ముక్కోటి ఏకాదశి మహోత్సవానికి ఎమ్మెల్యేకి ఆహ్వానం !!

0
232

కర్నూలు : నంద్యాల : బేతంచర్ల : డోన్ : 

ఈ రోజు డోన్ ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో, బేతంచెర్ల మండలంలోని ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో ఉన్న ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాల సందర్భంగా గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారిని దేవస్థానం కార్యనిర్వాహక అధికారి (ఈఓ) శ్రీ రామాంజనేయులు గారు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడాలని ఆకాంక్షించారు. దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, ఆలయ ప్రతినిధులు మరియు ఇతర అధికారులు
పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి భవిష్యత్తులో స్మార్ట్ సిటీ గా
తిరుపతి:- తిరుపతి స్మార్ట్ సస్టెనబల్ సిటీ గా తిర్చిద్దిదే లక్ష్యం తో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ...
By Karapati Gopi 2025-12-31 01:36:00 0 474
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలపై అవగాహన
పుంగనూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అగ్ని ప్రమాదాలపై అవగాహన...
By Kothuru Murali 2026-04-19 11:26:12 0 63
Andhra Pradesh
మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్ లో ఉద్యోగాల భర్తీ.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో పలు ఖాళీ పోస్టుల భర్తీకి అధికారులు మంగళవారం తెలిపారు. ఈనెల 15న...
By Pagadala Venkateswar 2026-05-13 05:42:45 0 47
Andhra Pradesh
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభకు బాపట్ల ఎస్పీ అభినందించారు.
iGOT లొ అత్యధిక శిక్షణ తరగతులు పూర్తి చేసిన 8 మంది పోలీసులు, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 3...
By Vadlamudi NagaVenkat 2026-04-18 13:06:53 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com