ఎన్టీఆర్ జిల్లా ఇసుక అక్రమ రవాణా పై స్థానికులు అడ్డుకోవడంతో ట్రక్కును వదిలేసి పరారైన దుండగులు

0
158

*ఇసుక అక్రమ రవాణాపై గ్రామంలో ఉద్రిక్తత*

*స్థానికుల అడ్డుకోవడంతో ట్రాలీ వదిలి పరారైన దుండగులు*

 

Avja 

 

ఎన్టీఆర్ జిల్లా,వత్సవాయి మండలం పోలంపల్లి

గ్రామంలో అక్రమ ఇసుక రవాణా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్నేరు నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

స్థానికుల సమాచారం మేరకు, ఇసుకతో నిండిన ట్రాక్టర్లు అధిక వేగంతో గ్రామం మధ్యగా ప్రయాణిస్తూ, ఓవర్‌లోడ్‌తో పాటు టేప్ రికార్డర్లను గట్టిగా మోగిస్తూ వెళ్తున్నాయని తెలిపారు. దీంతో రోడ్డు మీద ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

మున్నేరు నుంచి తీసుకెళ్తున్న ఇసుకను కొందరు అధికార పార్టీ అండతో తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక వర్గానికి చెందిన గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం ఇసుకతో నింపిన ట్రాలీని అక్కడే వదిలి అక్రమ రవాణాదారులు పరారయ్యారు.

గ్రామస్తులు మాట్లాడుతూ, “డబ్బుల కోసం రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లు గ్రామంలో తిరుగుతున్నాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని భయంతో జీవిస్తున్నాం” అని తెలిపారు.

అదే విధంగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఖాళీ ట్రక్కులు తీసుకువచ్చి, ఇక్కడ ఇసుక నింపి పంపుతున్నారని, ఒక్కో ట్రక్కుకు సుమారు మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోజుకు పది పైగా ట్రక్కుల ద్వారా లక్షల రూపాయల అక్రమ ఆదాయం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్రమ రవాణాకు అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదిక (PGRS) అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పి జి ఆర్ ఎస్ కు హాజరు కావాలి
బాపట్ల: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే పి జి ఆర్ ఎస్...
By Gadiyapudi Narendra 2026-02-02 13:31:08 0 166
Telangana
ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా 'నరుకుతం’. రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో సోమవారం నిర్వహించిన మాజీ...
By Ponnala Srinivasrao 2026-04-15 04:02:07 0 101
Andhra Pradesh
పిల్లల ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యం !! కర్నూలు ఎంపి!!
కర్నూలు : రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి...
By Hari Krishna 2025-12-21 09:51:26 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com