భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టాడు.. ఆ తర్వాత.. ఉలిక్కిపడిన వరంగల్

0
290

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను చంపి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నాడు.. తన భార్య హత్యకు కారణాలపై డెత్ డిక్లరేషన్ ఇచ్చి తను కూడా ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

భార్య వేధిస్తుందని.. చంపి.. ఆ తర్వాత భర్త ఉరివేసుకుని చనిపోయిన ఘటన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపింది.. ఈ జంట మరణాల ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగింది. బాలాజీ రామాచారి అనేవ్యక్తి తన బార్య సంధ్య ను తాడుతో ఉరిబిగించి హత్య చేశాడు.. తన భార్యను హత్య చేయడానికి కారణాలన్నీ వీడియో రికార్డ్ చేసి పోలీసులకు మర్డర్ డిక్లరేషన్ ఇచ్చాడు.. తన భార్య వేధింపులు భరించలేకే హత్య చేసినట్లు వీడియో ద్వారా డిక్లరేషన్ ఇచ్చిన బాలాజీ రామాచారి.. తాను కూడా అదే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మొదటి భార్య మరణానంతరం బాలాజీరామాచారి సంధ్య అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తనను భార్య వేధింపులకు గురి చేస్తుందని, ఆ వేధింపులు భరించలేక భార్యను చంపినట్లు తెలిపాడు.. అనంతరం వీడియో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు.

భార్య భర్తల మరణంతో.. ఊరంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. ఇద్దరి మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.. ఈఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

#SivaNagendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా...
By Kothuru Murali 2026-01-17 12:25:51 0 127
Andhra Pradesh
చంద్రబాబు- లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టను. -సమాజం తలదించుకునేలా రాష్ట్రంలో కూటమి పాలన. -ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు జాతి యావత్తు గర్వపడాలి. -ముద్రగడ నివాసంలో వైసిపి నాయకులు అంబటి రాంబాబు.
కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం...
By Nandika Jayababu 2026-03-26 16:29:27 0 258
Andhra Pradesh
యువ శక్తే మన బలం.. టెక్నాలజీయే మన ఆయుధం నేడు మాన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి మోడీ
ప్రధానమంత్రినరేంద్రమోడీ నేడు నిర్వహించన 129వ మాన్ కీ బాత్ కార్యక్రమం లో దేశ ప్రజలు ను ఉద్దేశించి...
By Karapati Gopi 2025-12-28 10:02:43 0 302
Telangana
"బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి.. ప్రముఖుల వెల్లువ.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి ఘనంగా...
By Sidhu Maroju 2026-05-21 07:39:43 0 95
Telangana
శ్రీ రాజరాజేశ్వరి లలితా సత్సంగ్ నూతన క్యాలెండర్- ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  శ్రీ రాజరాజేశ్వరీ లలితా సత్సంగ్ కమిటీ ఆధ్వర్యంలో తయారు...
By Sidhu Maroju 2025-12-24 10:55:44 0 180
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com