దాడికి గురైన బాధితుడు తరుపున అండగా నిలబడ్డ బి సి నాయకులు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

0
257

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురై గాయలతో బాధపడుతున్న ముత్తిన రామకృష్ణ యాదవ్ ని, వారి కుటుంబ సభ్యులను జిల్లా BC సంఘం నాయకులు పాతకొత్తూరు వారి నివాసానికి విచ్చేసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని నాన్- బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, కేసును పక్కదారి పట్టించే విధంగా చెయ్యొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై ఇంత దారుణంగా, విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే ప్రయత్నాలు మానుకోవాలని, వారిని వెనకేసి వస్తే ఊరుకునేది లేదని బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు బిసి సంఘాలు ఆధర్వ్యంలో ఉద్యమం చేపడతామని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది...

ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బాధితుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్న మంచంపైనుండే తమ ఇంటికి వచ్చిన జిల్లా BC నాయకులకు చెప్పడం జరిగింది.. ఈ బాధితుడుని పరామర్శించిన వారిలో తెలుగు జనతా పార్టీ వ్యస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు యాదవ్, అల్లి రాజుబాబు యాదవ్, జిల్లాలో ఉన్న BC సంఘ నాయకులు, కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.. తరువాత మంచంపై ఉన్న బాధితుడిని తీసుకుని తేటగుంట యనమల రామకృష్ణుడు గారి క్యాంప్ కార్యాలయానికి తీసుకునివెళ్లి నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని కోరారు... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు పాక్స్ ప్రెసిడెంట్ బి దానమయ్య జాతీయ పతాకమును ఆవిష్కరీఛాడమైనది
79 వ ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఈ రోజు గూడూరు పాక్స్ నందు జాతీయ పతకం ను గూడూరు పాక్స్ ప్రెసిడెంట్...
By mahaboob basha 2025-08-16 01:10:48 0 590
Andhra Pradesh
ఎన్టీఆర్ జిల్లా అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
*ఎన్. టి. ఆర్ . జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*   *పత్రికా...
By Rajini Kumari 2025-12-18 08:21:14 0 152
Andhra Pradesh
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు. చీరాల డీఎస్పీ మోయిన్ ఆధ్వర్యంలో 150 మంది పోలీస్ సిబ్బందితో చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డెన్ అండ్ సెర్చ్.
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించిన...
By Gadiyapudi Narendra 2026-01-07 14:02:32 0 175
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com