ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

0
1K

సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ నేపథ్యంలో మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. మహంకాళి బోనాలు ఉత్సవాలను ఘనంగా జరపాలని ఆయన కోరారు. అన్ని శాఖల అధికారులతో కలిసి ఆయన ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఇటీవల నెలకొన్న సమస్యలను పండుగ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు లక్షలాదిమంది ప్రజలు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుండి రానున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 29న ఘటాల ఊరేగింపు, వచ్చేనెల 13 14వ తేదీలలో బోనాలు రంగం కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా బోనాల పండుగను ఘనంగా జరుపుకోవాలని అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పరిసర ప్రాంతాలలో ఉన్న టాయిలెట్లు సిసి రోడ్లు క్యూ లైన్ లను ఆయన పర్యవేక్షించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బోనాల ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. 

Search
Categories
Read More
Uncategorized
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:20:04 0 1K
Andhra Pradesh
,ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బిజెపి పార్టీ అధికార ప్రతినిధి గురురాజ్ దేశాయ్,
  మండలకేంద్రమైన నందవరం లొని బిజెపి కార్యలయంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిథి గురురాజ్...
By Boya Dasthagiri 2026-03-24 09:07:16 0 276
Andhra Pradesh
Governor S. Abdul Nazeer Flags Off Andhra Pradesh Youth Contingent for National Youth Festival 2026
Vijayawada, January 4, 2026: The Hon’ble Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazeer,...
By Venugopal Gopal 2026-01-04 15:57:47 0 2K
Business
Kyndryl Launches Cloud Uplift Service Across Microsoft Japan Data Centers
Enterprise technology provider Kyndryl has expanded its specialized "Cloud Uplift" modernization...
By Dunna Jessicaruth 2026-05-19 11:18:06 0 26
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com