శ్రీ గురునానక్ దేవ్ జీ 556 వ జయంతి : పాల్గొన్న ఎమ్మెల్యే.|

0
226

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని గురుద్వార సంగత్ సాహిబ్ సభ, గురు నానక్ మందిరం వద్ద శ్రీ గురు నానక్ దేవ్ జీ మహారాజ్  556వ జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే  మర్రి రాజశేఖర్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై, గురుద్వారంలో గురు గ్రంథ్ సాహిబ్ కి నమస్కరించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ —

“సర్వ మత సౌహార్దం, సేవాభావం, సమానత్వం వంటి విలువలను బోధించిన శ్రీ గురు నానక్ దేవ్ జీ ఉపదేశాలు ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తాయి. గురు నానక్ జీ బోధనలు సమాజం అభివృద్ధికి మార్గదర్శకాలు” అని పేర్కొన్నారు.

అల్వాల్ పరిధిలో గురుద్వార కమిటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే  హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గురుద్వార సంగత్ సాహిబ్ సభ ప్రబంధక్ కమిటీ సభ్యులు జస్బీర్ సింగ్, అమన్‌దీప్ సింగ్, వర్జిందర్ సింగ్, కమిటీ సభ్యులు, అలాగే బీఆర్‌ఎస్ నాయకులు తోట నరేందర్ రెడ్డి, శరణ గిరి, సురేష్, యాదగిరి, ప్రేమ్, అరుణ్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, రెడ్డి ఎంక్లేవ్ కాలనీ పర్యటన.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి...
By Sidhu Maroju 2026-01-02 09:44:43 0 166
Andhra Pradesh
“స్కిల్ సెన్సస్ vs 20 లక్షల ఉద్యోగాలు – యువత భవిష్యత్తుకు నిజమైన పరిష్కారమా?”
ఆంధ్రప్రదేశ్‌లో ‘20 లక్షల ఉద్యోగాలు’ హామీ ఇప్పుడు రాజకీయంగా, ప్రజల్లో పెద్ద...
By Babitha Babitha 2026-05-14 10:49:07 0 109
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అక్రమ లే అవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసిల్దార్ రాము అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్...
By Kothuru Murali 2026-02-28 12:53:19 0 91
Andhra Pradesh
మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై...
By Pagadala Venkateswar 2026-02-06 04:25:51 0 122
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com