-
1362 Posts
-
4 Photos
-
3 Videos
-
Reporter at Mpl
-
Followed by 4 people
-
Current Position
Reporter
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
మదనపల్లె-రామసముద్రం ఆర్టీసీ బస్సుల దుస్థితి.. ప్రయాణికుల ఆవేదన.మదనపల్లె నుంచి రామసముద్రం వెళ్లే ఆర్టీసీ బస్సులు సరిగా లేకపోవడం, ఉన్నవి కూడా తరచూ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర పనులపై వెళ్లేవారు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సి వస్తోంది. మెరుగైన సేవలు అందించాలని, అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.0 Comments 0 Shares 16 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మదనపల్లిలో "ఆపరేషన్ క్లీన్ స్విప్పు" ప్రారంభంమదనపల్లిని పరిశుభ్రమైన పట్టణంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ "ఆపరేషన్ క్లీన్ స్వీప్" కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. నాలుగు వారాల కార్యాచరణలో భాగంగా మున్సిపల్ అధికారులు, కార్మికులు పట్టణంలో చెత్త తొలగింపు చేపట్టారు. చెత్త వేస్తే జరిమానాలు, షాపుల సీజింగ్ తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి పౌరుడు పరిశుభ్రతలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.0 Comments 0 Shares 17 Views 0 Reviews
-
రిటైర్డ్ ఉద్యోగుల భూమిని విడిపించి ఇవ్వాలి.. చిన్నప్ప.మదనపల్లెకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఏపీఎస్ఈబీ యూనియన్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి చిన్నప్పతో పాటు పలువురు శుక్రవారం మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లెకు చెందిన రామకృష్ణారెడ్డి నకిలీ పత్రాలు సృష్టించి కోట్ల విలువైన తమ భూమిని ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం కేసుతో పాటు పలు భూకబ్జా కేసుల్లో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడని...0 Comments 0 Shares 36 Views 0 Reviews
-
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ నాయక్తో పాటు నాయకులు అమరేంద్ర నాయక్, రఘు నాయక్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన తండాలలో నివసిస్తున్న లంబాడీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వారు పేర్కొన్నారు. గిరిజనుల హక్కులను పరిరక్షిస్తూ వారి ఆర్థిక,...0 Comments 0 Shares 35 Views 0 Reviews
-
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర రెడ్డి (48) తీవ్రంగా గాయపడ్డారు. పని నిమిత్తం నిమ్మనపల్లికి వచ్చి, తిరిగి వెళ్తుండగా బైకు అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అతడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.0 Comments 0 Shares 34 Views 0 Reviews
-
మదనపల్లెలో ట్రాక్టర్ ఢీ.. ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు.మదనపల్లె మండలంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజశేఖర్ (30) తీవ్రంగా గాయపడ్డాడు. కోటవారిపల్లికి చెందిన రాజశేఖర్ తన ఆటోలో మదనపల్లెకు ప్రయాణికులను తరలిస్తుండగా, దండువారిపల్లి వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.0 Comments 0 Shares 38 Views 0 Reviews
-
నిమ్మనపల్లిలో ట్రాక్టర్పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో గౌరమ్మ(50)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని కూలి పనులకు గౌరమ్మను పిలవడంతో సహచర కూలీలతో కలిసి ట్రాక్టర్లో వెళ్లింది. జాండ్రపాళెం వద్ద ట్రాక్టర్పై కూర్చుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర...0 Comments 0 Shares 38 Views 0 Reviews
-
మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం.శుక్రవారం ఉదయం మదనపల్లె మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొందికి చెందిన శ్రీరాములు నాయుడు (35) పాలెంకొండకు హైవేపై నడుచుకుంటూ వెళుతుండగా సీటీఎంచెరువు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన శుక్రవారం వేకువజామున వెలుగుచూసింది. తాలూకా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.0 Comments 0 Shares 34 Views 0 Reviews
-
మదనపల్లె: దారికాసి పారిశుద్ధ్య కార్మికురాలిపై దాడి.శుక్రవారం మదనపల్లెలో పారిశుద్ధ్య కార్మికురాలిపై దారికాసి దాడి జరిగింది. కుమారపురానికి చెందిన లక్ష్మీదేవి (58) అనే కార్మికురాలు గాంధీపురం వద్దకు వెళ్తుండగా, రెడ్డమ్మ, శ్యామ్, వెంకటరమణ తదితరులు ఆమెపై దాడి చేశారని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.0 Comments 0 Shares 30 Views 0 Reviews
-
జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం.లండన్లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్గా జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నిక భారత న్యాయ రంగానికి, ప్రజా సేవకు చేసిన సేవలకు గుర్తింపు సుప్రీంకోర్టుకు నేరుగా బార్ నుంచి ఎంపికైన ఏడో న్యాయవాదిగా రికార్డ్ గుంటూరు జిల్లాలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్ నాగేశ్వరరావు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. లండన్లోని...0 Comments 0 Shares 38 Views 0 Reviews
-
నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం.పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే ప్రారంభం కావాలని ఆదేశం ఎస్ఐపీబీ ద్వారా రూ.11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం ఇప్పటికే 114 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వెల్లడించిన అధికారులు అనుమతులు, భూ కేటాయింపులు వేగవంతం చేయాలని సీఎం సూచన రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా,...0 Comments 0 Shares 35 Views 0 Reviews
-
రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్.రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్... భాస్కర్ అవార్డు గ్యారంటీ: నారా లోకేష్ Andhra Nara Lokesh Slams Jagan as Cancer to Rayalaseema తల్లిని, చెల్లిని తరిమేసి బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్ అంటూ లోకేష్ ఫైర్ రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర విమర్శ 2029లోపు కడప స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని హామీ కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ ఫేక్...0 Comments 0 Shares 39 Views 0 Reviews
-
'స్త్రీ శక్తి' థీమ్తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు.'స్త్రీ శక్తి' థీమ్తో 'మహానాడు-2026'... పండుగలా జరపాలన్న చంద్రబాబు Andhra Chandrababu Naidu Announces Stri Shakti Theme for Mahanadu 2026 ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్తో నిర్వహించాలని టీడీపీ నిర్ణయం మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టాలని పొలిట్ బ్యూరో సమావేశంలో తీర్మానం మహానాడును పండుగలా జరపాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు ఇంధన పొదుపులో భాగంగా...0 Comments 0 Shares 34 Views 0 Reviews
-
జగన్పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్.జగన్పై మంత్రి నాదెండ్ల ఫైర్.. అన్ని విమర్శలకు ఘాటు కౌంటర్. Andhra Nadendla Manohar Fires Back at Jagans Criticisms దీపం పథకంపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల ఆరోపణ మధ్యాహ్న భోజనం బియ్యంపై విమర్శలు అవగాహనారాహిత్యంతో చేసినవేనని వ్యాఖ్య స్పెషల్ ఫ్లైట్లపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదు.. రూ.222 కోట్లు ఖర్చు చేశారని విమర్శ 5 కిలోమీటర్ల దూరం కోసం హెలికాప్టర్...0 Comments 0 Shares 31 Views 0 Reviews
-
కడప విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ విమానాశ్రయంలో లోకేష్కు ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి కడప నియోజకవర్గ టీడీపీ నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గొన్న లోకేష్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గురువారం సాయంత్రం ఆయన కడప విమానాశ్రయానికి...0 Comments 0 Shares 35 Views 0 Reviews
-
మదనపల్లి: మహిళల భద్రతకు పెద్దపీట: ఎస్పీ ధీరజ్.మదనపల్లిలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మహిళల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు జరిగింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మాట్లాడుతూ యువత సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలని, రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 నంబర్లను సంప్రదించాలని, 'శక్తి యాప్' వినియోగించాలని మహిళలకు...0 Comments 0 Shares 37 Views 0 Reviews
-
మదనపల్లి: పోలీసుల ఆరోగ్యంపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ.మదనపల్లిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభమైంది. పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో సీబీసీ, కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, మూత్ర పరీక్షలు ఉచితంగా...0 Comments 0 Shares 37 Views 0 Reviews
-
పోలీసుల మానసిక ప్రశాంతతకే ‘హార్ట్ఫుల్నెస్’ మెడిటేషన్: ఎస్పీ.అన్నమయ్య జిల్లా పోలీసు సిబ్బంది మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ గురువారం తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో కార్యక్రమం ప్రారంభమైంది. మే 21 నుంచి 23 వరకు మదనపల్లి, రాయచోటి, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ఉదయం ధ్యాన తరగతులు నిర్వహించనున్నట్లు...0 Comments 0 Shares 39 Views 0 Reviews
More Stories