రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి

0
2K

కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిపిఐ మండల కార్యదర్శి బి.రాజుఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు రాజు రాముడు డిమాండ్ చేశారు. సోమవారం కోడుమూరులో తాసిల్దార్ వెంకటేష్ నాయక్ కు ఏపీ రైతు సంఘం తరఫున సిపిఐ మండల కార్యదర్శి బి రాజు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన కూడా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ అందజేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు 90 శాతం సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలను అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా పే ఆఫ్ స్కేల్ ఫైనాన్స్ కింద పంట రుణాలను ఐదు లక్షలకు పెంచాలి. గ్రామసభలు నిర్వహించి భూ యజమానుల ప్రమేయం లేకుండా కౌలు రైతులకు కౌలు కార్డులు అందజేయాలి. కౌలు రైతులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా 2 లక్షల వ్యవసాయ పంట రుణాలను ఎలాంటి పూచి కతూ లేకుండా ఇవ్వాలి. కౌలు రైతుల రక్షణ సంక్షేమం కొరకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు రిజర్వాయర్లు ప్రధాన కాలువలు చెరువులను మరమ్మత్తులు చేపట్టి వ్యవసాయ అనుగుణంగా తక్షణ పనులు చేపట్టాలి. వరి పంటకు పక్క రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్లో కూడా క్వింటాలకు అదనంగా 500 రూపాయలు చెల్లించాలి డిమాండ్ చేస్తున్నాం. పామాయిల్ దిగుమతి పై సుoఖాన్ని విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం పునః సంక్షించాలి. ఫ్రూట్ జ్యూస్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన 40 శాతం జీఎస్టీని తక్షణమే ఉపసంహరించాలని కోరుతున్నాం. డాక్టర్ స్వామినాథన్ సిఫార్చేసిన వ్యవసాయ పనుల కనుగుణంగా అమలు చేయాలి. సబ్సిడీ కింద రైతులకు వ్యవసాయ పరికరాలను విరివిగా అందించాలి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మద్దిలేటి,ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రంగస్వామి, రైతులు కౌలుట్ల తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండు రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఆహ్వానం కొత్తూరు మురళి
చిత్తూరు జిల్లా రొంపిచెర్ల గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవం 09-05-2026 మరియు...
By Kothuru Murali 2026-05-07 12:25:22 0 63
Telangana
పేద కుటుంబం నుండి సివిల్ జడ్జి గ ఎంపికైన ఏకరి లిఖిత ని అభినందించిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 08 వ డివిజన్ అరుణక్క నగర్ కు చెందిన ఏకారి లిఖిత ...
By Avunoori Mahesh 2026-04-11 17:32:51 0 145
Andhra Pradesh
రేషన్ డీలర్లు సరిగ్గా స్పందించకపోతే ఫిర్యాదు చేయండి.. కర్నూలు జేసీ డాక్టర్ నవ్య..
రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు: కర్నూలు JC   రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రేషన్...
By mahaboob basha 2025-06-01 05:23:46 0 2K
Business
India–China in Talks to Restart Border Trade
India and China are currently holding discussions to resume border trade in domestic goods,...
By Bharat Aawaz 2025-08-14 07:07:17 0 1K
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో.. మహీళ దుర్మరణం
గూడూరు, ఆగష్టు 31, ప్రభాతవార్త: కె. నాగలాపురం పోలీస్ స్టేషన్   పరిధిలోని పెద్దపాడు గ్రామం...
By mahaboob basha 2025-09-01 01:10:10 0 418
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com