బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన ధీరుడు సర్దార్ పాపన్న గౌడ్: ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
437

 

 

మల్కాజిగిరి:బోయిన్ పల్లి.   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమం ఈరోజు బోయిన్ పల్లి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుజనులకు కూడా రాజ్యాధికారం ఉండాలని పోరాడి సాధించిన గొప్ప పోరాట యోధుడని,మహారాష్ట్ర ప్రాంతంలో చత్రపతి శివాజీ, దక్షిణాదిలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలులపై దండెత్తి రాజ్యాధికారాన్ని సాధించారని, గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన ధీరోదాత్తుడని,350 ఏళ్ల క్రితమే బహుజనుల కోసం పోరాడిన మహనీయుడని, జమిందారులు, భూస్వాములపై పోరాటం చేసి, సామాన్యులకు సంపద పంచిన వీరుడని,ఒక సామాన్య వ్యక్తి ఎలాంటి ఉన్నత శిఖరాలకు అయినా చేరుకోవచ్చని నిరూపించిన పోరాటయోధుడని, వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చెప్పారు.ఈ జయంతి కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్,మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

      -sidhumaroju 

Search
Categories
Read More
Maharashtra
Justice for Street Vendors: Bombay High Court Slams Nagpur Civic Body for Illegal Evictions
Nagpur | July 2025 - In a significant move upholding the rights of street vendors, the Bombay...
By Citizen Rights Council 2025-08-02 10:18:55 0 806
West Bengal
West Bengal's New Industrial Policy: ₹50,000 Crore Investment, Focus on Green Energy and IT
Major Policy: The West Bengal government has announced a new industrial policy to boost its...
By Triveni Yarragadda 2025-08-11 14:45:53 0 648
Telangana
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం శాంతియుత దీక్షలు - సంఘీభావం తెలిపిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత దీక్షలు అల్వాల్ జెఎసి ప్రాంగణంలో...
By Sidhu Maroju 2025-06-30 14:33:19 0 884
Andhra Pradesh
నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో మెరిసిన ఆణిముత్యం. డాక్టర్ కే తనూజ. ఇటీవల నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షలో కర్నూల్ మెడికల్ కళాశాలకు చెందిన డాక్టర్ కుశినేని తనూజ ప్రతిభను కనపరిచారు.
కర్నూలు జిల్లా, మండల కేంద్రమైన గూడూరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కుసినేని గిడ్డయ్య,...
By mahaboob basha 2025-08-21 10:49:53 0 467
Andhra Pradesh
HC on Pawan Photos | పవన్‌ ఫొటోలపై హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో...
By Rahul Pashikanti 2025-09-11 10:29:57 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com