నందవరం మండల కేంద్రాన్ని పరిశీలించిన బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి
నందవరం మండల కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు సందర్శించి నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తిమ్మారెడ్డి కుంట చెరువును సందర్శించి కార్యక్రమంపై మాట్లాడారు ఈ కార్యక్రమం మొత్తం 4 దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదట 10 రోజుల్లో పనుల గుర్తింపు, అనంతరం నిధుల మంజూరు, తరువాత 70 రోజుల్లో పనుల అమలు, చివరగా 5 రోజులు రిపోర్టింగ్ మరియు డాక్యుమెంటేషన్ చేపడతారని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు జరిగి రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.తదనంతరం బంగారమ్మ ఆలయాన్ని మరియు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని సందర్శించారు. అనంతరం ఎన్టీఆర్ సుజల ఆర్ఓ తాగునీటి ప్లాంట్ ను ప్రారంభించారు.
అలాగే డయాలిసిస్తో బాధపడుతున్న హేమరాజు మరియు పక్షవాతం సమస్యతో బాధపడుతున్న లక్ష్మీదేవమ్మను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, ప్యాక్స్ అధ్యక్షులు, నీటి సంఘాల ప్రతినిధులు, ఎల్ఎల్సీ డీఈ, ఏఈ, సంబంధిత శాఖల సిబ్బంది, మండల కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz