వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై అధికారి నిర్వాకం

0
112

1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం...

 

 1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంప్ తొలగించేందుకు యత్నించాడు..

 

ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.. 

 

పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలిక అధికారి వెళ్లి ఒక కాఫీని మూడు భాగాలు చేసివ్వమని అడిగారు.. 

 

ఆ విధానం తన హోటల్లో లేదని యజమాని సమాధానమిచ్చారు. ఆగ్రహించిన అధికారి 15 నిమిషాల్లో పొక్లెయిన్ తెప్పించారు..

 

హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారని.. దాన్ని తొలగించేందుకు యత్నించారు.. 

 

పట్టణంలో కాలువలున్న చోటల్లా ర్యాంప్లున్నాయని, వాటినీ తొలగించాలని యజమాని డిమాండ్ చేశారు..

 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది..

 

ఒక దశలో యజమాని రోడ్డుపై పడుకొని పొక్లెయిన్ను అడ్డుకున్నాడు.. 

 

తనపైనుంచి పోనిచ్చి, ర్యాంప్ను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు..

 

చివరికి అధికారులు దిగివచ్చి తొలగింపు ప్రక్రియను విరమించారు...

Search
Categories
Read More
Assam
Goods Vehicles Halted Rising Heat on OIL & CIL Transport |
Vehicles carrying goods from Oil India Limited and Coal India Limited are being stopped, sparking...
By Pooja Patil 2025-09-16 04:04:55 0 349
Andhra Pradesh
మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి...
By Pagadala Venkateswar 2026-02-04 07:23:01 0 115
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాల్సిందే
పుంగనూరులో సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకుల ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఆందోళన...
By Kothuru Murali 2026-02-13 06:11:48 0 88
Andhra Pradesh
Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.
ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని...
By Pagadala Venkateswar 2026-02-07 07:19:25 0 99
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com