నిండుమనసుతో హాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటా: బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

0
1K

డివిజన్ ఎం.ఎన్.రెడ్డి నగర్ కాశీ విశ్వేశ్వర ఆలయ కమ్యూనిటీ హాల్ నందు కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో హ్యాట్రిక్ విజయంతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన కెపి.వివేకానంద్ గారిని సన్మానిస్తూ "సన్మాన సభ" ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారిని కార్యక్రమ నిర్వాహకులు గజమాలతో సత్కరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గారు మాట్లాడుతూ....గత రెండు పర్యాయాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమాన్ని చూసి నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో భాగంగా కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం పునః నిర్మాణ పనులకు ముందుకు వచ్చి తమ తోడ్పాటునందిస్తున్న దాతలను ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కరింపచేశారు.ఈ కార్యక్రమంలో ఎం. ఎన్. రెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు టెంపుల్ కమిటీ చైర్మన్ ఎస్. గోవర్ధన్ రెడ్డి, కాలనీ ప్రధాన కార్యదర్శి శంకర్, కోశాధికారి భరత్, దేవాలయ ప్రధాన కార్యదర్శి శివరాం రెడ్డి, కోశాధికారి రాము, కాలనీవాసులు లక్ష్మీ మోహన్, మోహన్ రావు, సంజీవరావు, చంద్రారెడ్డి, హరికృష్ణ, కిరణ్ కుమార్, బాల శ్రీనివాసమూర్తి, చంద్రశేఖర్, నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, గుమ్మడి మధుసూదన్ రాజు, కాలే నాగేష్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, సమ్మయ్య నేత, సంపత్ గౌడ్, బాల మల్లేష్, ఆటో బలరాం, విజయ్ హరీష్, మహిళా నాయకురాలు ఇంద్రా రెడ్డి, శ్రీదేవి రెడ్డి, కల్పన తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
West Bengal
Kolkata Metro suspends services in Howrah Maidan-Esplanade stretch today | Here's why
Kolkata Metro Suspends Howrah Maidan–Esplanade Services for Urgent Maintenance; Purple Line...
By BMA ADMIN 2025-05-19 18:16:22 0 2K
Assam
Thadou Tribe Protest in Assam Demands Action on Insurgents
Members of the Thadou tribe staged protests in #Guwahati after the brutal killing of their leader...
By Pooja Patil 2025-09-11 06:09:29 0 185
Andhra Pradesh
ఎమ్మిగనూరులో పెట్రోల్ డీజిల్ కొరత
ఎమ్మిగనూరు లో పెట్రోల్ డీజిల్ కొరత ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల నుండి...
By Boya Dasthagiri 2026-04-20 11:33:56 0 169
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థి మృతి
తమిళనాడులోని మధురైలో బీటెక్ చదువుతున్న పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలానికి చెందిన ధరణి అనే...
By Kothuru Murali 2026-04-18 09:36:26 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com