వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై అధికారి నిర్వాకం

0
113

1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం...

 

 1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంప్ తొలగించేందుకు యత్నించాడు..

 

ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.. 

 

పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలిక అధికారి వెళ్లి ఒక కాఫీని మూడు భాగాలు చేసివ్వమని అడిగారు.. 

 

ఆ విధానం తన హోటల్లో లేదని యజమాని సమాధానమిచ్చారు. ఆగ్రహించిన అధికారి 15 నిమిషాల్లో పొక్లెయిన్ తెప్పించారు..

 

హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారని.. దాన్ని తొలగించేందుకు యత్నించారు.. 

 

పట్టణంలో కాలువలున్న చోటల్లా ర్యాంప్లున్నాయని, వాటినీ తొలగించాలని యజమాని డిమాండ్ చేశారు..

 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది..

 

ఒక దశలో యజమాని రోడ్డుపై పడుకొని పొక్లెయిన్ను అడ్డుకున్నాడు.. 

 

తనపైనుంచి పోనిచ్చి, ర్యాంప్ను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు..

 

చివరికి అధికారులు దిగివచ్చి తొలగింపు ప్రక్రియను విరమించారు...

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల ఉద్యమం ఉదృతం ఆదర్స్ ఎం సాజి
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా.. విద్యార్థి, యువజన సంఘాల ఉద్యమం ఉధృతం : ఆదర్శ్ ఎం సాజి...
By Rajini Kumari 2025-12-16 07:14:06 0 137
Telangana
తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెన్నిధి శ్రీ ఎనుమల రేవంత్ అన్న గారికి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
తెలంగాణ పులిబిడ్డ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నా అభిమాన నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల...
By Vanmoj Suryamohan 2025-12-31 21:05:43 0 314
Andhra Pradesh
Pawan Kalyan: తిరుమల లడ్డూ వ్యవహారంలో సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదు: పవన్ కల్యాణ్.
గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆరోపణలు తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యికి...
By Pagadala Venkateswar 2026-02-06 05:06:19 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com