-
1761 Posts
-
4 Photos
-
3 Videos
-
Reporter at Mpl
-
Followed by 4 people
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
మన ఎర్రచందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలొద్దు: పవన్ కల్యాణ్.రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ను సమూలంగా నిర్మూలించాలని, అక్రమ రవాణాపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ఎర్రచందనాన్ని దేశంలో ఏ మూలన దాచిపెట్టినా వదలొద్దని, స్మగ్లర్లతో పాటు వారి వెనుకున్న కింగ్ పిన్లపైనా ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో...0 Comments 0 Shares 10 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఏపీ అస్త్రం' ఆవిష్కరణ.. భవిష్యత్ పోలీసింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా విజయవాడ పోలీసులు రూపొందించిన 'ఏపీ అస్త్రం' మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. విజయవాడలోని అంబేడ్కర్ కళా వేదికలో మూడు రోజుల పాటు జరిగిన 'ఏపీ పోలీస్ రిట్రీట్-2026: ఫ్యూచర్ పోలీసింగ్' కాన్ఫరెన్స్ ముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు....0 Comments 0 Shares 11 Views 0 Reviews
-
Madanapalle: ఒకే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా 'తల్లికి వందనం' అమలు చేసి సీఎం చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారని మదనపల్లె నేత కట్టా దొరస్వామి నాయుడు కొనియాడారు.మదనపల్లె: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఒక కుటుంబంలో ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నా వారందరికీ 'తల్లికి వందనం' పథకం వర్తింపజేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూలై 22న బుధవారం అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను నేరుగా జమ...0 Comments 0 Shares 13 Views 0 Reviews
-
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్ను వీడియో కాల్లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్ (చిన్న)ను మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. వీడియో కాల్లో యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సమీమ్ అస్లాం, ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు. మెరుగైన వైద్యం పొందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన...0 Comments 0 Shares 12 Views 0 Reviews
-
Mulakalacheruvu: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం వర్తించకపోవడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ను వేడుకున్న తాత నాగమల్లప్ప.Mulakalacheruvu: అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం గుడుపల్లి గ్రామంలో నివాసముంటూ కొమ్మిరి శ్రీవాణి కొమ్మిరి జనార్ధన మా తల్లిదండ్రులు మేము ముగ్గురము పిల్లలను ఉన్నాము. మాకు తల్లికి వందనం డబ్బులు అర్హుల జాబితాలో మా పేర్లు లేవు మేము కొత్తకోట కస్తూరిబాయ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న కొమ్మిరి కీర్తన, ఏడో తరగతి చదువుతున్న కొమ్మిరి మాతా శ్రీ, సోంపల్లి పంచాయతీ రెడ్డివారి పల్లి స్కూల్లో కొమ్మిరి...0 Comments 0 Shares 12 Views 0 Reviews
-
Madanapalle: అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వెల్లడించిన అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ.మదనపల్లె: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEs)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు. మేధావులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు IIT-JEE, NEET వంటి పోటీ...0 Comments 0 Shares 12 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లె తాగునీటి బోరు తవ్వకాలను వేంపల్లి ప్రజలు అడ్డుకున్నారు. భూగర్భ జలాలు పడిపోతాయని ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.మున్సిపాలిటీ కోసం బోరు తవ్వకాలు.. అడ్డుకున్న వేంపల్లి గ్రామస్థులు మదనపల్లె, జూలై 23: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో నెలకొన్న తాగునీటి కొరతను దృష్టిలో ఉంచుకుని అర్బన్ మున్సిపాలిటీకి నీటి సరఫరా కోసం వేంపల్లి పంచాయతీ పరిధిలో బోరు తవ్వేందుకు అధికారులు బుధవారం అక్కడికి చేరుకున్నారు. అయితే గ్రామంలో భూగర్భ జలాలు తగ్గిపోతాయని, తమ గ్రామానికి భవిష్యత్తులో నీటి సమస్య మరింత...0 Comments 0 Shares 12 Views 0 Reviews
-
జులై 29న గురు పౌర్ణమి వేడుకలు.. ముమ్మరంగా ఏర్పాట్లు!అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం గుడిశవారిపల్లి సాయిబాబా ఆలయంలో జులై 29న గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఉదయం నుండి రాత్రి వరకు ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు మణికంఠ శర్మ తెలిపారు. ఆలయంలో నేడు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.0 Comments 0 Shares 11 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుల కొరత తీరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తక్షణమే స్పందించి DEO, MEO లతో మాట్లాడి టీచర్.వివేకానంద మున్సిపల్ హైస్కూల్లో హిందీ ఉపాధ్యాయుల నియామకం.. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవకు తల్లిదండ్రుల ధన్యవాదాలు మదనపల్లె: పట్టణంలోని 34, 35 వార్డుల పరిధిలోని రామిరెడ్డి లేఔట్లో ఉన్న వివేకానంద మున్సిపల్ హైస్కూల్ను 35వ వార్డు ఇన్చార్జి రమేష్ రెడ్డి, 34వ వార్డు ఇన్చార్జి బాలమల్లి శేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్తో...0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
Madanapalle: కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మదనపల్లె, తిరుపతి కేంద్రాల్లో ఐటీ హ్యాండ్స్-ఆన్ వర్క్షాప్.మదనపల్లె: ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకుని కావేరి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హ్యాండ్స్-ఆన్ వర్క్షాప్ నిర్వహించనున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు. గత ఐదు సంవత్సరాలుగా బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ తదితర విద్యార్థులకు నాణ్యమైన సాఫ్ట్వేర్ శిక్షణ అందిస్తూ, 200 మందికి పైగా విద్యార్థులను ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో విజయవంతంగా ప్లేస్మెంట్లు పొందేలా...0 Comments 0 Shares 22 Views 0 Reviews
-
Madanapalle: ఢిల్లీలో నీట్ విచారణ కోరుతూ విద్యార్థుల నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీపై పోలీసుల దాడి అరెస్ట్ను మదనపల్లె కాంగ్రెస్ నేతషేక్ రెడ్డిసాహెబ్ ఖండించారు.రాహుల్ గాంధీ అరెస్ట్, తలకు గాయం ఘటనపై బీజేపీపై కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ ఘాటు విమర్శలు మదనపల్లె: నీట్ (NEET) పేపర్ లీక్ అంశంపై విద్యార్థులకు మద్దతుగా ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఈ సందర్భంగా ఆయన తలకు గాయమవడం అత్యంత దురదృష్టకరమని మదనపల్లె నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షేక్ రెడ్డి...0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లెలో "జలధార" అమలులో తీవ్ర లోపాలున్నాయని, FTL గుర్తింపు లేకుండా పనులు చేసి ప్రజాధనం వృథా చేస్తున్నారని బహుజన యువసేన EEకి వినతిపత్రమిచ్చింది.జలధార" అమలులో లోపాలు.. ప్రజాధనం వృథా అవుతోందని బహుజన యువసేన ఆందోళన ఇరిగేషన్ ఈఈకి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ మదనపల్లె, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న "జలధార" చెరువుల పునరుద్ధరణ పథకం క్షేత్రస్థాయిలో తీవ్ర లోపాలతో అమలవుతోందని బహుజన యువసేన (BYS) రాష్ట్ర అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు మదనపల్లె ఇరిగేషన్ డివిజన్...0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
Madanapalle: భూ రీ-సర్వే వివాదం రైతు కుటుంబంపై దాడి, నలుగురికి గాయాలు!Madanapalle: భూ రీ-సర్వే సందర్భంగా తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసి రైతు కుటుంబంపై దాడి జరిగిన ఘటన మదనపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మదనపల్లె మండలం పోతబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని వందాడి వారిపల్లెకు చెందిన రైతు లక్ష్మన్నకు చెందిన భూమిపై వివాదం...0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
Madanapalle: ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.మదనపల్లె: జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కొండామర్రిపల్లి పంచాయతీ టీడీపీ ఇంచార్జ్ జయరాం యాదవ్ మదనపల్లె పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం సమీపంలోని పుంగనూరు రోడ్డులో ఉన్న ఎన్.జే.ఆర్. కళ్యాణమండపంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక 'షైనింగ్ స్టార్స్–2026', 'మై స్కూల్ మై ప్రైడ్' కార్యక్రమానికి రాష్ట్ర రోడ్డు...0 Comments 0 Shares 31 Views 0 Reviews
-
Annamayya: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రివర్యులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలోని తన సొంత నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ...0 Comments 0 Shares 31 Views 0 Reviews
-
Madanapalle: అంగల్లు వద్ద IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు ప్రారంభం. స్మార్ట్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్ నమూనాల ప్రదర్శన.Madanapalle: ఆధునిక వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల అభివృద్ధికి తోడ్పడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన IMFORU అగ్రికల్చర్ ఫార్మింగ్ నేడు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి సోదరుడు జయదేవ్ రెడ్డి, మదనపల్లె వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రైతులకు ఆధునిక...0 Comments 0 Shares 28 Views 0 Reviews
-
Chittoor: ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి శివాలయంలో వింత ఘటన వెలుగుచూసింది. శివలింగంపై నూనె పోస్తే పాలుగా మారుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.ఐరాల మండలం చిన్న వెంకటాంపల్లి సమీపంలోని ఓ శివాలయంలో చోటుచేసుకుంటున్న విశేష ఘటన భక్తులను ఆకర్షిస్తోంది. ఆలయంలోని శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుండగా అది పాలుగా మారుతున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుంటున్నారు. ...0 Comments 0 Shares 28 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం అందజేశారు.Madanapalle: పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ మదనపల్లె మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ అధ్యక్షుడు ముజీబ్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ముజీబ్ మాట్లాడుతూ, పట్టణంలోని పలు వార్డుల్లో తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నీటి కొరత నివారణకు తక్షణ చర్యలు చేపట్టి, ప్రతి వార్డుకు సక్రమంగా తాగునీరు...0 Comments 0 Shares 30 Views 0 Reviews
More Stories