Madanapalle: అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వెల్లడించిన అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ.

0
11

మదనపల్లె: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEs)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ ఒక ప్రకటనలో తెలిపారు.

 

మేధావులైన విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్యతో పాటు IIT-JEE, NEET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, అధ్యయన సామగ్రి తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో మదనపల్లె, గుంటూరు (రాజేంద్రనగర్), నెల్లూరు జిల్లాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లలో ప్రవేశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.

 

ప్రవేశాల్లో 75 శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులకు, మిగిలిన 25 శాతం సీట్లు ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులకు కేటాయించినట్లు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు https://apbragcet.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ టి. పద్మజ కోరారు

Search
Categories
Read More
Andhra Pradesh
రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం.
రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన...
By Pagadala Venkateswar 2026-07-09 04:54:34 0 60
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ...
By Kothuru Murali 2026-01-11 11:27:17 0 167
Andhra Pradesh
రైతులకు భూములు ఇవ్వండి.. పుంగనూరులో తహసీల్దార్ కు వినతి
పుంగనూరులో గత ప్రభుత్వంలో 5వేల కోట్లతో ఎలక్ట్రికల్ బస్సుల పరిశ్రమకు శంకుస్థాపన జరిగింది. అయితే,...
By Kothuru Murali 2026-05-22 14:31:28 0 81
Andhra Pradesh
అర్ధరాత్రి పరామర్శ హోమ్ మినిస్టర్ అనిత
*కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత*   *కార్యకర్త ఫోన్...
By Rajini Kumari 2026-01-05 11:53:18 0 220
Andhra Pradesh
పుంగనూరు: మేస్త్రి కుటుంబానికి ఆర్థిక సహాయం
పుంగనూరు పట్టణంలో సోమవారం సాయంత్రం మార్కెట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపిశెట్టి పల్లికి...
By Kothuru Murali 2026-04-29 11:18:38 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com