"అరైవ్ అలైవ్”తో అల్వాల్‌లో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ.|

0
741

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అల్వాల్ పోలీసులు మరియు ట్రాఫిక్ సిబ్బంది సంయుక్తంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్, సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మరియు ఇతర సంబంధిత అధికారులు హాజరై ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు రోడ్డు నియమాలు మరియు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం ప్రాణాలను కాపాడే ముఖ్యమైన అంశమని, మద్యం సేవించి వాహనం నడపడం మరియు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. అధిక వేగం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వేగ నియంత్రణతోనే ప్రాణ నష్టాలను నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

సబ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ, పాదచారులు జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటాలని, డ్రైవర్లు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా స్కూల్ జోన్‌లలో జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు.

కార్యక్రమం చివరలో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో పాల్గొన్న ప్రజలతో రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు బాధ్యతగా వ్యవహరిస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఇతర అధికారులు, స్థానిక ప్రజలు, మహిళలు, యువత పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పొందారు. అధికారులు సూచించిన నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.

👉 జాగ్రత్తగా డ్రైవ్ చేయండి – సురక్షితంగా గమ్యం చేరండి!

#Sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Uttarkhand
Haridwar Cyber-Espionage: Mastermind Arrested for Leaking Information to Pakistan
The Jammu & Kashmir police have arrested a woman named Pooja, the suspected mastermind behind...
By Tejaswini Komanduru 2026-06-05 08:53:25 0 586
Andhra Pradesh
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు: వైసీపీ మహిళా నేత నాగమణి ఆరోపణ
కాకినాడ రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని వైసీపీ మహిళా విభాగం...
By Ratna Sekhar 2026-02-19 18:49:04 0 491
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గంలో పోలీసులు సమాధానం
స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. 'స్వర్ణాంధ్ర స్వచ్ఛ...
By Kothuru Murali 2026-02-22 11:03:25 0 146
Telangana
బిజెపికి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.
 బీజేపీ అధ్యక్ష్య పదవి కోసం నామినేషన్ వేయడానికి వెళ్లినప్పుడు తన అనుచరులను కొందరు...
By Sidhu Maroju 2025-06-30 18:06:47 0 1K
Telangana
మంచినీరు, డ్రైనేజ్ సమస్యలపై హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ మేనేజర్ కి వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం హెచ్ ఏ ఎల్, ఇతరి కాలనీలకు...
By Sidhu Maroju 2025-12-29 16:35:15 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com