-
45 Posts
-
4 Photos
-
0 Videos
-
Followed by 0 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు నిప్పులు కొలిమిలా మారనున్న రాబోయే నాలుగు రోజులు : పి వో. శుభం నోక్వాల్చింతూరు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) శుభం నోక్వాల్ గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.వాతావరణం దారుణంగా మారే అవకాశం ఉన్నందున ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.పోలవరం జిల్లా చింతూరులో రాబోయే నాలుగు రోజుల పాటు తీవ్రమైన వడగాల్పులు (Heat waves) వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం 44 డిగ్రీలు నమోదయ్యాయి ముఖ్యంగా ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఎండ...0 Comments 0 Shares 29 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
రత్నాపురంలో 3 రోజుల పాటు కేంద్రప్రభుత్వ పథకాలపై ప్రత్యేక "డ్రైవ్"చింతూరు గ్రామపంచాయతీ రత్నాపురం లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి గిరిజన ప్రజలకు మూడు రోజులపాటు చింతూరు ఐటీడీఏ పీవో శుభంనొక్వల్ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక నోడల్ అధికారి అనిల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన కిసాన్ సన్మానిధి యోజన, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి మాతృ వందన...0 Comments 0 Shares 33 Views 0 Reviews
-
అరణ్య శ్రీ ద్వారా డ్వాక్రా మహిళలలకు ఆర్ధికాభివృద్ధి: కలెక్టర్ దినేష్ కుమార్!గిరిజన ప్రాంత మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా సరికొత్త అడుగు పడింది. 'అరణ్య శ్రీ' కార్యక్రమం ద్వారా ద్వాక్రా మహిళలకు భారీ లబ్ధి చేకూరనుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం చింతూరు మండలం గొందిగూడెంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణతో పాటు స్థానిక మహిళలకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని...0 Comments 0 Shares 56 Views 0 Reviews
-
అడవిలో చావు బతుకు మధ్య దొరికిన "అపరంజి" ఉపిరి పోసిన చింతూరు వైద్యులు!"కన్నప్రేమ కరువైందో.. లేక ఆడపిల్ల అనే అనాగరికపు ఆలోచనో తెలీదు కానీ, పురిట్లోనే ఆ పసికందును అడవి పాలు చేశారు. శీతాకాలపు చలిలో, క్రూర జంతువుల మధ్య చింతూరు మండలం మదుగూరు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఒంటరిగా విడిచిపెట్టబడిన ఆ నవజాత ఆడ శిశువును అదృష్టవశాత్తూ జనవరి 19న ఆశా కార్యకర్తలు గుర్తించారు. వెంటనే స్పందించి ఆమెను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తెచ్చే సమయానికి ఆ పసికందు పరిస్థితి...0 Comments 0 Shares 55 Views 0 Reviews
-
పోలవరం నిర్వాసిత గిరిజనేతరులు ఆప్షన్ ఫారంలు త్వరగా ఇవ్వాలి!పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పునరావాసం కోసం నిర్దేశించిన ఆప్షన్ ఫారమ్లను వెంటనే సమర్పించాలని చింతూరు ఐటీడీఏ పీఓ (Project Officer) శుభాంనోక్వల్ సూచించారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన ఈ ప్రకటన చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత సమర్పించే ఏ ఆప్షన్ ఫారమ్లను పరిగణనలోకి తీసుకోబోమని పీఓ స్పష్టం చేశారు. ప్రాజెక్టు కారణంగా...0 Comments 0 Shares 65 Views 0 Reviews
-
చింతూరు మండలం లక్కవరంలో వ్యక్తి దారుణ హత్య.చింతూరు మండలంలోని లక్కవరం గ్రామంలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. రమేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి అత్యంత కిరాతకంగా హతమార్చారు. అయితే, ఈ హత్య వెనుక ఒక గగుర్పొడిచే గతం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.గత ఏడాది ఇదే లక్కవరం గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో "క్షుద్రపూజలు చేస్తున్నాడనే" నెపంతో రామయ్యను చంపినట్లు రమేష్పై ఆరోపణలు...0 Comments 0 Shares 59 Views 0 Reviews
-
గిరిజనుల వినూత్న నిర్ణయం అతిక్రమిస్తే "రెండు లక్షలు" జరిమానా!తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాలు తమ ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఒక వినూత్నమైన, కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఆధునికత వైపు మళ్లుతూ తమ మూలాలను మరుస్తున్న ప్రస్తుత తరం గిరిజనులలో మార్పు తీసుకురావడానికి గిరిజన పెద్దలు, నాయకులు ఏకగ్రీవంగా ఒక చారిత్రక తీర్మానాన్ని ఆమోదించారు.గిరిజనుల సాంప్రదాయ శుభకార్యాల్లో ఒకప్పుడు రేల నృత్యం, కొమ్ము నృత్యాలు ప్రధాన...0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరంచింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి చెప్పే ఆదివాసి రేలా ఉత్సవాలలో వేలాది గిరిజనులు తరలివచ్చి జయప్రదం చేయాలని గిరిజన సంఘం మండల ఆధ్వర్యంలో వాల్ పోస్టులు ఆవిష్కరణ చేశారు గిరిజన సంఘం నాయకులు పొడియం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం గ్రామస్తులతో మాట్లాడుతూ ఈనెల 24 25 26 తేదీలలో రంపచోడవరం కేంద్రంగా గిరిజన సంఘం...0 Comments 0 Shares 80 Views 0 Reviews
-
చింతూరు ఘాట్ రోడ్డులో 'భారీ' బ్రేక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!పోలవరం జిల్లాకు గుండెకాయలాంటి మారేడుమిల్లి - చింతూరు ఘాట్ రోడ్డు సోమవారం ఉదయం స్తంభించిపోయింది. జేసీబీ లోడుతో వెళ్తున్న ఒక భారీ లారీ, ప్రమాదకరమైన మలుపు వద్ద సాంకేతిక లోపంతో ఆగిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.రోడ్డుకు అడ్డంగా లారీ నిలిచిపోవడంతో రెండు వైపులా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.ఈ మార్గం తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కలిపే కీలక రహదారి కావడంతో...0 Comments 0 Shares 84 Views 0 Reviews
-
సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చే ప్రభుత్వ సహకారం మాత్రం కరువైంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారుల ఉదాసీనత వల్ల గిరిజన జీవనోపాధి ఇప్పుడు 'నది' దాటి పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.గతంలో చింతూరు కేంద్రంగా సాఫీగా సాగిన తునికాకు (బీడీ ఆకు) సేకరణ, ఇప్పుడు అధికారుల పట్టింపులేమితో అటకెక్కింది.ఇక్కడ కొనేవారు...0 Comments 0 Shares 86 Views 0 Reviews
-
చింతూరులో వీధి కుక్కల బీభత్సం.చింతూరు పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూగజీవాలకు కునుకు లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా ఆవులపై గుంపులు గుంపులుగా దాడి చేస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం గత పది రోజుల క్రితమే ఒక తల్లి ఆవుపై దాడి చేసిన కుక్కల మంద, దాన్ని చంపి తినేశాయి. ఆ ఘటన మరువక ముందే, తాజాగా ఆ తల్లి ఆవు దూడను కూడా అదే రీతిలో చంపి తినేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. కుక్కలు మృగాల్లా...0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
చింతూరులో 'స్వచ్ఛ రథం' ప్రారంభం ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసరాలు పంపిణీ!పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చింతూరు మండలంలో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన 'స్వచ్ఛ రథం' కార్యక్రమాన్ని చింతూరు మండలం టీడీపీ అధ్యక్షుడు జమాల్ ఖాన్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా వారికి నిత్యావసర వస్తువులను అందజేయనున్నారు.గ్రామాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణాన్ని కాపాడటం...0 Comments 0 Shares 99 Views 0 Reviews
-
పోలవరం జిల్లా రైతులకు సబ్సిడీ పై యంత్రాలు.వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పోలవరం జిల్లాలోని రైతులు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను పొందేందుకు సువర్ణావకాశం కల్పించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామ్మోహనరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.40HP సామర్థ్యం గల ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు , పవర్ స్ప్రేయర్లు వంటి ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి.ఈ పరికరాలపై ప్రభుత్వం 40% నుండి 50% వరకు...0 Comments 0 Shares 100 Views 0 Reviews
-
మీ వివరాలే దేశ ప్రగతికి మెట్లు 2027 జనాభా గణనకు సహకరించండి..!దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక అడుగు పడబోతోంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపట్టిన 2027 జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైంది. దీనిపై చింతూరు తహసీల్దార్ సయ్యద్ హుస్సేన్ గారు ప్రజలకు కీలక విన్నపం చేశారు.మే 1 నుండి మే 30 వరకు ఇంటి జాబితా తయారీ జరుగుతుంది తొలిసారిగా ఈ గణన పూర్తి డిజిటల్ పద్ధతిలో నిర్వహించబడుతోంది కావున మీరు ఇచ్చే సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. దీనివల్ల ప్రభుత్వ పథకాలకు...0 Comments 0 Shares 105 Views 0 Reviews
-
"పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో చావులు పట్టించుకోని పాలకులు!"పోలవరం జిల్లా చింతూరు మండలం మామిళ్ళగూడెం గ్రామం ఇప్పుడు కిడ్నీ వ్యాధుల కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతోంది. గత పదేళ్లుగా ఈ గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నా, ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో సరైన తాగునీటి సౌకర్యం లేకపోవడం, భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయికి చేరిన మూలకాల వల్లనే...0 Comments 0 Shares 137 Views 0 Reviews
-
2027 ఫిబ్రవరి కల్లా పోలవరం నిర్వాసితులకు పునరావాసం !పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ (పునరావాసం మరియు పునరుద్ధరణ) పనులపై ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ కీలక అప్డేట్ ఇచ్చారు. 2027 ఫిబ్రవరి నాటికి పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను పూర్తి చేసి, అర్హులైన నిర్వాసితులకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు.వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వీఆర్ పురం మండల నిర్వాసితులు ఈ నెల 30వ తేదీలోగా...0 Comments 0 Shares 149 Views 0 Reviews
-
పోలవరం ముంపు మండలాల రైతుల డీజిల్ సమస్యకు చెక్..!!చింతూరు, వి, ఆర్,పురం, కూనవరం మండలాల రైతులకు ఎదురవుతున్న డీజిల్ కొరత సమస్యపై పంటల రవాణాకు డీజిల్ దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ, మంగళవారం రైతుల బృందం ఐటీడీఏ పీఓ (PO) శుభం నోక్వాల్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతుల విజ్ఞప్తిని సావధానంగా విన్న పీఓ, తక్షణమే స్పందించారు. పంటల కోత మరియు రవాణా సమయం కాబట్టి, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డీజిల్ సరఫరాకు తక్షణ చర్యలు...0 Comments 0 Shares 145 Views 0 Reviews
-
మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు చింతూరు ఎస్ఐ సంతోష్ కుమార్ హెచ్చరిక.మైనర్లకు వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు నేరస్తులు కావద్దని చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సంతోష్ కుమార్ హెచ్చరించారు. సోమవారం చింతూరు మండలం చట్టి గ్రామంలో ఆటో మరియు బైక్ రైడర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పలు కీలక సూచనలు చేశారు.అవగాహన లేని వయసులో మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇది వారి ప్రాణాలకే కాకుండా ఇతరులకు కూడా ముప్పు అని ఆవేదన వ్యక్తం...0 Comments 0 Shares 140 Views 0 Reviews
More Stories