భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ధర్నా.|

0
56

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అల్వాల్ ఈ సేవ కూడలిలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా జీవో నంబర్ 46 ద్వారా 17% కి పరిమితం చేయడం ద్వారా 12728 గ్రామాల్లో కేవలం 2176 గ్రామాల్లో మాత్రమే bc ల కు పోటీ చేసే పరిస్థితి వల్ల బిసి ల ను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ పేరిట 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మ బలికి అమలు కానటువంటి 6 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసి తెలంగాణ లో అధికారం లోకి వచ్చారని తెలిపారు. 

42 శాతం ఇస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బీసీ లను నిండా మోసం చేస్తున్నాడని రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
పుత్తడి వెలుగులు !!
కర్నూలు : కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పుత్తడి వెలుగులతో విరాజిల్లుతుంది. తుగ్గలి మండల...
By krishna Reddy 2025-12-14 09:29:23 0 159
Andhra Pradesh
ప్రతి ఇంటికీ సంక్షేమం – ప్రతి ఇంటికీ ప్రభుత్వ ప్రమేయం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణతో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా...
By mahaboob basha 2025-07-25 01:51:01 0 898
Telangana
రాచకొండ : అంతర్ రాష్ట్ర గంజాయి దొంగల ముఠాను ఎస్ఓటి, ఎల్బీనగర్ జోన్ మరియు హయత్ నగర్, పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు
  నిందితుల దగ్గర నుండి 166 కిలోల నిషిద్ధ గంజాయిని మరియు .50,00,000/- (రూపాయలు యాభై లక్షల...
By Sidhu Maroju 2025-06-20 16:03:52 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com