హజ్రత్ సయ్యద్ షాబుకారీ బాబా ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు

0
230

*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేది.26-12-2025*

 

*హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఉరుసు మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు*

 

ఎన్.టి.ఆర్.జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిది, కొండపల్లి పట్టణ పరిధిలో ఈ నెల 29 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించు హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం సందర్బంగా ఆదిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపధ్యంలో కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు ఇతర అధికారులతో కలిసి పరిశీలించినారు.

 

ఈ నేపధ్యంలో ముందుగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అదికారులకు మరియు నిర్వాహకులకు పలు సూచనలు మరియు సలహాలను అంధించారు. పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. గంధం సమర్పించే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా బందోబస్తు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారు, పశ్చిమ జోన్ ఏ.డి.సి.పి. శ్రీ గుణ్ణం రామకృష్ణ గారు, పశ్చిమ ఏ.సి.పి. శ్రీ దుర్గారావు గారు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‌

* * *

Search
Categories
Read More
Telangana
"మచ్చబొల్లారంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీ ఈటల రాజేందర్ సిఫార్సు."|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్...
By Sidhu Maroju 2026-06-16 10:30:04 0 128
Assam
Meghalaya Revives Talks on Assam Border Disputes
The Meghalaya government has officially reconstituted three regional committees to accelerate the...
By Lokeshwari Panthadi 2026-07-01 10:52:40 0 65
Andhra Pradesh
మార్చి 16 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు
ఏపీలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు.   ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని...
By Rajini Kumari 2026-02-21 16:47:43 0 149
Telangana
బాచుపల్లి ఫ్లైఓవర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 8 న అధికారికంగా ప్రారంభం
హైదరాబాద్‌లోని బాచుపల్లి జంక్షన్‌ వద్ద సుమారు రూ. 141 కోట్ల వ్యయంతో నిర్మించిన 6 లేన్ల,...
By Ponnala Srinivasrao 2026-06-05 14:48:58 0 133
Andhra Pradesh
కోసిగి పట్టణంలోని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
సోనం వాంగ్ చుక్ కు సంఘీభావంగా కోసిగిలో ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన...
By Boya Dasthagiri 2026-07-19 13:59:45 0 44
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com