అయ్యప్పల పాదయాత్ర- ప్రారంభించిన ఎమ్మెల్యే తలసాని

0
78

సికింద్రాబాద్ : అయ్యప్ప స్వామి మాలధారణ ఎన్నో జన్మల పుణ్యఫలం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్ వద్ద నుండి శబరిమల వరకు 120 మంది అయ్యప్పలు నిర్వహించే పాదయాత్ర ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ముందుగా ఆలయ పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వినాయకుడిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అయ్యప్ప స్వాముల పాదయాత్ర ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గత 18 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం పాదయాత్ర గా శబరిమల కు వెళ్ళి అయ్యప్పస్వామి ని దర్శించుకోవడం జరుగుతుందని శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి పాదయాత్ర బృందం సభ్యుడు వెంకటేష్ యాదవ్ జాదవ్ తెలిపారు. నవంబర్ 23 వ తేదీన శబరిమల కు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆకుల హరికృష్ణ, నాగులు, ఓదెల సత్యనారాయణ, హన్మంతరావు తదితరులు ఉన్నారు.

ꜱɪᴅʜᴜᴍᴀʀᴏᴊᴜ

Search
Categories
Read More
Andhra Pradesh
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక
వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక శ్రీనీలకంఠ గారికి జిల్లా కార్యదర్శి టీ కే బందే...
By mahaboob basha 2025-07-07 14:00:33 0 1K
Entertainment
చిరు ఇంట తారల దీపావళి.. మెగా మజిలీ |
మెగాస్టార్ చిరంజీవి ఇంట ఈ ఏడాది దీపావళి వేడుకలు సినీ తారలతో కళకళలాడాయి. హైదరాబాద్‌లోని ఆయన...
By Bhuvaneswari Shanaga 2025-10-21 11:24:00 0 34
Punjab
Punjab Launches Global Training Drive to Transform School Education
Chandigarh: Determined to create a world-class learning environment, the Bhagwant Singh Mann...
By BMA ADMIN 2025-05-20 07:53:40 0 2K
Business
వెండి ధరలు పడిపోయాయి.. బంగారం ఊగిసలాట |
దేశంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.3,000 తగ్గి ప్రస్తుతం రూ.1,56,000 వద్ద ఉంది....
By Akhil Midde 2025-10-24 08:47:12 0 30
Andhra Pradesh
రైతులను వైకాపా మోసం చేసిందన్న కేంద్ర సహాయ మంత్రి
ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి...
By Bharat Aawaz 2025-08-14 10:24:38 0 586
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com