• శ్రీకాకుళం: మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం
    శ్రీకాకుళం పట్టణ తాగునీటి సరఫరా కేంద్రం ఆవరణలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాగునీటి పరిశీలన నిర్వహించే నర్సింగ్ విద్యార్థులకు యాప్‌ల ఉపయోగాలపై వివరించారు. అలాగే క్విక్ టీమ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి దాని ఉపయోగాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా...
    0 Comments 0 Shares 131 Views 0 Reviews
  • మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
    మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్ పంజలా శకుంతల రామాగౌడ్ గ్రామ అభివృద్ధి ద్యేయమని సర్పంచ్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమలో ఉపసర్పంచ్ మరియు కార్యదర్శి, వార్డ్ సభ్యులు , పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు... # saketh 
    0 Comments 1 Shares 168 Views 0 Reviews
  • 9505751363
    9505751363
    మద్దిపడగ లో గవర్నమెంట్ పాఠశాల ప్రహరీ గోడ పనులు ప్రారంభం
    మద్దిపడగ లో ఈ రోజు పాఠశాల చుట్టూ ప్రక్కల ప్రహరీ గోడ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు.సర్పంచ్ పంజలా శకుంతల రామాగౌడ్ గ్రామ అభివృద్ధి ద్యేయమని సర్పంచ్ ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమలో ఉపసర్పంచ్ మరియు కార్యదర్శి, వార్డ్ సభ్యులు , పాఠశాల యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు... # saketh 
    0 Comments 0 Shares 69 Views 0 Reviews
  • ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|
    హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad Municipal corporation పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే Earth hour కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు కూడా చురుకుగా పాల్గొనాలని కోరింది. ప్రతి సంవత్సరం మార్చి  (28. రాత్రి 8:30 నుండి 9:30  వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా)శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అవసరం లేని లైట్లు...
    0 Comments 0 Shares 89 Views 0 Reviews
  • మదనపల్లెలో హోటల్‌లో చోరీ.. నగదు, వస్తువులు అపహరణ.
    మదనపల్లె మునిసిపల్ పార్క్ సమీపంలోని టీ డెన్ హోటల్‌లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. హోటల్ యజమానులు శనివారం ఉదయం వచ్చి చూడగా, రేకులకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు సుమారు రూ. 60 వేల నగదు, కరెంట్ స్టవ్, ప్రొజెక్టర్, హోమ్ థియేటర్, ఎల్ఈడి టీవీ, సుమారు రూ. 30 వేల విలువైన సిగరెట్లు తదితర వస్తువులను అపహరించినట్లు తెలిపారు. వన్‌టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు...
    0 Comments 0 Shares 86 Views 0 Reviews
  • రాగోలులో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీపీవో
    శ్రీకాకుళం రూరల్ మండలం పరిధి రాగోలు గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఆర్. గంగీబాబు శనివారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతి రోజూ ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని క్రమంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా శుభ్రత పాటించాలని ఆదేశించారు....
    0 Comments 0 Shares 121 Views 0 Reviews
  • శ్రీకాకుళం: జిల్లా అదనపు న్యాయమూర్తిని కలిసిన బార్ అసోసియేషన్ కార్యవర్గం
    శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు శనివారం జిల్లా ఒకటవ అదనపు న్యాయమూర్తి భాస్కరరావును మర్యాదపూర్వకంగా కలిశార బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారావు నూతన కార్యవర్గ సభ్యులను న్యాయమూర్తికి పరిచయం చేసి, వారికి పుష్పగుచ్ఛం అందజేశారు.  నూతన కార్యవర్గాన్ని అభినందించిన న్యాయమూర్తి, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని వారికి సూచించారు.
    0 Comments 0 Shares 125 Views 0 Reviews
  • శ్రీకాకుళం: బీసీ సంక్షేమ శాఖ అధికారిపై వేటు?
    శ్రీకాకుళం బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధపై వేటుపడినట్లు సమాచారం. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఈమె కర్నూలు జిల్లాలో సహాయ బీసీ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నప్పుడు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి అవినీతి ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డి-మోషన్ చేసినట్లు సమాచారం.
    0 Comments 0 Shares 138 Views 0 Reviews
  • లింగ వివక్షత చూపితే చర్యలు తీసుకోండి
    లింగ వివక్షత చూపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రామ్మోహనరావు ఆదేశించారు. బొబ్బిలి ఆర్డీవో కార్యాలయంలో శనివారం పీసీ అండ్ పి.ఎన్.డి.టి చట్టంపై సమావేశం నిర్వహించారు. ఆడపిల్లల పట్ల వివక్షత చూపినా, లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాలికల లింగ నిష్పతి పెంచేందుకు పని చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీస్, వైద్య, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు....
    0 Comments 0 Shares 108 Views 0 Reviews
  • టీడీపీ ఆవిర్భావ వేడుకల జయప్రదానికి పిలుపు
    టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. అమరావతి నుంచి వీడియో సందేశాన్ని శనివారం విడుదల చేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో వార్డు, గ్రామాలలో ఆదివారం ఉదయం 9 గంటల లోపు జెండా ఆవిష్కరణ చేసి 10 గంటలకు బొబ్బిలి కోటకు రావాలని కోరారు. టీడీపీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు సకాలంలో హాజరు కావాలన్నారు. #RAJESH 
    0 Comments 0 Shares 114 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com