దాడికి గురైన బాధితుడు తరుపున అండగా నిలబడ్డ బి సి నాయకులు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

0
281

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి దాడికి గురై గాయలతో బాధపడుతున్న ముత్తిన రామకృష్ణ యాదవ్ ని, వారి కుటుంబ సభ్యులను జిల్లా BC సంఘం నాయకులు పాతకొత్తూరు వారి నివాసానికి విచ్చేసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, అలాగే దోషులను కఠినంగా శిక్షించాలని నాన్- బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని, కేసును పక్కదారి పట్టించే విధంగా చెయ్యొద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక మనిషిపై ఇంత దారుణంగా, విచక్షణారహితంగా దాడి చేసిన దోషులను రక్షించే ప్రయత్నాలు జిల్లాలో ఉన్న ప్రముఖ, స్థానిక ప్రజా ప్రతినిధులు కేసు నీరుగారిచే ప్రయత్నాలు మానుకోవాలని, వారిని వెనకేసి వస్తే ఊరుకునేది లేదని బాధిత కుటుంబం భయాందోళనకు గురవుతుందని న్యాయం దక్కదేమో అని ఆందోళనలో ఉన్నారని, వారందరికీ న్యాయం జరిగే వరకు బిసి సంఘాలు ఆధర్వ్యంలో ఉద్యమం చేపడతామని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది...

ఈ సంఘటన జరిగిన సందర్భాన్ని బాధితుడు లేవలేని పరిస్థితుల్లో ఉన్న మంచంపైనుండే తమ ఇంటికి వచ్చిన జిల్లా BC నాయకులకు చెప్పడం జరిగింది.. ఈ బాధితుడుని పరామర్శించిన వారిలో తెలుగు జనతా పార్టీ వ్యస్థాపక అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు యాదవ్, అల్లి రాజుబాబు యాదవ్, జిల్లాలో ఉన్న BC సంఘ నాయకులు, కత్తిపూడి, సీతంపేట గ్రామాలకు సంబంధించిన పలువురు పెద్దలు, యాదవ్ సోదరులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.. తరువాత మంచంపై ఉన్న బాధితుడిని తీసుకుని తేటగుంట యనమల రామకృష్ణుడు గారి క్యాంప్ కార్యాలయానికి తీసుకునివెళ్లి నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని కోరారు... #Dadala Babji

Search
Categories
Read More
Andhra Pradesh
పవిత్రమైన తిరుమల తిరుపతి పై మచ్చగా బి.ఆర్ నాయుడు
ఎమ్మిగనూరులో వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహ జ్వాలలు  ఎమ్మిగనూరులో జరిగిన భారీ నిరసన...
By Boya Dasthagiri 2026-04-04 08:18:11 0 164
Andhra Pradesh
మొబైల్ ఫోన్స్ కొనేవారికి షాక్ !!!
వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలు భారీ పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు AI...
By SivaNagendra Annapareddy 2025-12-17 05:46:33 0 208
Andhra Pradesh
వృద్ధురాలు మిస్సింగ్
చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గం, సోమల మండలం, గన్నవారిపల్లె గ్రామానికి చెందిన 84 ఏళ్ల దాసరి...
By Kothuru Murali 2026-01-02 04:53:33 0 165
Andhra Pradesh
దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు
*ప్ర‌చుర‌ణార్థం* *21-02-2026*   *దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు : ఎన్టీఆర్...
By Rajini Kumari 2026-02-21 16:49:22 0 122
Andhra Pradesh
చాయ్ విత్ జనసైనిక్స్' కార్యక్రమం
గుంటూరు నగరంలోని 47వ డివిజన్ స్థానిక గోరంట్ల ప్రాంతంలోని రామాలయం వద్ద జనసేన కార్పొరేటర్...
By John Baji 2025-12-30 01:42:25 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com