జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమతోనే సాధ్యం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్

0
333

సికింద్రాబాద్:  జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరిధి 69 వ స్కూల్ గేమ్స్ (కబడ్డీ ,ఖోఖో)ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం ప్రారంభించారు. అనంతరం విద్యార్ధినీ, విద్యార్ధులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడల ఆవశ్యకతను వివరించి, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమ చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా క్రీడలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని, స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పి పిల్లలలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించడానికి కృషి చేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  క్రీడలకు బడ్జెట్లో కూడా అధిక నిధులు కేటాయించేలా చేశారని, 2036వ సంవత్సరంలో నిర్వహించనున్న ఒలంపిక్ క్రీడలలో 2 ఈవెంట్లను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, విద్యార్థినీ విద్యార్థులు కూడా ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఆసరాగా చేసుకుని విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించి దేశంలో తెలంగాణ కీర్తి పతాకను ఎగరవేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రియదర్శిని, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ సుధాకర్, డిప్యూటీ డిఇఓ గుండప్ప, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ప్రసన్న, మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

   Sidhumaroju

Search
Categories
Read More
Telangana
గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. ...
By Sidhu Maroju 2026-02-27 12:00:33 0 134
Andhra Pradesh
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం ట్రైబల్ ఏరియా ట్రైబల్ ఏరియా
పెద్ద దోర్నాల మండలం మర్రిపాలెం చెంచుగూడెం  ట్రైబల్ ఏరియా గత వర్షాకాలం తుఫాను వల్ల పరిపాల...
By Chennaiah Kati 2025-12-23 04:48:41 0 435
Andhra Pradesh
ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి
ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి.. నందిగామ ఎన్టీఆర్ జిల్లా  ఆటోని కారు...
By Patan Khuddus 2026-04-25 11:11:48 0 224
Andhra Pradesh
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
By Karapati Gopi 2025-12-30 01:02:52 0 246
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
మదనపల్లి: కురబలకోట మండలం చెన్నామరి మిట్ట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భవన...
By Pagadala Venkateswar 2026-02-16 12:55:47 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com