విద్యార్థుల వేదన కదిలించింది

0
163

విద్యార్ధుల వేదన కదిలించింది

 

• సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు 

• తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు 

• రోడ్డు కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు

 

పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి.

• ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.

Search
Categories
Read More
Telangana
హనుమకొండ జిల్లాలో దారుణం..
భరత్ ఆవాజ్ (ప్రతి నిధి):  హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో ధారావత్ రాజకుమార్...
By Prashanth Goindla 2026-02-26 12:00:29 0 407
Andhra Pradesh
భార్య విడాకుల కేసు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్యాయత్నం.
మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్ (35) కుటుంబ సమస్యలతో తీవ్ర...
By Pagadala Venkateswar 2026-06-27 05:51:37 0 46
Andhra Pradesh
CPi జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్
For scroll :   సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్....  ...
By Rajini Kumari 2025-12-19 09:58:21 0 351
Business & Finance
Team Loans Offer Flexible Funding for Business Growth
Team loans provide businesses, startups, and organizations with the financial support needed to...
By Navya Sree 2026-07-10 05:26:17 0 50
Telangana
కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్  భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా...
By Chunarkar Jagadeesh 2026-06-15 15:07:17 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com