Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.

0
145

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు

గవర్నర్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలిన వైనం

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన వైసీపీ

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క, శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. 'ప్రతిపక్ష హోదా ఇవ్వాలి' అనే ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. 

 

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

 

సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్ లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో, సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసినవారంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

Search
Categories
Read More
Business & Finance
Keep Your LLP Compliant with Annual Filing Services
Annual compliance is mandatory for every Limited Liability Partnership (LLP) registered in India....
By Navya Sree 2026-07-14 06:02:39 0 42
Andhra Pradesh
Chandrababu Naidu: కాకినాడ జిల్లా పేలుడు ఘటన స్థలానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు.. 21కి పెరిగిన మృతుల సంఖ్య.
గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించనున్న చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-02-28 12:31:26 0 379
Telangana
"గంగా అవెన్యూలో ₹24 లక్షల కాంపౌండ్ వాల్ పనులకు శంకుస్థాపన”.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని గంగా అవెన్యూలో 2300 చదరపు గజాల విస్తీర్ణంలో...
By Sidhu Maroju 2026-04-13 10:11:10 0 144
Andhra Pradesh
పుంగనూరు: లారీని ఢీకొన్న ఐచర్ వాహనం
పుంగనూరు నూతన బైపాస్ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మరమ్మతుల కారణంగా రోడ్డు పక్కన...
By Kothuru Murali 2026-05-18 15:17:01 0 68
SURAKSHA
Shri Ankit Yadav, IAS: A Visionary Leader in Public Service
A dynamic IAS officer known for administrative excellence, transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-20 13:53:44 0 36
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com