మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు * దర్శి ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు*

0
206

మానవత్వంతో చలించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు

దర్శి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కీలక అడుగు

గతంలో దర్శి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన సందర్భంగా, ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు డాక్టర్లు ఈ ఆసుపత్రిలో మార్చురీ గది లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారి దృష్టికి తీసుకువచ్చారు.ఒక వైద్యురాలిగా అక్కడి పరిస్థితులను స్వయంగా గమనించిన డాక్టర్ లక్ష్మీ గారు, మానవత్వంతో స్పందించి మరణించిన వారికి గౌరవం కలిగే విధంగా పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రత్యేక గది అవసరం అని భావించారు. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని, జిల్లా కలెక్టర్ గారిని సంప్రదించి దాదాపు ₹30 లక్షల వ్యయంతో నూతన మార్చురీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.

శనివారం సాయంత్రం ఆసుపత్రి ప్రాంగణంలో మార్చురీ గది ఎక్కడ నిర్మించాలన్న విషయమై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్ గారితో కలిసి స్థల పరిశీలన, చర్చలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య,

హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, సంఘ సేవకులు జి.వి. రత్నం, మున్సిపల్ వైస్ చైర్మన్ తలారి కోటయ్య,

క్లస్టర్ నారపుశెట్టి మధు, ఊరిబిండి మధు, బెల్లా శ్రీను,

స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మేడ్చల్ జిల్లాలో అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14) వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి.
మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ...
By Thalakayala Nagashiva 2026-04-15 05:11:17 0 138
Andhra Pradesh
మదనపల్లి బీటీ కళాశాల భూమి కబ్జా గుట్టురట్టు.
మదనపల్లె బీటీ కళాశాలకు చెందిన కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా భవనాలు...
By Pagadala Venkateswar 2026-01-29 07:39:26 0 119
Andhra Pradesh
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ.
మార్కాపురం: స్కానింగ్ సెంటర్లలో ఫీజు వివరాలు ఎక్కడ. మార్కాపురం జిల్లా కేంద్రంలో స్కానింగ్...
By Chennaiah Kati 2026-03-10 10:55:30 0 277
Telangana
అంబులెన్స్ పై కూలిన చెట్టు.... నర్సంపేట నుంచి వరంగల్ వెళ్తున్న 108 అంబులెన్స్ పై చెట్టు కూలి పడింది.......!
భారత్ అవాజ్ న్యూస్: 17 మే రోజున నర్సంపేట : సాధారణంగా అంబులెన్స్ లోపేషెంట్లను తరలిస్తుంటారు....
By Gujile Ramu 2026-05-17 01:59:38 0 52
Andhra Pradesh
పామ్ ఆయిల్ సాగు చరిత్రలో ఏపీలోనే అధిక ధర
*Press Release*     *పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర*...
By Rajini Kumari 2026-02-06 09:42:44 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com