ఎన్టీఆర్ జిల్లా ఇసుక అక్రమ రవాణా పై స్థానికులు అడ్డుకోవడంతో ట్రక్కును వదిలేసి పరారైన దుండగులు

0
188

*ఇసుక అక్రమ రవాణాపై గ్రామంలో ఉద్రిక్తత*

*స్థానికుల అడ్డుకోవడంతో ట్రాలీ వదిలి పరారైన దుండగులు*

 

Avja 

 

ఎన్టీఆర్ జిల్లా,వత్సవాయి మండలం పోలంపల్లి

గ్రామంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్నేరు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికుల సమాచారం మేరకు, ఇసుకతో నిండిన ట్రాక్టర్లు అధిక వేగంతో గ్రామం మధ్యగా ప్రయాణిస్తూ, ఓవర్‌లోడ్‌తో పాటు టేప్ రికార్డర్లను గట్టిగా మోగిస్తూ వెళ్తున్నాయని తెలిపారు. దీంతో రోడ్డు మీద ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

మున్నేరు నుంచి తీసుకెళ్తున్న ఇసుకను కొందరు అధికార పార్టీ అండతో తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇసుకతో నింపిన ట్రాలీని అక్కడే వదిలి అక్రమ రవాణాదారులు పరారయ్యారు.

గ్రామస్తులు మాట్లాడుతూ, “డబ్బుల కోసం రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు గ్రామంలో తిరుగుతున్నాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని భయంతో జీవిస్తున్నాం” అని తెలిపారు.

అదే విధంగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖాళీ ట్రక్కులు తీసుకువచ్చి, ఇక్కడ ఇసుక నింపి పంపుతున్నారని, ఒక్కో ట్రక్కుకు సుమారు మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజుకు పది పైగా ట్రక్కుల ద్వారా లక్షల రూపాయల అక్రమ ఆదాయం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్రమ రవాణాకు అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
SURAKSHA
పోలీస్ శిక్షణతో యువతకు ఉపాధి - AP స్కిల్ డెవలప్మెంట్ మిషన్
నిరుద్యోగ యువతకు చేయూత ఇచ్చేందుకు AP పోలీస్ "యువశక్తి" స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నడుపుతుంది....
By Kalaga Sailaja 2026-07-01 10:09:26 0 34
Business & Finance
Jharkhand Showcases Investment Opportunities in New Delhi
The Jharkhand government is hosting a National Stakeholders Consultation in New Delhi to showcase...
By Navya Sree 2026-07-04 08:00:08 0 66
Telangana
మళ్ళీ ఎన్నికలు
సర్పంచ్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, ZTPC ఎన్నికలను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
By Krishna Balina 2025-12-18 00:33:50 0 270
Telangana
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం...
By Vanmoj Suryamohan 2026-01-31 06:56:34 0 456
Nagaland
Noklak Organizes Mass Social Work for Monsoon Safety
In a proactive bid to mitigate monsoon-related hazards, the Deputy Commissioner of Noklak has...
By Lokeshwari Panthadi 2026-07-02 07:04:12 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com