రైతు సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే !! కోట్ల

0
220

కర్నూలు : నంద్యాల : డోన్

నంద్యాల జిల్లా  డోన్  నియోజకవర్గ పరిధి లోని  కొత్తకోట గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  పాల్గొని రైతు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో ముద్రించబడిన పాత పాసుపుస్తకాల్లో అనేక సాంకేతిక లోపాలు ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటినీ సరిదిద్దుతూ ఇప్పుడు పూర్తిగా పారదర్శకమైన విధానంలో నూతన పాసుపుస్తకాలను రూపొందించామని చెప్పారు.

 

ఈ నూతన పట్టాదారు పాసుపుస్తకాలపై కేవలం ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ (QR Code) మాత్రమే ఉంచడం ద్వారా ఎలాంటి రాజకీయ చిహ్నాలు లేకుండా రూపొందించామని, వెబ్ ల్యాండ్ డేటాతో అనుసంధానం చేయడం వల్ల భూమి వివరాలపై సంపూర్ణ నమ్మకాన్ని రైతులకు కల్పించనున్నాయని పేర్కొన్నారు.

 

రీ-సర్వే పూర్తయిన రాష్ట్రవ్యాప్తంగా 6,688 గ్రామాల్లోని సుమారు 21.80 లక్షల మంది రైతులకు ఈ పాసుపుస్తకాలను స్థానిక గ్రామ సభల ద్వారా రెవెన్యూ సిబ్బంది అందజేయనున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పర్యవేక్షణతో, నిబంధనలకు అనుగుణంగా అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

 

రైతుల భూమి హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తీసుకురావడం జరుగుతుందని ఎమ్మెల్యే  తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను...
By SivaNagendra Annapareddy 2026-01-10 12:59:18 0 280
Telangana
వన్ నేషన్- వన్ ఎలక్షన్ తోనే దేశాభివృద్ధి సాధ్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వన్ నేషన్ – వన్...
By Sidhu Maroju 2026-01-06 09:48:58 0 124
Telangana
ఇకపై జీహెచ్ఎంసీ పరిధిలో ఖాళీ స్థలానికి కూడా పన్ను కట్టాల్సిందే
ఖాళీ ప్లాట్‌లలో బోర్డులు ఏర్పాటు చేయనున్న జీహెచ్ఎంసీ. ఆదాయాన్ని పెంచుకునేందుకు వివిధ...
By Sidhu Maroju 2025-06-03 15:52:33 1 2K
Andhra Pradesh
నెల్లూరు రూరల్ వైసీపీకి రాజీనామాల పరంపర
*నెల్లూరు రూరల్ వైసీపీ కి రాజీనామాల పరంపర*  *ఆమంచర్ల పంచాయతీలో అప్పయకండ్రిగ వైసీపీ ముఖ్యనేత...
By Rajini Kumari 2025-12-21 12:32:20 0 187
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com