• 979 Posts
  • 4 Photos
  • 2 Videos
  • Reporter at Mpl
  • Followed by 3 people
Work Info
  • Current Position
    Reporter
Location Info
  • State
    Andhra Pradesh (AP)
Search
Recent Updates
  • మదనపల్లి: ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు.
    ఆదివారం మదనపల్లి కలెక్టరేట్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ, అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. చిన్నతనం నుంచే ఉన్నత విలువలు కలిగిన జగ్జీవన్ రామ్, మూడు దశాబ్దాల పాటు...
    0 Comments 0 Shares 37 Views 0 Reviews
  • మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం: ఏఎస్పీ వెంకటాద్రి.
    మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం సాధ్యమని అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లి పోలీస్ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, దళిత బాంధవుడిగా జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమని, రాజ్యాంగంలో సామాజిక న్యాయం అందించడంలో ఆయన పాత్ర కీలకమని కొనియాడారు. పోలీసు...
    0 Comments 0 Shares 37 Views 0 Reviews
  • పొలం పనుల్లో దంపతులపై దాడి: నలుగురిపై ఆరోపణలు.
    అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లి, రేగడలో పొలం పనులు చేస్తున్న దంపతులపై జయరాం, రెడ్డి శేఖర్, ఆనంద్, పురుషోత్తం చంద్ర దాడి చేసినట్లు బాధితులు శనివారం ఆరోపించారు. ఈ ఘటనలో కృష్ణప్ప (65), ఆదెమ్మ (60) గాయపడి మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
    0 Comments 0 Shares 66 Views 0 Reviews
  • మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య – అధికారులు స్పందన.
    మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో తాగునీటి సమస్య తీవ్రతరం కావడంతో అధికారులు శనివారం స్పందించారు. పాత బోర్‌లో నీటి లభ్యత లేకపోవడంతో వెంటనే రీబోర్ పనులు చేపట్టారు. ఈ రీబోర్ ద్వారా నీరు లభిస్తే సమస్య పరిష్కారమవుతుందని, లేదంటే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
    0 Comments 0 Shares 61 Views 0 Reviews
  • అన్నమయ్య జిల్లాలో 148 మంది పోలీసుల బదిలీ.
    అన్నమయ్య జిల్లాలో భారీ స్థాయిలో పోలీసు బదిలీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 148 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ధీరజ్ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మరియు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బదిలీ ఉత్తర్వులు అందిన వారు వెంటనే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని...
    0 Comments 0 Shares 56 Views 0 Reviews
  • చౌడేశ్వరి అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.
    మదనపల్లె నియోజకవర్గం నీటుగట్టువారిపల్లి శాంతినగర్‌లో నూతనంగా వెలసిన చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాటకొండ శ్రీనివాసులు నాయుడు, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి, బాలమాల శేఖర్, అనంతతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు...
    0 Comments 0 Shares 51 Views 0 Reviews
  • జడ్పీ సమావేశంలో అధికారుల గైర్హాజరు: ఛైర్మన్ సీరియస్.
    చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంతో వారికి నోటీసులు పంపాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని, వేరుశెనగ విత్తనాలను సకాలంలో పంపిణీ చేయాలని, మామిడి రైతులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
    0 Comments 0 Shares 57 Views 0 Reviews
  • మదనపల్లెలో బైక్ రేసర్ల వీరవిహారం: బాలుడికి తీవ్ర గాయాలు
    మదనపల్లెలో సైలెన్సర్లు తొలగించి అతివేగంగా బైకులు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రేసర్ల నిర్లక్ష్యం శనివారం ఒక బాలుడి కాలు విరగడానికి కారణమైంది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యాన్ని సీపీఐ నేత కృష్ణప్ప తీవ్రంగా ఖండించారు. ప్రాణనష్టం జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నించారు. ఈ సంఘటనకు నిరసనగా సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ప్రకటించారు. బైక్...
    0 Comments 0 Shares 79 Views 0 Reviews
  • మదనపల్లెలో రోడ్డు ప్రమాదం – ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.
    ఆటో రిపేర్ కోసం మదనపల్లెకు వచ్చిన ఆటో డ్రైవర్ వెంకటరమణ (60) శుక్రవారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. బి. కొత్తకోటకు చెందిన వెంకటరమణ, ఆటో మరమ్మత్తు కోసం స్పేర్ పార్ట్స్ తీసుకుని బైక్‌పై మదనపల్లెకు వచ్చాడు. సిటిఎం రోడ్డులో రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
    0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
    శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప సబ్ జైలు వీధికి చెందిన దీవన (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉద్యోగం కోసం స్నేహితుడు ఉమామహేష్‌తో కలిసి బెంగళూరుకు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉమామహేష్‌ను మదనపల్లె జిల్లా...
    0 Comments 0 Shares 53 Views 0 Reviews
  • మదనపల్లెలో మురికి కాలువలు, రోడ్ల శుభ్రత: ఎమ్మెల్యే ఆదేశాలు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని 18వ వార్డులో, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు ఇంచార్జ్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో శుక్రవారం మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేశారు. వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రజలకు సేవ చేయడం తన బాధ్యత అని సయ్యద్ ఇక్బాల్ తెలిపారు. ఈ సందర్భంగా 18వ వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు సమాచారం.
    0 Comments 0 Shares 51 Views 0 Reviews
  • మదనపల్లెలో లారీ అగ్నిప్రమాదం – రూ. 9 లక్షల నష్టం.
    మదనపల్లెలోని బసినికొండ అమీన్ గ్యారేజీలో నిలిపి ఉంచిన లారీలో శుక్రవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమై సుమారు రూ. 9 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
    0 Comments 0 Shares 48 Views 0 Reviews
  • అమరావతికి చట్టబద్ధత: టీడీపీ నాయకుల సంబరాలు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో టీడీపీ నాయకులు గురువారం మంత్రి నారా లోకేశ్ పిలుపు మేరకు కోళ్ల బైళ్ళు పంచాయతీ, 34, 35 వార్డుల నాయకులు రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో "గ్రహణం వీడింది" అంటూ సంబరాలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి, సెల్ఫీలు తీసుకుని #ఏపీ థాంక్స్ ఇండియా హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని లోకేశ్ సూచించారని నాయకులు తెలిపారు. ఈ సంబరాలు అమరావతికి...
    0 Comments 0 Shares 49 Views 0 Reviews
  • మదనపల్లెలో పిచ్చికుక్క వీరంగం–ఇద్దరు చిన్నారులకుతీవ్ర గాయాలు.
    మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామంలో గురువారం పిచ్చికుక్క దాడిలో ఐదేళ్ల కుందన్, రెండేళ్ల దుర్వింత్ రామ్ అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు ఆడుకుంటున్న వీరిపై అకస్మాత్తుగా దాడి చేసిన కుక్కను పట్టుకోవాలని, నియంత్రించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. గాయపడిన పిల్లలకు స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కాలనీలో భయాందోళనలు నెలకొన్నాయి.
    0 Comments 0 Shares 54 Views 0 Reviews
  • మదనపల్లెలో సారా కేసు – నిందితుడిపై పీడీ యాక్ట్.
    మదనపల్లెలోని బుగ్గకాల్వ ప్రాంతానికి చెందిన మూడే బాలాజి నాయక్ (32)పై నాటుసారా కేసుల్లో పీడీ యాక్ట్ ప్రయోగించి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు అక్రమంగా సారా తయారీ, విక్రయాలు చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాడు. ఇతనిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదయ్యాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. సారా అక్రమాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.
    0 Comments 0 Shares 47 Views 0 Reviews
  • మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
    మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ దీరజ్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ సీఐ రాజారెడ్డి, మేనేజర్ సూరజ్‌పై చీటింగ్ కేసు గురువారం నమోదు చేశారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి ప్రజలతో చీటీలు కట్టించుకుని, సేకరించిన డబ్బులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల మోసం...
    0 Comments 0 Shares 48 Views 0 Reviews
  • Amaravati: రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ.
    ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.   ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. చర్చ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించినట్లు ఆయన...
    0 Comments 0 Shares 57 Views 0 Reviews
  • పంట నష్టం వివాదం – దంపతులపై కర్రలతో దాడి.
    గురువారం, రామసముద్రం మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ దిగువలంబంవారిపల్లెలో పంట నష్టం వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన రమణ (41), భార్య గాయత్రి (35)లపై కొందరు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. తమ పొలంలోకి మంజులకు చెందిన పశువులు వెళ్లి పంటను నాశనం చేశాయని, దీనిపై మందలించడంతో మంజుల కుటుంబ సభ్యులు దంపతులపై దాడి చేశారని బాధితులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, ఘటనపై...
    0 Comments 0 Shares 59 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com