Chandrababu Naidu: 2027 కల్లా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు ఆదేశం.

0
204

2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం

 

ప్రధాన ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సూచన

రాష్ట్రంలో గుంతల్లేని రోడ్ల కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగంపై దృష్టి

రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాజధాని అమరావతిని అనుసంధానించే బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులను 2027 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రూ.42,194 కోట్ల విలువైన పనులను వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పూర్తి విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక బెంచ్‌మార్క్‌గా నిలవాలని ఆకాంక్షించారు.

 

రాష్ట్రంలో ప్రస్తుతం చేపట్టిన రూ.1.40 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. సరుకు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా రహదారుల ప్రాజెక్టులు చేపట్టాలని స్పష్టం చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ శాఖల ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

 

శ్రీకాకుళంలోని మూలపేట, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, కృష్ణపట్నం వంటి ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానించాలని సీఎం సూచించారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ పోర్టులకు సరుకు రవాణా జరిగేలా రోడ్లను నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. ఖరగ్‌పూర్-అమరావతి, నాగ్‌పూర్-విజయవాడ, రాయ్‌పూర్-అమరావతి వంటి కీలకమైన కారిడార్ల డీపీఆర్‌లను త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

 

రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్ల రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చూడాలని, వేస్ట్ ప్లాస్టిక్, నానో కాంక్రీట్ వంటి ఆధునిక టెక్నాలజీతో రోడ్లు నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
"కరీంనగర్ నిందితుల ఫోటోలు ఇవే! - అప్రమత్తమైన అల్వాల్ పోలీసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కరీంనగర్ పట్టణంలో సంచలనం సృష్టించిన జ్యువెల్లరీ దుకాణం దోపిడీ కేసులో...
By Sidhu Maroju 2026-05-03 15:00:05 0 189
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ :పులిచెర్ల మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మంగళవారం, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి వెనుక...
By Kothuru Murali 2026-02-11 08:45:53 0 109
Andhra Pradesh
అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
*మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్*  ...
By Rajini Kumari 2026-03-09 13:02:48 0 135
Andhra Pradesh
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన రేపల్లె సబ్ డివిజన్ పోలీసులు
జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-08 13:51:33 0 172
Telangana
పార్టీ నేతలతో ముగిసిన కెసిఆర్ సమావేశం
TG: ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లొ మాజీ సీఎం కెసిఆర్  అధ్యక్షతన brs నేతలతో సమావేశం ముగిసింది. ఈ నెల...
By Prashanth Goindla 2025-12-26 19:22:51 0 362
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com