Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్ను వీడియో కాల్లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
Posted 2026-07-24 05:25:17
0
11
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్ (చిన్న)ను మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం బుధవారం ఫోన్ ద్వారా పరామర్శించారు. వీడియో కాల్లో యుగంధర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సమీమ్ అస్లాం, ఎలాంటి ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు.
మెరుగైన వైద్యం పొందుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహకారం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా, అంగళ్లు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో యుగంధర్కు రెండు కాళ్లు విరిగినట్లు వైద్యులు నిర్ధారించగా, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరులో 'స్వచ్ఛ రథం' ప్రారంభం ప్లాస్టిక్ ఇస్తే నిత్యావసరాలు పంపిణీ!
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చింతూరు మండలంలో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది. ప్లాస్టిక్ వ్యర్థాల...
పొన్నేటిపాలెంలో అర్ధరాత్రి వరకు ఎస్ఐఆర్ కార్యక్రమం.
మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ పొన్నేటిపాలెం పంచాయతీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్...
జిల్లా జడ్జిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఐజీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా... కర్నూలు జిల్లా జడ్జి , కర్నూలు రేంజ్ డిఐజి గారులను కలిసి...
2027 గద్దర్ అవార్డు లక్ష్యం గా నా "బతుకమ్మ " చిత్రం శ్రీను రావు పొన్నాల
తెలంగాణ ఆడ బిడ్డలు గర్వంగా తలెత్తుకుని చూసే సినిమా ఈ సెప్టెంబర్లో వస్తుంది , తెలంగాణ...
మదనపల్లెలో పిచ్చికుక్క వీరంగం–ఇద్దరు చిన్నారులకుతీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామంలో గురువారం పిచ్చికుక్క దాడిలో ఐదేళ్ల కుందన్, రెండేళ్ల...