Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.

0
147

అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ

 

పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అన్న బొత్స

చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని సూచన

రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా చేయాలనుకుంటున్నారా? అంటూ ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. 

 

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని హితవు పలికారు. గత మూడు రోజులుగా కూటమి ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడుల విషయంలో జనసేన, బీజేపీ నాయకులు ఎందుకు తప్పును తప్పు అని చెప్పడం లేదని బొత్స నిలదీశారు. తనను దుర్భాషలాడటం వల్లే రాంబాబు స్పందించారని తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చి తాను మాట్లాడింది తప్పేనని అంగీకరించారని, అయినా కేంద్ర మంత్రి తడాఖా చూపిస్తామని మాట్లాడటం సరికాదన్నారు. 

 

ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను వైసీపీ తెచ్చిందా? అని బొత్స ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని దేవుడు కూడా క్షమించడని, ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందేనని అన్నారు. అంబటి ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేసి చంపాలనుకుంటున్నారా? అంటూ బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వ తీరుపై ప్రజలే ఆలోచన చేయాలని బొత్స కోరారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ
బోధనంపాడులో VB-G RAM G పథకానికి శ్రీకారం చుట్టిన డా గొట్టిపాటి లక్ష్మీ కురిచేడు మండలం, బోధనంపాడు...
By Chennaiah Kati 2026-07-02 12:30:33 0 37
Andhra Pradesh
చంద్రగిరిలో రామ్మూర్తి నాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
*Press Release*   *చంద్రగిరిలో నారా రామ్మూర్తినాయుడు క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించిన...
By Rajini Kumari 2026-04-15 13:12:50 0 147
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ 15-12-2025   ప్రచురణార్ధం   అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...
By Rajini Kumari 2025-12-15 07:25:36 0 361
Andhra Pradesh
పుంగనూరు : పుంగునూరు పట్టణంలో లో కూటమి నాయకుల సంబరాలు
గురువారం సాయంత్రం పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు....
By Kothuru Murali 2026-04-03 09:47:38 0 154
Andhra Pradesh
న్యూ ఇయర్ వేళ ఏపీలోని మద్యం దుకాణాల పని వేళల్లో మార్పులు.
కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సిద్దమవుతున్నారు. ఇప్పటికే...
By John Baji 2025-12-30 05:17:55 0 192
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com