బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
641

 

 

మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమం ఈరోజు బోయిన్ పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన గొప్ప పోరాట యోధుడని,మహారాష్ట్ర ప్రాంతంలో చత్రపతి శివాజీ, దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీరోదాత్తుడని,350 ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహనీయుడని, జమిందారులు, భూస్వాములపై పోరాటం చేసి, సామాన్యులకు సంపద పంచిన వీరుడని,ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలకు అయినా చేరుకోవచ్చని నిరూపించిన పోరాటయోధుడని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు.ఈ జయంతి కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్,మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

      -sidhumaroju 

Search
Categories
Read More
Haryana
Haryana Strengthens Infrastructure and Connectivity
Haryana continues to enhance its infrastructure and connectivity through major investments in...
By Fathima Safa 2026-07-06 08:49:19 0 146
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు రూరల్ సిఐగా సాయిప్రసాద్ గారు.
పుంగనూరు రూరల్ సీఐగా సాయి ప్రసాద్ చౌడేపల్లిలో గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సదుం...
By Kothuru Murali 2026-01-29 08:39:11 0 162
Business & Finance
Trademark Rectification Corrects Brand Record Errors
Trademark Rectification allows businesses to correct errors, remove inaccuracies, or update...
By Navya Sree 2026-07-22 05:35:58 0 21
Andhra Pradesh
ప్రపంచ ఆర్థిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమైన తమార లేజర్ సీఈవో సృష్టి సిబిలాల్
*దావోస్: ప్రపంచ ఆర్ధిక సదస్సు మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తమారా లీజర్ సీఈఓ సృష్టి...
By Rajini Kumari 2026-01-21 14:42:49 0 158
Telangana
తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది. ...
By Ponnala Srinivasrao 2026-04-19 12:19:35 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com