వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై అధికారి నిర్వాకం

0
114

1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం...

 

 1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంప్ తొలగించేందుకు యత్నించాడు..

 

ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.. 

 

పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలిక అధికారి వెళ్లి ఒక కాఫీని మూడు భాగాలు చేసివ్వమని అడిగారు.. 

 

ఆ విధానం తన హోటల్లో లేదని యజమాని సమాధానమిచ్చారు. ఆగ్రహించిన అధికారి 15 నిమిషాల్లో పొక్లెయిన్ తెప్పించారు..

 

హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారని.. దాన్ని తొలగించేందుకు యత్నించారు.. 

 

పట్టణంలో కాలువలున్న చోటల్లా ర్యాంప్లున్నాయని, వాటినీ తొలగించాలని యజమాని డిమాండ్ చేశారు..

 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది..

 

ఒక దశలో యజమాని రోడ్డుపై పడుకొని పొక్లెయిన్ను అడ్డుకున్నాడు.. 

 

తనపైనుంచి పోనిచ్చి, ర్యాంప్ను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు..

 

చివరికి అధికారులు దిగివచ్చి తొలగింపు ప్రక్రియను విరమించారు...

Search
Categories
Read More
Telangana
హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్...
By Sidhu Maroju 2026-02-01 08:48:53 0 127
Telangana
ఎల్లమ్మ&కొమురవేల్లి మల్లన్న కల్యాణంవేదికలో సర్పంచ్ వార్డు సబ్యులు
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరపల్లి గ్రామంలో రేణుకా ఎల్లమ్మ &కొమురవేల్లి...
By MERIGE MALLESH 2026-04-01 10:41:05 0 236
Andhra Pradesh
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్
చీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకచీరాల టు టౌన్ సిఐ గా బి. అశోక్...
By Vadlamudi NagaVenkat 2026-03-09 09:48:16 0 677
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com