Andhra Pradesh
గంజాయి మత్తుతోనే అఘాయిత్యాలు: మాజీ ఎమ్మెల్యే.
ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటమే మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి ఋషిక ప్రియపై అత్యాచారం, హత్య వంటి అఘాయిత్యాలకు కారణమని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దేశ తిప్పారెడ్డి ఆరోపించారు. గురువారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిలతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో గంజాయి, కల్తీ మద్యం విక్రయాలను వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చిన్నారి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి.
మదనపల్లిలో ఏడేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం కొండామరిపల్లి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన, బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబానికి అండగా నిలబడ్డ వారిపై కేసులు నమోదు చేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
పుంగునూరు నియోజకవర్గం రొంపిచర్ల: హైవేపై రోడ్డు ప్రమాదం
అనంతపురం-చెన్నై హైవేపై చిన్నగొట్టిగల్లు సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ను తప్పించబోయి కారు డివైడర్ను ఢీకొట్టింది. అన్నమయ్య జిల్లా, లక్కిరెడ్డిపల్లికు చెందిన కే. సుబ్బారెడ్డి తిరుపతికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుబ్బారెడ్డి, శ్రీనివాసులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .
మదనపల్లె: రిషిక ప్రియా ఘటనలో తల్లిదండ్రుల కృతజ్ఞతలు.
మదనపల్లె జిల్లా కేంద్రంలో రిషిక ప్రియా ఘటనలో తమకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి తల్లిదండ్రులు స్వర్ణలత, గోపినాథ్ గురువారం కృతజ్ఞతలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ధైర్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత, మంత్రి లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకులు, మదనపల్లె ప్రజలు, అంతిమ సంస్కారాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. "క్రూర మృగానికి దేవుడే శిక్ష విధించాడు" అని వ్యాఖ్యానించారు.
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 15 ఏళ్లుగా ఇక్కడ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ వ్యక్తి, విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందినవాడని స్థానికులు తెలిపారు. కల్లూరు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, పూర్తి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. మృతుని గుర్తింపునకు సంబంధించిన సమాచారం పోలీసుల విచారణలో వెల్లడికానుంది# కొత్తూరు మురళి.
అనంతపురం గంగమ్మ జాతరలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి
ఈరోజు గంగమ్మ జాతరలో బండలాగుడు పోటీలను ప్రారంభించిన మంత్రి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు రాయలసీమ నలుమూలల నుంచి వచ్చిన ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నుంచి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు రెండవ బహుమతిగా 80000 బహుమానంఇవ్వడం జరిగింది జరిగింది
మదనపల్లి మృగాడికి మరణం తర్వాత శిక్ష.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో 7 ఏళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడి, శిక్ష భయంతో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. పోస్టుమార్టం రిపోర్టుపై సంతకం చేయడానికి కుటుంబం రాకపోవడంతో, అతని పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ప్రస్తుతం మృతదేహం కోసం ఎవరూ రాకపోవడంతో, మున్సిపాలిటీ సిబ్బంది అనాథ శవంగా ఖననం చేయనున్నారు.
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....**
*తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటి శాఖా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు....*
*గిద్దలూరు నియోజకవర్గం బేస్తవారిపేట మండలంలోని ఫోకస్ బూత్ లు 123 124 మైనస్ బూత్ లు 122 125 126 127 129 బూత్ లకు వెళ్లి అక్కడ ఉన్న గ్రామ నాయకులు సర్పంచ్ బూత్ ఇంచార్జీ లతో కలిసి గ్రామంలో తిరిగి*
*పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఫోకస్ బూత్ లు మరియు వీక్ బూత్ లు విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితుల్ని జాతీయ పార్టీ కార్యాలయానికి నివేదిక పంపినా...
నగర అభివృద్ధిని అడ్డుకున్న వైసిపి
*ప్రచురణార్థం* *18-02-2026*
*నగరాభివృద్ధిని అడ్డుకున్న వైసిపి కౌన్సిల్...త్వరలో పీడ విరగడ*
*రాబోయే కొత్త కౌన్సిల్ తో రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రామ్ వాటర్ సమస్యలకు పరిష్కారం : ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)*
*గురునానక్ కాలనీలో నూతన ఇన్ఫ్రారెడ్ రోడ్ రిపేరింగ్ మొబైల్ మిషన్ ప్రారంభం*
*జెండా ఊపి మొబైల్ మిషన్ ను ప్రారంభించిన ఎంపీకేశినేని శివనాథ్, ఎమ్మెల్యే...
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
వివిధ శాఖల ఉన్నతాధికారులు 23వ తేదీ ఉదయం 11 గంటలలోపు ప్రతిపాదనలు పంపాలని ఆదేశం
ఏపీ మంత్రిమండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ హాలులో మంత్రిమండలి సమావేశం జరుగుతుంది.
ఈ మేరకు సీఎస్ విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని...
ప్రభుత్వ లక్ష్యాలు వేగంగా పూర్తి చేయాలి: JC ఆదేశాలు.
మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ పెండింగ్ పనులు, రీసర్వే రెండో, మూడో దశ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని, స్వామిత్వ పథకం పురోగతిపై దృష్టి సారించాలని సూచించారు. ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హౌసింగ్ శాఖ అధికారులకు తెలిపారు.
TTD: టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్.
టీటీడీ నెయ్యి టెండర్లపై వైసీపీ అవినీతి ఆరోపణలు
ఆరోపణలను తీవ్రంగా ఖండించిన టీటీడీ, హెరిటేజ్ ఫుడ్స్
తప్పుడు ఆరోపణలపై బొత్సకు లీగల్ నోటీసు పంపిన హెరిటేజ్
నెయ్యి సరఫరాలో నందిని సంస్థకే అతిపెద్ద వాటా అని టీటీడీ వెల్లడి
నాణ్యత పెంచేందుకే సేకరణలో కొత్త సంస్కరణలు తెచ్చామన్న టీటీడీ
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం సేకరించే నెయ్యి టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి. హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించిన ఇందాపూర్ డెయిరీకి అధిక ధరలకు...
More Blogs
Read More
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్
సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
సమావేశంలో.జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఎన్నిక
మన గూడూరు లో జర్నలిస్టులందరి సంక్షేమానికి, సమస్యలు, ఇబ్బందులు పరిష్కారానికి వీలైనన్ని అన్ని...
Ananya Panday's billowing anarkali by Rohit Bal
Ananya Panday's billowing anarkali by Rohit Bal is an ideal wedding guest look. The actor...
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన రాజంపేట టిడిపి అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు పీలేరు నందు నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం రిలీఫ్ ఫండ్...
సిసిటివి కెమెరాలన్నీ సక్రమంగా పని చేయాలి.
గుంటూరు, జనవరి 22:రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14,000 సిసిటివి కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా...