నల్లమల అడవుల్లో అరుదైన పీకాక్ టరంటులా సాలీడు... ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.

0
93

అరుదైన పీకాక్ టారంటులా సాలీడు పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం

నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ప్రత్యేక సర్వే ప్రారంభం

అటవీ శాఖ, ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం

తీవ్రంగా అంతరించిపోతున్న ఈ జీవి తూర్పు కనుమలకే ప్రత్యేకం

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ పరిరక్షణ చర్యలు

తూర్పు కనుమలకే తలమానికమైన అరుదైన జీవి పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుం బిగించింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్న పీకాక్ టరంటులా (Poecilotheria metallica) అనే సాలీడు పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, అటవీ శాఖ ఈ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 

నాగార్జున సాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని అడవుల్లో ఈస్టర్న్ ఘాట్స్ వైల్డ్‌లైఫ్ సొసైటీ సహకారంతో ఏపీ అటవీ శాఖ ఈ సాలీడుపై పరిరక్షణ స్థితి సర్వేను ప్రారంభించింది. నీలం రంగులో మెరిసిపోయే ఈ పీకాక్ టరంటులా ప్రపంచంలో కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లోని చాలా చిన్న ప్రాంతానికి మాత్రమే పరిమితం. ఇది అత్యంత అరుదైన, ప్రత్యేకమైన జీవి కావడంతో దీనిని కాపాడుకోవడం ఎంతో కీలకం.

 

ఈ సర్వే ద్వారా నల్లమల అడవుల్లో ఈ సాలీళ్ళ జనాభా, విస్తరణ మరియు ఆవాసాల పరిస్థితిని అంచనా వేయనున్నారు. ఈ వివరాల ఆధారంగా వాటి భవిష్యత్తును కాపాడేందుకు పటిష్టమైన పరిరక్షణ ప్రణాళికలు రూపొందిస్తారు. కేవలం పెద్ద జంతువులే కాకుండా, ఇలాంటి అరుదైన, ప్రత్యేకమైన జీవులను కాపాడుకోవడం కూడా జీవవైవిధ్య పరిరక్షణలో ముఖ్య భాగమని అధికారులు తెలిపారు. ఈ దిశగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎన్నో మంచి పనులకు నాంది పలుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andaman & Nikobar Islands
Education and Skill Development Gain New Momentum
Education and skill development continue to receive significant attention in the Andaman &...
By Fathima Safa 2026-06-27 10:41:00 0 67
Andhra Pradesh
నిర్లక్ష్యానికి గురైన రోడ్డు అవస్తులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు, రైతులు.
బాపట్ల మండలంలోని బాపట్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నందరాజుతోట పంట కాలువకి ఆనుకొని ఉన్న రోడ్డు...
By Vadlamudi NagaVenkat 2026-04-04 15:09:50 0 279
Andhra Pradesh
కిడ్నీ డే సందర్భంగా టీ షర్ట్లు ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు
*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*   *పత్రికా ప్రకటన*...
By Rajini Kumari 2026-03-09 17:34:30 0 170
Telangana
ఈ నెల 31న అగ్ని వీర్ రిక్రూట్మెంట్
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. అగ్ని వీర్ ర్యాలీ పై కీలక అప్డేట్ వచ్చింది. ఈనెల 31 వ తేదీ నుంచి...
By Sidhu Maroju 2025-07-06 11:34:36 0 1K
Andhra Pradesh
రుషికొండ భవనాలపై కీలక ప్రకటన.. వినియోగంపై ప్రతిపాదనలకు ఆహ్వానం.
రుషికొండ భవనాలను ఇంకా ఎవరికీ కేటాయించలేదన్న ప్రభుత్వం పర్యాటక వినియోగంపై ప్రతిపాదనలు కోరిన...
By Pagadala Venkateswar 2026-07-09 04:54:34 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com