రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి

0
1K

కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిపిఐ మండల కార్యదర్శి బి.రాజుఏపీ రైతు సంఘం మండల అధ్యక్షులు రాజు రాముడు డిమాండ్ చేశారు. సోమవారం కోడుమూరులో తాసిల్దార్ వెంకటేష్ నాయక్ కు ఏపీ రైతు సంఘం తరఫున సిపిఐ మండల కార్యదర్శి బి రాజు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం అధ్యక్షులు రాజు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన కూడా ఇప్పటివరకు రైతులకు అన్నదాత సుఖీభవ అందజేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు 90 శాతం సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలను అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా పే ఆఫ్ స్కేల్ ఫైనాన్స్ కింద పంట రుణాలను ఐదు లక్షలకు పెంచాలి. గ్రామసభలు నిర్వహించి భూ యజమానుల ప్రమేయం లేకుండా కౌలు రైతులకు కౌలు కార్డులు అందజేయాలి. కౌలు రైతులకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా 2 లక్షల వ్యవసాయ పంట రుణాలను ఎలాంటి పూచి కతూ లేకుండా ఇవ్వాలి. కౌలు రైతుల రక్షణ సంక్షేమం కొరకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. దశాబ్దాలుగా వినియోగంలో ఉన్న ప్రాజెక్టులు రిజర్వాయర్లు ప్రధాన కాలువలు చెరువులను మరమ్మత్తులు చేపట్టి వ్యవసాయ అనుగుణంగా తక్షణ పనులు చేపట్టాలి. వరి పంటకు పక్క రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్లో కూడా క్వింటాలకు అదనంగా 500 రూపాయలు చెల్లించాలి డిమాండ్ చేస్తున్నాం. పామాయిల్ దిగుమతి పై సుoఖాన్ని విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం పునః సంక్షించాలి. ఫ్రూట్ జ్యూస్ పై కేంద్ర ప్రభుత్వం విధించిన 40 శాతం జీఎస్టీని తక్షణమే ఉపసంహరించాలని కోరుతున్నాం. డాక్టర్ స్వామినాథన్ సిఫార్చేసిన వ్యవసాయ పనుల కనుగుణంగా అమలు చేయాలి. సబ్సిడీ కింద రైతులకు వ్యవసాయ పరికరాలను విరివిగా అందించాలి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు మద్దిలేటి,ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రంగస్వామి, రైతులు కౌలుట్ల తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Advertising & Revenue from the News Channel: Empowering Independent Journalism
Advertising & Revenue from the News Channel: Empowering Independent Journalism At Bharat...
By BMA (Bharat Media Association) 2025-04-27 16:48:54 0 2K
Andhra Pradesh
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా...
By mahaboob basha 2025-07-25 01:51:01 0 832
Assam
Himanta Sarma Alleges Conspiracy Linking Gogoi to Pakistan
Assam CM Himanta Biswa Sarma claimed that the state police #SIT has uncovered evidence of a...
By Pooja Patil 2025-09-11 06:21:26 0 19
Media Academy
The Media -The Backbone Of Democracy
The Media - Journalism -The Backbone Of Democracy At Its Core, Journalism Is The Lifeblood Of...
By Media Academy 2025-04-28 18:26:36 0 2K
Andhra Pradesh
ఈ పాప తప్పిపోయి ప్రస్తుతం గూడూరు పోలీసు స్టేషన్ లో ఉంది.ఆచూకీ తెలిసిన వాళ్ళు గూడూరు పోలీసు వారికి తెలుపగలరు
ఈ పాప తప్పిపోయి ప్రస్తుతం గూడూరు పోలీసు స్టేషన్ లో ఉంది.ఆచూకీ తెలిసిన వాళ్ళు గూడూరు పోలీసు వారికి...
By mahaboob basha 2025-07-18 14:40:05 1 779
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com