Jagan Mohan Reddy: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. 11 నిమిషాల్లోనే వెళ్లిపోయిన జగన్.

0
144

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభలోకి వచ్చిన వైసీపీ సభ్యులు

గవర్నర్ ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలిన వైనం

ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ పట్టుబట్టిన వైసీపీ

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరోపక్క, శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. 'ప్రతిపక్ష హోదా ఇవ్వాలి' అనే ప్లకార్డులను, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. 

 

గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదేపదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినదించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, 11 నిమిషాల వ్యవధిలోనే గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. 

 

సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్ లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో, సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసినవారంతా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం సభలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది.

Search
Categories
Read More
Business & Finance
FSSAI Registration for Safe and Trusted Food Business
FSSAI Registration is mandatory for food businesses to legally manufacture, store, distribute, or...
By Navya Sree 2026-07-21 06:01:18 0 40
Andhra Pradesh
ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది
ఆదోని లో ముందస్తు అడ్మిషన్ల పేరుతో దోపిడీ చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై చర్యలు...
By Boya Dasthagiri 2026-05-23 07:53:43 0 205
Telangana
తాడు బంద్ హనుమాన్ జయంతి... పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
     సికిందరాబాద్  :  కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గురువారం హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 11:07:32 0 217
Telangana
సర్జరీలో వేగం.. వైద్యంలో కచ్చితత్వం : మెడికవర్ రోబోటిక్ విభాగాన్ని ప్రారంభించిన హైదరాబాద్ సిపి.|
సికింద్రాబాద్ :  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో మెరుగైన వైద్య సేవలను అందిస్తూ మెడికవర్...
By Sidhu Maroju 2026-01-21 10:31:44 0 199
SURAKSHA
The Sentinel of Justice: Dr. Fakkeerappa Kaginelli’s Unwavering Commitment to Bharat
Guardian of the Law: A Profile of Integrity, Intelligence, and Innovation in Indian Policing: In...
By Kalaga Sailaja 2026-07-13 13:33:41 0 80
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com