#Big fan of @urstrulymahesh ❤️🌟
#మంచిగా ఉండేవాళ్ళని ఆదరిస్తా, చెడుగా ఉండేవాళ్ళని అణచివేస్తా 😐
#అన్ని కులాలను, మతాలను గౌరవించే మనస్తత్వం 🤩
#మంచిగా ఉండేవాళ్ళని ఆదరిస్తా, చెడుగా ఉండేవాళ్ళని అణచివేస్తా 😐
#అన్ని కులాలను, మతాలను గౌరవించే మనస్తత్వం 🤩
-
210 Posts
-
2 Photos
-
20 Videos
-
Journalist at Vizianagaram
-
Studied UNDER GRADUATED at Srichaitanya ITCClass of ITI, srichaitanya ITC
-
Followed by 0 people
-
Experience
2 Years -
Language
Telugu
-
Current Position
Journalist
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్: బొబ్బిలి సీఐమంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం రంగరాయపురంలో గురువారం ఉపాధి కార్మికులకు చట్టాలపై అవగాహన కల్పించారు. నేరాలకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని కోరారు. మహిళల భద్రతకు శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. #Boiena Rajesh0 Comments 0 Shares 40 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
ఉపాధి పనుల్లో విజయనగరం స్టేట్ ఫస్ట్జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జలధార-జలహారతి, ఫిష్ పాండ్ త్రవ్వకాలతో రోజుకు సుమారు 2.43 లక్షల మంది వేతనదారులకు ఉపాధి కల్పిస్తూ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. విజయనగరం జిల్లాలో మొత్తం 1,265 ఫిష్ పాండ్ పనులు గుర్తించగా, 1,068 పనులకు అనుమతులు లభించాయి. ఈ పనులతో గ్రామీణులకు ఉపాధి కల్పించడమే కాకుండా భూగర్భ జలాల పెంపు, చేపల పెంపకానికి అవకాశాలు పెరుగుతున్నాయి....0 Comments 0 Shares 43 Views 0 Reviews
-
పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలిపెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బొబ్బిలి పట్టణంలో ద్విచక్ర వాహనాలను నడిపిస్తూ నిరసన తెలిపారు. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలు, వాహనదారులపై భారాలు వేయడం అన్యాయమన్నారు. ఇరాన్, రష్యా తక్కువ ధరకు ఆయిల్ ఇస్తామని చెపుతున్న అమెరికా బెదింపులకు లొంగి కొనుగోలు చేయడం లేదన్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. #Boiena Rajesh0 Comments 0 Shares 57 Views 0 Reviews
-
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలిస్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి మండలం చింతాడలో ఆదివారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో అల్లర్లు జరగకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలకు గురికాకుండా గుర్తు తెలియని వ్యక్తులకు ఆధార్, బ్యాంకు, OTP, ATM వివరాలు ఇవ్వవద్దని కోరారు. మహిళలను గౌరవించాలన్నారు. గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు....0 Comments 0 Shares 53 Views 0 Reviews
-
బొబ్బిలో పోలీసుల వాహనాల తనిఖీలుమాదకద్రవ్యాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పీ ఆర్.గోవిందరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలోని పార్వతీపురం రోడ్డులో వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్దాలు రవాణా నివారణకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి, మత్తు పదార్దాలు అమ్మినా, రవాణా చేసినా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నారాయణరావు, ఎస్ఐ నవీన్ పడాల పాల్గొన్నారు. #Boiena...0 Comments 0 Shares 77 Views 0 Reviews
-
ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనులుండాలిప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉపాధి పనులు చేయాలని ఎంపీడీఓ పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలం చింతాడ జంగాలబందలో జరుగుతున్న ఉపాధి పనులను శనివారం పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండు పూటలా పనులు చేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. కనీస వేతనాలు వచ్చేలా పనులు చేయాలని సూచించారు. #Boiena Rajesh0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
నూతన గృహ నిర్మాణాలకు 6,593 దరఖాస్తులుబొబ్బిలి హౌసింగ్ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 6,593 నూతన గృహ నిర్మాణాల కోసం దరఖాస్తులు వచ్చాయని హౌసింగ్ డీఈఈ రెడ్డి వేణుగోపాలరావు తెలిపారు. స్థానిక హౌసింగ్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. రామభద్రపురంలో 1679, బాడంగి 1198, తెర్లాం 1564, బొబ్బిలి రూరల్లో 2152 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటికి జియో ట్యాగింగ్ పూర్తి చేశామన్నారు. అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు సెప్టెంబరులోగా పూర్తి...0 Comments 0 Shares 130 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్పాలకొండ మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుభకార్యానికి వెళ్లి వస్తున్న వారు ఇలా ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలన్నారు. #Boiena Rajesh0 Comments 0 Shares 130 Views 0 Reviews
-
పలు గ్రామాల్లో నేడు పవర్ కట్బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్ నిర్వహణ పనులు కోసం శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు చెప్పారు. పారాది, మెట్టవలస, గొర్లెసీతారాంపురం, నారాయణప్పవలసకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ అంతరాయనికి ప్రజలు సహకరించాలని కోరారు. #Boiena Rajesh0 Comments 0 Shares 133 Views 0 Reviews
-
రీసర్వే వేగవంతం చేయాలిపార్వతీపురంలో రెవెన్యూ అధికారులతో బుధవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి కీలక సూచనలు చేశారు. మే 10లోగా భూ రికార్డుల పరిశీలన, మే 13లోగా మ్యూటేషన్, మే 17లోగా ఆధార్-డేటా సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే వేగవంతం చేసి ప్రజలకు సేవలు త్వరగా అందించాలని సూచించారు. పెండింగ్ సమస్యలు తక్షణం పరిష్కరించాలని పేర్కొన్నారు. #Boiena Rajesh0 Comments 0 Shares 130 Views 0 Reviews
-
పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలుపెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో ఎం.శ్రీను హెచ్చరించారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్, జిఎస్ఆర్.పురం పెట్రోల్ బంకులను మంగళవారం తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ బ్లాక్ చేయకుండా వాహనదారులకు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నమోదు చేసి బంకులను సీజ్ చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ స్టాక్ వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. #Boiena Rajesh0 Comments 0 Shares 133 Views 0 Reviews
-
అగ్నిప్రమాదంలో దగ్ధమైన షాపును పరిశీలించిన బేబినాయనబొబ్బిలిల్లో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన స్వీట్ షాపును ఎమ్మెల్యే బేబినాయన పరిశీలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను షాపు యజమాని, అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో షాపులో మంటలు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నుంచి ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. #Boiena Rajesh0 Comments 0 Shares 136 Views 0 Reviews
-
మే 1న రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు ఎంపికలువిశాలో మే 9,10 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలను మే 1న విజయనగరంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.జగన్నాథం మంగళవారం తెలిపారు.పోటీలో పాల్గొనేవారు జనవరి1,2015 తరువాత పుట్టిన వారు అర్హులుగా పేర్కొన్నారు. ఓపెన్లో ఇద్దరిని, మహిళా విభాగంలో ఇద్దరిని ఎంపిక చేసి పోటీలకు పంపుతామన్నారు. మరిన్ని వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు....0 Comments 0 Shares 138 Views 0 Reviews
-
గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులుబొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గొల్లపల్లిలో ఉన్న ఆలయం, బైపాస్ రోడ్డులో ఉన్న ఆలయం వద్ద తెల్లవారుజామున నుంచి పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారిని ఎమ్మెల్యే బేబినాయన దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణి చేశారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు పూజలకు రావడంతో ఆలయాలు సందడిగా ఉన్నాయి. #Boiena Rajesh0 Comments 0 Shares 139 Views 0 Reviews
-
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం: MLAప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా కార్యాలయం ఆవరణలో సోమవారం నాబార్డు సహాయ సహకారాలతో దీక్షా మహిళా వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఆర్గానిక్ ఎస్.హెచ్.జి మేళాను ప్రారంభించారు. ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు రావాలన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడి ప్రతిఒక్కరి జీవన విధానంలో మార్పు రావాలన్నారు. #Boiena Rajesh0 Comments 0 Shares 137 Views 0 Reviews
-
జీడి మామిడి తోటల్లో ఏనుగుల సంచారంగరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఆహారం కోసం అడవుల నుంచి బయటకు వచ్చిన ఈ ఏనుగులు తోటల వైపు కదిలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో ఒంటరిగా తోటలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు....0 Comments 0 Shares 137 Views 0 Reviews
-
పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలుపండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలోని రావువారివీధిలో ఆదివారం సమావేశం నిర్వహించారు. దాడితల్లి గ్రామదేవత పండుగలో అల్లర్లు, గొడవలు చేయకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. సిరిమానోత్సవం విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. అల్లర్లు, గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు...0 Comments 0 Shares 142 Views 0 Reviews
-
రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలు విజేతలు వీరేబొబ్బిలి రాజా కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి కోలాటం పోటీలలో నిర్వహించారు. ఈ పోటీల్లో బొబ్బిలి మండలం పక్కి గ్రామ సభ్యలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఉత్సాహభరితంగా సాగిన పోటీలలో 2nd అనకాపల్లి జిల్లా నూకాంబిక టీమ్, 3rd బాడంగి మండలం ముగడ, 4th విశాఖ జిల్లా శ్రీఅభయాంజనేయ టీమ్, 5th అనకాపల్లి జిల్లా శ్రీగంగభవానీ టీములు విజేతలగా నిలిచారు. వీరికి MLA బేబినాయన బహుమతులు...0 Comments 0 Shares 149 Views 0 Reviews
More Stories