సురక్షిత ప్రయాణమే లక్ష్యం : మల్కాజిగిరి పోలీసుల వినూత్న హెల్మెట్ బ్యాంక్ .|

0
191

హైదరాబాద్ :  ద్విచక్రవాహనదారుల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ బ్యాంక్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మంగళవారం బేగంపేట ప్రాంతంలో అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులను గుర్తించి వారి వివరాలు నమోదు చేసి, వారికి హెల్మెట్‌ను అప్పుగా ఇస్తామని తెలిపారు. 24 గంటల లోపు కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి, అప్పుగా తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి హెల్మెట్ బ్యాంక్‌లో జమ చేయాలని సూచించారు. 

రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం ద్విచక్రవాహనదారుల మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని తమ అధ్యయనంలో తేలిందన్నారు. తనిఖీల సమయంలో హెల్మెట్ ధరించకపోవడానికి కొందరు హడావిడిలో ఇంట్లో మరిచిపోయామని, జుట్టు రాలిపోతుందనే భయంతో, లేదా తల–మెడ నొప్పుల కారణంగా ధరించడం లేదని వివిధ సాకులు చెబుతున్నారని వెల్లడించారు.

అవగాహన కార్యక్రమాలతో పాటు ఇప్పుడు ఈ హెల్మెట్ బ్యాంక్న ద్వారా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చలానా విధించడం మాత్రమే కాకుండా, ప్రాణ రక్షణపై అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వాహనదారుడిని గుర్తించి వివరాలు నమోదు చేసి హెల్మెట్‌ను అప్పుగా ఇస్తామని, 24 గంటల తరువాత అదే హెల్మెట్‌ను బ్యాంక్‌లో తిరిగి జమ చేయాలని డీసీపీ రాహుల్ రెడ్డి స్పష్టం చేశారు. 

రానున్న రోజుల్లో అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో కూడా ఈ హెల్మెట్ బ్యాంక్‌ను విస్తరించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, బేగంపేట ఆర్‌ఎస్‌ఐ అశోక్ రెడ్డి, తిరుమలగిరి, సీఐ సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Punjab
Punjab's Water Conservation and Groundwater Strategies
Water conservation and groundwater management have become critical priorities in Punjab due to...
By Fathima Safa 2026-06-16 10:16:39 0 112
Andhra Pradesh
విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సీఎం సమీక్ష
విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ అభివృద్ధిపై సీఎం సమీక్షVER మాస్టర్‌ప్లాన్‌ అజెండాపై...
By SivaNagendra Annapareddy 2025-12-12 11:36:10 0 292
Andhra Pradesh
బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా...
By Boiena Rajesh 2026-07-16 08:16:17 0 55
Business & Finance
Tripura Boosts Natural Gas-Based Industrial Growth
The Tripura government is promoting industries based on the state's abundant natural gas...
By Navya Sree 2026-07-02 13:37:12 0 49
Andhra Pradesh
TTD: శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్.
శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం చేనేత కార్మికులకు మంచి రోజులొచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన...
By Pagadala Venkateswar 2026-03-18 03:17:19 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com