హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు

0
100

వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య,పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చదువులో క్రమశిక్షణ ఎంతో అవసరమని,అది జీవితములో చక్కటి మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు.తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించిన నాడే ఆదర్శ విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడని తెలిపారు. చదువుతోపాటు వివిధ పోటీలలోనూ, క్రీడారంగములోనూ రాణించాలని,తల్లిదండ్రులు కూడా విద్యార్థుల పట్ల ప్రేమానురాగాలతో పాటు వారి చదువుల పట్ల కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత ఎంతో ఉందని తెలిపారు. చదువు అనేది దొంగతనం చేయని వస్తువు లాంటిదని,చదువుకు వయస్సు నిమిత్తం లేదని, పేదరికంతో జీవించేవారు కూడా చక్కటి చదువును అనుభవించిన దాఖలాలు కలవని తెలిపారు. గురు శిష్యుల అనుబంధంతోనే మంచి మార్గంతో కూడిన చదువు లభిస్తుందని,చదువులో బాగా రాణించాలంటే క్రమశిక్షణ, పట్టుదల, జీవితంలో సాధించాలన్న తపన ఉండాలని తెలిపారు. తదుపరి విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కరస్పాండెంట్ పొగడదండ రవి కుమార్,పాఠశాల ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు, విద్యార్థులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఘనంగా ముగిసిన రాయచోటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
ఘనంగా ముగిసిన రాయచోటి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు స్వామి పారువేట ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు...
By Benguluri Madhubabu 2026-02-23 04:02:12 0 147
Telangana
తెలంగాణ పర్యాటక రంగం: ₹15,000 కోట్ల పెట్టుబడులతో కొత్త ప్రణాళిక విడుదల
సరికొత్త విధానం: తెలంగాణ ప్రభుత్వం 2025-2030 పర్యాటక అభివృద్ధి విధానాన్ని ప్రారంభించింది.భారీ...
By Triveni Yarragadda 2025-08-11 14:18:05 0 1K
Andhra Pradesh
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు
తిరుమలనే కేంద్రంగా చేసుకుని మరోసారి హిందువుల సెంటిమెంటుతో జగన్ ఆడుకున్నాడు. అయితే జగన్ కుట్రను...
By SivaNagendra Annapareddy 2026-01-10 12:59:18 0 280
Telangana
Old City Metro Station
Old city lo metro panulu veganga సాగుతున్నాయి 
By Poloju Bhaskar 2026-02-20 17:55:54 0 211
Telangana
విద్యార్థుల భవిష్యత్తుకు 'గరుగు' భరోసా
Bharath aawaz today news మొయినాబాద్, మార్చి 27: విద్యార్థుల విద్యా భవిష్యత్తు దెబ్బతినకూడదనే...
By Veeresh Kumar 2026-03-27 00:58:55 0 212
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com