మన ఎర్రచందనాన్ని దేశంలో ఎక్కడ దాచినా వదలొద్దు: పవన్ కల్యాణ్.
రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ను సమూలంగా నిర్మూలించాలని, అక్రమ రవాణాపై 'జీరో టాలరెన్స్' విధానాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన ఎర్రచందనాన్ని దేశంలో ఏ మూలన దాచిపెట్టినా వదలొద్దని, స్మగ్లర్లతో పాటు వారి వెనుకున్న కింగ్ పిన్లపైనా ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ప్రత్యేకమైన అటవీ సంపద ఎర్రచందనం. దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఎర్రచందనం స్మగ్లింగ్పై కూటమి ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. నిఘాను పటిష్ఠం చేసేందుకు డ్రోన్ పరిజ్ఞానం, అత్యాధునిక సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. స్మగ్లింగ్ ముఠాల నెట్వర్క్ను మూలాలతో సహా పెకిలించాలి" అని అన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz