Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.

0
87

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  

 

వివిధ శాఖల ఉన్నతాధికారులు 23వ తేదీ ఉదయం 11 గంటలలోపు ప్రతిపాదనలు పంపాలని ఆదేశం

ఏపీ మంత్రిమండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ హాలులో మంత్రిమండలి సమావేశం జరుగుతుంది.

 

ఈ మేరకు సీఎస్ విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నిర్ణీత ఫార్మెట్ లో తమ ప్రతిపాదనలను 23వ తేదీ ఉదయం 11 గంటల లోపు పంపాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. 

 

కాగా, కేబినెట్ భేటీలో ఇటీవల జరిగిన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎస్ఐపీబీ) ఆమోదించిన రూ.29,021 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు. అలానే వివిధ కీలక అంశాలపై చర్చించి ఆమోదించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి మంత్రులకు సీఎం కీలక సూచనలు చేయనున్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా...
By Rajini Kumari 2026-03-06 01:45:23 0 89
Andhra Pradesh
మదనపల్లె: మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిదండ్రులపై కొడుకుదాడి.
మద్యం కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లిదండ్రులపై ఓ కుమారుడు కర్రతో విచక్షణారహితంగా దాడి...
By Pagadala Venkateswar 2026-02-23 06:53:25 0 78
Andhra Pradesh
Nara Lokesh: విశాఖలో 20 వేల ఉద్యోగాలు.. క్యాప్‌జెమినీకి మంత్రి లోకేశ్‌ కీలక ప్రతిపాదన.
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో...
By Pagadala Venkateswar 2026-03-12 05:50:51 0 101
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి మాజీ  మున్సిపల్ చైర్ పర్సన్ సలావుద్దీన్ ఖాన్ మరియు టిడిపి నాయకులు మసూద్ ఖాన్...
By Benguluri Madhubabu 2026-03-18 02:20:56 0 162
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com