వైజాగ్ కార్పొరేషన్ లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వం అమానుషం

0
156

*ప్రెస్ నోట్*

 

*తేదీ: 23-04-2026*  

*విషయం: వైజాగ్ కార్పొరేషన్‌లో నడకపై పన్ను విధించడం కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్య... ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం...నలుకుర్తి రమేష్.*

 

*విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివాజీ పార్క్, టెన్నేటి పార్క్, ఉడా పార్క్, సెంట్రల్ పార్క్* లాంటి ప్రధాన పార్కుల్లో ఉదయం, సాయంత్రం ప్రజారోగ్యం కోసం నడిచే సామాన్య ప్రజలపై ఏడాదికి ₹720 "నడక పన్ను" విధించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత హాస్యాస్పదం, అప్రజాస్వామికం, దుర్మార్గం. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.

 

*ప్రజల ఆరోగ్యంపై పన్నా?*  

డాక్టర్లు, ప్రభుత్వమే "రోజూ నడవండి, ఆరోగ్యంగా ఉండండి" అని ప్రచారం చేస్తుంటే, అదే ప్రభుత్వం ఇప్పుడు ఈ లాంటి చోట్ల నడకపై పన్ను వేయడం దారుణం. షుగర్, బీపీ, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు ఉచితంగా దొరికే పార్కుల్లో నడుస్తుంటే, వారి జేబులకు చిల్లు పెట్టడం ఎంతవరకు న్యాయం? 

 

*ఇది ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం*  

ఎన్నికల ముందు సంక్షేమ పథకాల పేరుతో హామీల వర్షం కురిపించి, అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అయ్యిందని సాకు చూపి, చివరికి ప్రజల నడకపై కూడా పన్ను వేసే దుస్థితికి ఈ కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇది పాలనా వైఫల్యానికి, ఆర్థిక అసమర్థతకు ప్రత్యక్ష నిదర్శనం. 

 

*రేపు గాలికి కూడా పన్నేస్తారా?*  

ఈరోజు పార్కులలో నడకకు పన్ను వేసినవారు, రేపు పీల్చే గాలికి, తాగే నీటికి, చివరికి బతికేందుకు కూడా పన్ను వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రజలు ఏరి కోరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే, వారి నెత్తిన పన్నుల భారం మోపడం ద్రోహం చేయడమే.

 

*మా డిమాండ్లు:*  

1. విశాఖ కార్పొరేషన్ వెంటనే ఈ "నడక పన్ను" జీవోను ఉపసంహరించుకోవాలి.  

2. ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించే బదులు, దానిపై పన్నులు వేసే విధానాలకు స్వస్తి పలకాలి.  

3. ఈ నిర్ణయం వెనుక ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.  

 

 ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. 

 

*ఇట్లు*  

*నలుకుర్తి రమేష్*  

*వైయస్సార్సీపి ఎస్సి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి*  

*అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా*

Search
Categories
Read More
SURAKSHA
K. Biju, IAS: Leading Kerala with Vision and Integrity
The Journey Begins "True leadership in public administration is measured by the positive...
By Fathima Safa 2026-07-15 14:00:57 0 66
Andhra Pradesh
పుంగనూరు: పొన్నూరు పట్టణం రాంనగర్ లో పై వ్యక్తి అసభ్య ప్రవర్తన కేసు నమోదు: ఎస్సై
పుంగనూరు పట్టణంలోని రాంనగర్‌లో నివసిస్తున్న ఒక వివాహిత పట్ల 75 ఏళ్ల అంజప్ప అసభ్యంగా...
By Kothuru Murali 2026-02-08 10:17:00 0 147
SURAKSHA
ఆంధ్రప్రదేశ్ పోలీసుల సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి:
సైబర్ క్రైమ్ అవగాహన - తిరుపతి: తిరుపతిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఏపీ సైబర్ సెల్ ఆధ్వర్యంలో అవగాహన...
By Kalaga Sailaja 2026-07-01 05:37:59 0 36
Andhra Pradesh
ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్రవాడగలరు
*ఏపీలో నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు*    అమరావతి :   ఏపీలో ఎండల తీవ్రత...
By Rajini Kumari 2026-04-13 08:06:22 0 136
Andhra Pradesh
Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.
Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు...
By Pagadala Venkateswar 2026-07-18 06:57:23 0 33
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com