రం భారతీ, ఊకె రమేష్,బాసిబోయిన బాలరాజుగా గుర్తించారు. ముగ్గురు స్త్రీలు, ఇద్దరు పురుషులుగా...0 Comments 0 Shares 29 Views 0 Reviews
-
ఎట్టకేలకు చింతూరులో దంచి కొడుతున్న వర్షం!పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఈరోజు సాయంకాలం 3 గంటలకి వర్షం ప్రారంభమైంది. గత నెల 20, 24, తేదీల్లో కురిసిన జల్లులు మినహా ఎల్నినో ప్రభావంతో మరల ఈరోజు వర్షం కురుస్తుంది. గత నెలలో వర్షం లేక రైతులు వరి ఇతరత్రా నారుమడులు సిద్ధం చేసుకోలేకపోయారు. ఈరోజు కురుస్తున్న వర్షంతో రైతులు నారుమడులు సిద్ధం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కొందరు రైతులు తెలిపారు.0 Comments 0 Shares 30 Views 0 Reviews
-
సీలేరు, డొంకరాయి నుండి గోదావరి డెల్టాకు నీరు విడుదల: చింతూరుపోలవరం జిల్లా తూర్పు డివిజన్ చింతూరు పరిధిలోని సీలేరు, డొంకరాయి నుండి గోదావరి డెల్టా మూడు కాలువలకు నీరుని విడుదల చేశారు. డొంకరాయి జలాశయం నుంచి 3000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకి విడుదల చేస్తున్నట్టు ఏపీ జెన్కో అధికారులు స్పష్టం చేశారు. 16 నుండి 25 వరకు డొంకరాయి ప్రధాన ఆనకట్ట 6,7 గేట్ల నుండి నీటిని ధవలేశ్వరం అధికారుల మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఏ,పి జెన్కో...0 Comments 0 Shares 44 Views 0 Reviews
-
సరైన సమయంలో వైద్య సేవలు అందక గిరిజన యువత మృతి!చింతూరు డివిజన్ ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతం కర్మన్ కొండ లో గత మూడురోజుల క్రితం పాముకాటుకు గురైన యువతి సూట్రు సమ్మక్క ప్రియ (18) సంవత్సరాలు డోలిమోతతో కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చికిత్స నిమిత్తం చేర్పించినా సంగతి విదితమే. ఈరోజు సమ్మక్క ప్రియ విజయవాడ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. వివరాల ప్రకారం పాముకాటు వేసిన సోమవారం రాత్రి చికిత్స కోసం కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేర్పించగా...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
ఏజెన్సీలో ఆగని డోలిమోతలు : చింతూరుపోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో ప్రాథమిక ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు. కూనవరం మండలం కొత్త కార్మన్ కొండ, గిరిజన గూడెం కి చెందిన సమ్మక్క ప్రియ అనే బాలిక పాము కాటుకి గురైంది వారి గిరిజన గూడెం కి రోడ్డు మార్గం లేక ఆంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను వారి కుటుంబ సభ్యులు నాలుగు కొండలు డోలితో దాటించి కూటూరు...0 Comments 0 Shares 94 Views 0 Reviews
-
చింతూరు డివిజన్ ఏపియూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) చింతూరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. నిమ్మలగూడెంలోని జేకేసిటీ ఫంక్షన్ హాల్లో జరిగిన కీలక సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడు, సౌకత్అలీ ప్రధాన కార్యదర్శి: నీలపు రాజేష్ రెడ్డి ఎన్నికైన అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం...0 Comments 0 Shares 94 Views 0 Reviews
-
చింతూరు ఏరియా ఆసుపత్రిలో ప్రసవ ఆపరేషన్లు నిలిచిపోయాయి: సీపీఐ(ఎం) ఆరోపణ!చింతూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వారం రోజులుగా ప్రసవ సేవలు నిలిచిపోయాయని సీపీఐ(ఎం) నాయకులు పల్లపు వెంకట్, సీసం సురేష్ ఆరోపించారు. ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, సిజేరియన్ ప్రసవాలు పూర్తిగా ఆగిపోయాయని వారు తెలిపారు. గతంలో ఉన్న ఎం,వి, కోటిరెడ్డి పదవి విరమణ చేయడంతో అనస్థీషియా డాక్టర్ లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. "ఈ...0 Comments 0 Shares 119 Views 0 Reviews
-
భద్రాచలం - చింతూరు హైవే పై షార్ట్ సర్క్యూట్ తో కోళ్ల వ్యాన్ దగ్ధం!చింతూరుకు చెందిన కోళ్ల వ్యాపారి.. కోళ్లను లోడ్ చేసుకోవడం కోసం ఒక బొలెరో వాహనం తో భద్రాచలం వైపు వెళ్తుండగా. సరిగ్గా ఏడుగురాళ్లపల్లి - కాటుకపల్లి గ్రామాల మధ్యకు రాగానే.రన్నింగ్లో ఉన్న వ్యాన్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. అంతే.. క్షణాల్లో మంటలు వ్యాపించి బండి మొత్తం వ్యాపించాయి. దట్టమైన పొగలు, మంటలు చూసి స్థానికులు వెంటనే అలెర్ట్ అయ్యారు. చేతికి దొరికిన నీళ్లతో ఎలాగోలా కష్టపడి...0 Comments 0 Shares 128 Views 0 Reviews
-
చింతూరు: తల్లి, బిడ్డ మృతి శోక సంద్రంలో కుటుంబం!చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన గర్భిణీ దుర్గాలక్ష్మీ పురిటినొప్పులతో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలోకి రాగా ప్రసవ అనంతరం అదికంగా రక్తస్రావం వలన పరిస్థితి విషమించడంతో భద్రచలం రిఫర్ చేయగా మార్గం మధ్యలో మృతిచెందింది. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంగానే తల్లి, బిడ్డ మృతి చెందారు అని కుటుంబ సభ్యులు, తమకు న్యాయం చెయ్యాలి తక్షణమే చింతూరు ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఐ,టి,డి,ఏ ఎదుట...0 Comments 0 Shares 159 Views 0 Reviews
-
చింతూరులో గూడ్స్ వాహనం సీజ్, నాలుగువేల రెండువందల ఫైన్!చింతూరులో ఆదివారం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వాహనానాన్ని సీజ్ చేసినట్లు చింతూరు ఎస్ ఐ ,సంతోష్ కుమార్ తెలిపారు. భద్రాచలం నుండి కోరుకొండకి 20మందితో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసి రూ,4200 ఫైన్ విధించి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి అప్పగించమని తెలిపారు. ఇటీవల కాలంలో మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు మీద అధికంగా గూడ్స్ వాహనాలు జనాలను అధిక సంఖ్యలో ఎక్కించుకుని బోల్తాపడిన సంఘటనలు అదికంగా...0 Comments 0 Shares 166 Views 0 Reviews
-
చింతూరు: సీలేరు నదిలో స్నానానికి దిగి వ్యక్తి ప్రమాద వశత్తు మృతి!పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు కాలనీ సమీపంలోని పిక్నిక్ స్పాట్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన సబ్బవరపు ఆనంద్ సీలేరు నదిలో మునిగి మృతి చెందారు. మూడు కుటుంబాలకు చెందిన 13 మంది మూడు కార్లలో చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలో సీలేరు నది వద్ద నదిలో దిగి స్నానాలు చేస్తూ ఉండగా నీటి...0 Comments 0 Shares 168 Views 0 Reviews
-
చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్ అప్లికేషన్ను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఒక భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ యాప్ ఎలా ఉపయోగించాలి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటి అనే విషయాలపై మహిళలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎం సుధాకర్ మాట్లాడుతూ.. ఈ డిజిటల్ యాప్ ద్వారా మహిళా సంఘాల ఆర్థిక...0 Comments 0 Shares 192 Views 0 Reviews
-
చింతూరు: పొల్లూరు జలపాతంలో ప్రమాద వశత్తు నీటిలో మునిగి యువకుడి మృతి!చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొల్లూరు జలపాతం వద్ద ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా కామవరపుకోటకు చెందిన అఖిల్ (22) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పొల్లూరు జలపాతాన్ని సందర్శించడానికి వచ్చాడు. అందరూ కలిసి జలపాతం అందాలను ఆస్వాదిస్తూ, నీటిలో కేరింతలు కొడుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. అఖిల్ ప్రమాదవశాత్తు జలపాతంలోని లోతైన నీటి గుండంలో పడి...0 Comments 0 Shares 176 Views 0 Reviews
-
మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం 20 మందికి తీవ్ర గాయాలు!మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డుపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లా జి.మేడపాడు, గంటి పెదపూడి, జగ్గంపేట ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది ఒక గ్రూప్గా ఏర్పడి చింతూరు వైపు విహారయాత్ర కోసం ఒక బోలెరో వాహనంలో బయలుదేరారు. అయితే, శుక్రవారం రోజున మారేడుమిల్లి-చింతూరు మధ్య ఉన్న ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన...0 Comments 0 Shares 203 Views 0 Reviews
-
వరదల సన్నద్ధత పై రేపు చింతూరు ఐటీడీఏ లో సమావేశం!వర్షాకాలం వచ్చేస్తోంది.. వరద ముప్పు పొంచి ఉంది! ఈ నేపథ్యంలో అధికారులు అందరూ ఈ వరదల నివారణ,సహాయ చర్యలు,నిర్వాసితుల పునరావాసం మొదలగు వరద ముందస్తు సన్నద్ధతపై ఈనెల 6వ తేదీన (శనివారం) చింతూరులో సమావేశం జరగబోతోంది. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరదలు వస్తే ఎలా తట్టుకోవాలి? ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ముంపు వస్తే ప్రజలను ఎలా కాపాడాలి? సహాయక చర్యలు ఎలా ఉండాలి? అనే...0 Comments 0 Shares 182 Views 0 Reviews
-
చింతూరు పోలీసుల తనిఖీలో గంజాయితో పట్టుబడ్డ యువకులు!చింతూరు మండలం మోటు జంక్షన్ వద్ద పోలీసులు బుధవారం సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఒకే స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురు యువకులను ఆపి తనిఖీ చేయగా అసలు రంగు బయటపడింది. వారి వద్ద నుంచి ఏకంగా 4 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.వీరంతా ఒరిస్సా నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు పట్టుబడిన ముగ్గురు యువకులు...0 Comments 0 Shares 185 Views 0 Reviews
-
చింతూరులో తృటిలో తప్పిన పెను ప్రమాదం: మంటల్లో దగ్ధమైన గూడ్స్ లారీ!చింతూరు మార్గంలో బుధవారం ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం నుండి చింతూరు వైపు వెళ్తున్న ఒక గూడ్స్ లారీ (నెంబర్: CG 18S 8034) ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది.మారేడుమిల్లి నుండి చింతూరు వైపు ఘాటీ దిగి తులసిపాక రాగానే, లారీ వెనుక వైపు ఉన్న టైర్ల నుండి ఒక్కసారిగా నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. లారీ డ్రైవర్ గమనించే లోపే ఆ నిప్పురవ్వలు కాస్తా పెద్ద మంటలుగా మారి, క్షణాల వ్యవధిలోనే వాహనం...0 Comments 0 Shares 199 Views 0 Reviews
More Stories