• 45 Posts
  • 2 Photos
  • 0 Videos
  • Lives in Mancherial
  • From Mancherial
  • Followed by 0 people
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
  • Assembly Constituency
    Mancherial
  • District
    Mancherial
  • Mandal | Tahasil | Sub Division
    Mancherial
Search
Recent Updates
  • మంచిర్యాల్: దుమ్ము లేపిన బోనాల జాతర
    యూట్యూబ్ కళాకారులు బుధవారం హమాలివాడలో బోనాల జాతర నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 300 మంది కళాకారులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.. అండర్ బిట్ చౌరస్తా నుంచెల్లి కట్ట పోచమ్మ దేవాలయం బోనాలతో తరలి వెళ్లారు.. జానపద పాటలకు చేసిన నృత్యం ఆకట్టుకున్నాయి. అనంతరం పోచమ్మకు బోనం సమర్పించారు.. కార్పొరేటర్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో అందరికీ భోజనం వసతి కల్పించారు..
    0 Comments 0 Shares 24 Views 0 Reviews
  • మంచిర్యాల్: బాలికల భద్రతే షీ టీం ప్రధాన లక్ష్యం
    బాలికల భద్రతే ప్రధాన లక్ష్య మని ఎస్సై ఉషారాణి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పాఠశాల లో, బయట ఆకతాయిలు బాలికలను వేధించిన, అసభ్యంగా ప్రవర్తించిన, లేదా భయాందోళన గురిచేసిన వెంటనే పోలీసు వాళ్లకి సమాచారం ఇవ్వాలని సూచించారు.. అత్యవసర పరిస్థితిలో డయల్-100, ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు..
    Love
    1
    0 Comments 0 Shares 47 Views 0 Reviews
  • మంచిర్యాల్:రూ లక్ష సీఎం ఆర్ ఎఫ్ అందజేత..
    హైదరాబాద్ నిమ్స్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న. మంచిర్యాల్ 32 డివిజన్b కు చెందిన చందులూరి కుమార్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం లభించింది. ముఖ్యమంత్రి సహాయనధి క్రింద మంజూరైన రూ 1,00,000 విలువైన పత్రాన్ని మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కుమారు కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధు పాల్గొన్నారు..
    0 Comments 0 Shares 36 Views 0 Reviews
  • మంచిర్యాల్: ప్రేమ వేధింపు లు.. యువతి ఆత్మహత్య..
    జైపూర్ మండల లోని టేకుమట్ల గ్రామానికి చెందిన మాధవి సోమవారం ఆత్మహత్య చేసుకుంది.. అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ అన్న యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురుచడం వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.. ఘటనపై జైపూర్ ఎస్సై భూమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. కాగా , నిందుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు మంచిర్యాల్ లో ఆందోళన చేపట్టారు..
    1 Comments 0 Shares 116 Views 0 Reviews
  • మంచిర్యాల : కార్పొరేట్లపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం..
    మంచిర్యాల పరిధిలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ  నత్త నడక సాగుతుంది పై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు .. త్రీవ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డివిజన్ వారిగా నమోదైన శాతాలు ఆధారంగా ప్రగతిని  విశ్లేషించారు. నిర్లక్ష్యంగా వివరించిన కొందరు కార్పొరేట్లకు త్రీవంగా మందలించారు.. తక్షమే పనితీరు మార్చుకొని, గడుపు లోపల సవర్ణ ప్రక్రియ పూర్తిగా చేయాలని స్పష్టంగా హెచ్చరికలు...
    0 Comments 0 Shares 91 Views 0 Reviews
  • మంచిర్యాల: రక్తదానం చేయండి.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ 52 డివిజన్ లో మంచిర్యాల్ క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా  రక్తదానం శిబిరం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు రక్తదాతలకు ధ్రువీకరణ  పత్రాలు ను అందజేశారు.. ఆయన మాట్లాడుతూ,'రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ,'పిలుపునిచ్చారు..
    0 Comments 0 Shares 81 Views 0 Reviews
  • మంచిర్యాల్: సింగరేణి గనులకు జాతీయస్థాయి 5-స్టార్ రేటింగ్
    కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-2025 జాతీయ ఉత్తమ గనుల జాబితాలో సింగరేణి సంస్థ ఘనత సాధించింది. ఆర్కే న్యూటెక్, ఆర్కే-6, జేవియర్ ఓపి -2, కైరిగూడ, ఆర్ జి ఓపి-1 గనులకు అత్యుత్యా 5-రేటింగ్ దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా 50 గనులు ఎంపిక కాగా అందులో 5 సింగరేణి కావడం విశేషం. మరో 17 గనులు,4-స్టార్ సాధించగా. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు..
    0 Comments 0 Shares 85 Views 0 Reviews
  • మంచిర్యాల్: ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలి..
    ఈనెల 18 న నిర్వహించునున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ నిర్మల కోరారు.. బుధవారం మంచిర్యాల్ జిల్లాలోని ప్రధాన న్యాయస్థానంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ లో  ఎస్ ఐ యాక్ట్ , ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జిలు కవిత, కృష్ణ తేజ పాల్గొన్నారు..
    0 Comments 0 Shares 93 Views 0 Reviews
  • మంచిర్యాల్: విశ్వనాధ్ ఆలయంలో చోరీ..
    మంచిర్యాల్ లోని విశ్వనాధ్ ఆలయం లో చోరీ జరిగినట్లు ఆలస్యంగా తెలిసింది. సోమవారం ఆలయం మూసివేసిన అనంతరం తెల్లవారుజామున దుండగులు ఆలయంలో కి చొరబడి సుమారు రూ87 వేల విలువ చేసి వెండి ఆభరణాలు, వాచ్మెన్ మొబైల్ ఎత్తుకెళ్లారు. ఆలే జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్ సింగ్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధుసూదన్ రావు తెలిపారు. టౌన్ సెంటర్లోని ఆలయంలో చూరి ఘటన కలకలం రేపింది.
    0 Comments 0 Shares 109 Views 0 Reviews
  • అభివృద్ధి పనులు త్వరగా పూర్తీ చేయాలి: మంచిర్యాల కలెక్టర్
    ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల్ కాలేజీ రోడ్లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను శనివారం పరిశీలించారు.రూ 129 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రి,రూ23.75 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.. 
    0 Comments 0 Shares 97 Views 0 Reviews
  • మంచిర్యాల్: మొదటి రోజు95.8% పూర్తి
    మంచిర్యాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 95.8,% మొదటి రోజే పోలియో చుక్కలు వేసినట్ల..DHMO డాక్టర్ నరేంద్ర రాథోడ్ తెలిపారు.. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లాలో76,367 మంది పిల్లలు గాని మొదటి రోజే73,166, పిల్లలకు పోలియో చుక్క ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు..
    0 Comments 0 Shares 101 Views 0 Reviews
  • మంచిర్యాల్: మున్సిపల్ కౌన్సిలర్ మీటింగ్ బాయ్ కాట్ చేసిన బిజెపి
    మంచిర్యాల్ నగరపాలక  సమస్త సర్వసభ్యత్వం సమావేశానికి బిజెపి కార్పొరేటర్లు బహిష్కరించారు. సోమవారం మేయర్ ధరణి మధుకర్ అధ్యక్షులు సమావేశం జరిగింది సమావేశం ఎజెండాలో అంశాలపై చర్చించే అవకాశాలు ఇవ్వాలని బిజెపి కార్పొరేట్లు కోరగా మీరు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఫోర్ లీడర్  గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు సమావేశం నుంచి  బయటికి వెళ్లారు..
    0 Comments 0 Shares 114 Views 0 Reviews
  • మంచిర్యాల: మాదిక దవ్యాలు కు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
    అంతర్జాతీయ మాదికి దవ్యాల నిరోధిక దినోత్సవం సందర్భంగా మంచిర్యాల్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ఐబి చౌరస్తా వరకు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి భాస్కర్,13 బెటాలియన్ కమాండ్మెంట్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ కమాండ్మెంట్ నాగభూషణ్, ఏసిపి ప్రకాష్, పాల్గొన్నారు. వీరితోపాటు సిబ్బంది విద్యార్థులు , యువత భారీ ఎత్తున పాల్గొన్నారు..
    0 Comments 0 Shares 118 Views 0 Reviews
  • మంచిర్యాల్: అదునపు జడ్జి శ్రీనివాస్ నాయక్ వీడ్కోలు
    మంచిర్యాల్  బార్ అసోసియేషన్ న్యాయవాదుల పనితీరు అభినందనీయమని జిల్లా అదనపు జడ్జ్ శ్రీనివాస్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్నాయనకు మంగళవారం బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు పలికారు. న్యాయం వైపు లాయర్లు చూపిస్తున్న కృషి ఆదర్శమైనది, వారి సేవలు మర్చిపోలని జడ్జ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సత్తయ్య, రవీందర్రావు, తుల ఆంజనేయులు పాల్గొన్నారు..
    0 Comments 0 Shares 135 Views 0 Reviews
  • పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: మంచిర్యాల్ కలెక్టర్
    మంచిర్యాల జిల్లా ఈనెల 28న నిర్వహించునున్న పల్స్ పోలియో వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాలని కలెక్టర్ దీపక్ కుమార్ కోరారు. డిహెచ్ఎంఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, అదునపు కలెక్టర్ రాములతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలోని 459 కేంద్రాల ద్వారా76,365 మంది చిన్నారులకు చుక్కలు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు బస్టాండ్ , రైల్వే స్టేషన్ లో24 మొబైల్ టీంలు అందుబాటులో ఉన్నాయన కలెక్టర్ తెలిపారు..
    0 Comments 0 Shares 130 Views 0 Reviews
  • మంచిర్యాల: గుప్త నిధులకు కోసం తవ్వకాలు..
    ఎసిసి క్వారీ దుర్గాదేవి ఆలయం వద్ద గుప్త నిధులు తవ్వకాలు జరిపిన ఇద్దరినీ సోమవారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. కొమరం పవన్ కళ్యాణ్, జాడి బుద్దిరాజు తవ్వకాలు జరుగుతుండగా పెట్రోలింగ్ చేసే సమయంలో పోలీసులకు పట్టు పడరు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు వివరించారు..
    0 Comments 0 Shares 177 Views 0 Reviews
  • మంచిర్యాల్: లోక్అదాలత్ లో 3వేల పైగా కేసులు పరిష్కారం..
    మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన  లోక్ అదాలత్ లో 3 వేల కు పైగా కేసులను పరిష్కరించినట్లు జిల్లా అదనపు న్యాయమూర్తి న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఇందులో సివిల్ దావాలు 20, క్రిమినల్ కేసులు 3 వేలుపైగా ఇతర కేసులు, సైబర్ క్రైమ్ కేసు13, బ్యాంక్ పిలిటిగేషన్ కేసులు 38 పరిష్కరించామని పేర్కొన్నారు..
    0 Comments 0 Shares 159 Views 0 Reviews
  • మంచిర్యాల్: రెండు ఆటోలు ఢీకొని ఆరుగురు గాయాలు
    మంచిర్యాల్ సమీపంలోని తోళ్ళవాగు వద్ద ఆదివారం ఎదురు ఎదురుగా రెండు ఆటలు ఢీకొన్నాయి ప్రమాదంలో మధుకర్, మల్లేష్  త్రీవ గాయాల కాగా మరో నలుగురు స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది  ఘటన స్థలానికి చేరుకొని వారిని మంచిర్యాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
    0 Comments 0 Shares 199 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com