ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి

0
205

మునగల పాడు కర్నూల్ మండలం ఎస్సీ కులానికి చెందిన మైనర్ బాలుడు ఎం అర్జున్ 15 సంవత్సరాలు మరణానికి కారకులైన కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రధాని మోడీ 50 లక్షలు సీఎం 50 లక్షలు డిప్యూటీ సీఎం 50 లక్షలు అర్జున్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి

 కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇంచార్జ్ అనంతరత్నమ్ మాదిగ డిమాండ

 

 కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నందు 16 తారీకు జరిగిన జిఎస్టి మహాసభలో విద్యుత్ శాకుకి గురై మరణించిన ఎం అర్జున్ భౌతిక కాయానికి ఈరోజు ఉదయం 11గంటలకు నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కోడుమూరు ఇన్చార్జి అనంతరత్నమ్ మాదిగ కర్నూల్ సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష జిల్లా ఓబీసీ చైర్మన్ సాంబశివుడు ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎం ఖాద్రి కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా అనంతరత్నమ్ మాదిగ మాట్లాడుతూ 16వ తారీఖున కర్నూలు జిల్లాలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జిఎస్టి మహాసభలు ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి మోడీ మెప్పు కొరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లక్షల సంఖ్యలో జనాలను సభకు తోలడం జరిగింది ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్లకు సెలవులు ప్రకటించి స్కూళ్ల బస్సులను ఆర్టీసీ బస్సులను వేల సంఖ్యలో గ్రామాలకు తరలించి గ్రామీణ ప్రాంత ప్రజలను సభకు తోలడం జరిగింది . ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో మంది మైనర్ బాల బాలికలు రావడం జరిగింది ఈ యొక్క క్రమంలో స్కూలు బంద్ అయినందువలన మునగపాడుకు చెందిన అర్జున్ టెన్త్ క్లాస్ విద్యార్థి కృప అమృత్ టెన్త్ క్లాస్ విద్యార్థి రాఘవ టెన్త్ క్లాస్ విద్యార్థి ఈ ముగ్గురు విద్యార్థులు సినిమా హీరో ఈనాటి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సభకు వచ్చిన ఈ ముగ్గురు విద్యార్థులు కరెంటు షాక్ కి గురయ్యారు ఇందులో ఎం అర్జున్ మరణించడం జరిగింది . మిగతా ఇద్దరు తీవ్ర గాయాలకు గురయ్యారు స్కూలు సెలవులు ప్రకటించకుండా ఉండుంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు కావున కూటం ప్రభుత్వం బాధ్యత వహించి మరణించిన కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఒక కోటి 50 లక్షలు గాయపడిన కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ఇలాంటి మీటింగ్లు జరుగుతే స్కూలుకు సెలవులు ప్రకటించకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని మాట్లాడారు ఇట్లు అభి వందనములతో  అనంతరత్నమ్ మాదిగ  కోడుమూరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు...
By Hari Krishna 2026-01-02 15:29:55 0 116
Delhi - NCR
Delhi Weather Update: Temperature crosses 45 degrees Celsius; orange alert issued
The India Meteorological Department (IMD) has issued an orange alert in Delhi due to heatwave...
By Bharat Aawaz 2025-06-10 07:32:32 0 2K
Andhra Pradesh
ఈనెల 23 న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
*ఈ నెల 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు*   తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల...
By Rajini Kumari 2025-12-22 07:52:39 0 121
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com