వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు

0
1K

సైబరాబాద్‌(Cyberabad) పరిధిలోని పలు స్టార్‌ హోటళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దేశ విదేశాల నుంచి యువతులను అక్రమ రవాణా చేసి, ఆన్‌లైన్‌లో, వాట్సా్‌పలో కస్టమర్లను ఆకర్షించి హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. ఢిల్లీ(Delhi)కి చెందిన ఇద్దరు యువతులతో పాటు, విదేశాలకు చెందిన మరో యువతిని రక్షించి హోమ్‌కు తరలించారు. విటుడిని మాదాపూర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhapur Police Station)కు తరలించారు. పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోల్‌కతాలో ఉంటూ నగరంలో హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న ప్రధాన ఆర్గనైజర్‌ సుమిత్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనికోసం ప్రత్యేక పోలీస్‌ బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం.

కోల్‌కతాకు చెందిన సుమిత్‌ కొన్నేళ్లుగా మెట్రోపాలిటన్‌ నగరాల్లోని స్టార్‌ హోటళ్లను అడ్డాగా చేసుకొని హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దేశ, విదేశాలకు చెందిన యువతులను ఉద్యోగాల పేరుతో నగరానికి రప్పించి ఈ ఊబిలోకి దింపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారికి రోజుకు వేలల్లో డబ్బులు ఇచ్చి మెల్లగా పొడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఆన్‌లైన్‌లో యువతులను ఫొటోలను పెట్టి, విటులను ఆకర్శించి దందాను నిర్వహిస్తున్నారు.

మాదాపూర్‌ పరిధిలోని ఒక హోటల్‌పై దాడి చేసిన సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ పోలీసులు ముఠా గుట్టు రట్టు చేశారు. రాజస్థాన్‌(Rajasthan)కు చెందిన ప్రధాన నిందితుడు సుమిత్‌ పశ్చిమబెంగాల్‌లో ఉంటూ, నగరంలో తన అనుచరుల ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అతడిని అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా అతిపెద్ద సెక్స్‌ రాకెట్‌ ముఠా వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సైబరాబాద్‌ పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
ఆగస్టు ఒకటి తారీకు నుంచి టీచర్లకు ముఖ గుర్తింపు తప్పనిసరి
రేపటి నుంచి టీచర్లకు ముఖగుర్తింపు హాజరు హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు...
By Vadla Egonda 2025-07-31 14:44:39 0 879
Bharat Aawaz
సావిత్రీబాయి ఫులే – భారతదేశ తొలి మహిళా గురువు, సామాజిక మార్గాన్ని చూపారు
సావిత్రీబాయి ఫులే (1831–1897) భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ విద్యా ఉద్యమ...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-29 06:15:23 0 726
Telangana
శ్రీ మహంకాళి ఆషాడ బోనాల సందర్భంగా పలు శాఖలతో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం
సికింద్రాబాద్. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలను...
By Sidhu Maroju 2025-06-24 08:10:53 0 1K
Andhra Pradesh
కర్నూలు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలసిన టీడీపీ రాష్ట నాయకురాలు వైకుంఠం జ్యోతి*
కర్నూల్ జిల్లా ఎస్పీ ని కర్నూల్ నందు మర్యాదపూర్వకంగా కలసి శాంతి భద్రతల గురించి చర్చించారు ఈ...
By mahaboob basha 2025-06-14 15:14:43 0 1K
Telangana
మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్ చేసిన మోదీ. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్టు ఇదే.!
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన...
By Sidhu Maroju 2025-07-04 16:00:42 0 878
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com