అధికారులకు,పాలకులకు, పట్టని అభివృద్ధి సమస్యలు రిటైర్డ్ టీచర్ కు పట్టింది... నగర అభివృద్ధి కమిటీ ఆరోపణలు

0
242

అభివృద్ధి చేయుట లో ముందున్న పైగేరి టీచర్ నాగరాజు ... :- నగర అభివృద్ధి పట్ల కనీస బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న అధికారులకు,పాలకులకు ఒక రిటైర్డ్ హెడ్మాస్టర్ నగర అభివృద్ధి కమిటీ కన్వీనర్ టీచర్ పైగేరి నాగరత్నరావు ప్రజలకు ఇబ్బంది కరమైనటువంటి పనులను దగ్గరుండి తానే సొంత నిధులతో ఖర్చు చేస్తూ వార్డుల్లో పర్యటన చేస్తూ అభివృద్ధి చేయుటకు ముందుకు వస్తున్నాడు. వర్షాలకు గుంతలు ఏర్పడినటువంటి స్థలాలను గుర్తించి డస్ట్ మరియు చిన్న కంకర ద్వారా ట్రాక్టర్ తో లేబర్స్ ను పెట్టి వార్డ్ లోని సమస్యలు పరిస్కారం చూపిస్తున్నాడు. గతంలో గ్రామచావిడిలో బస్టాండ్ నడి సెంటర్లో కల్లా కంపలతో నిండినటువంటి స్థలము ను కళ్ళకంపాలను కొట్టించి తీసివేయించాడు, గతంలో గూడూరు కొత్త బస్టాండు లో బస్సులు రాకపోకలు ఇబ్బందులు తలెత్తడంతో గుంతలను తన సొంత నిధుల ద్వారా మట్టిని తోలించి బస్సులో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా జేశాడు, ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ భవనం దగ్గర ఉన్నటువంటి కల్లా కంపలను తొలగించి చెడిపోయిన బోరింగ్ ను మారమ్మత్తు చేయించి దానికి విద్యుత్తును సమకూర్చి ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పించాడు. ఈ విధంగా నగరంలో అనేక అభివృద్ధి పనులను తన సొంత నిధులను వెచ్చించి తనకు నెలకు వచ్చినటువంటి పెన్షన్లు కొంత భాగాన్ని ప్రజల సౌకర్యాలకు అభివృద్ధికి ఇస్తూ, తన ఉదార స్వభావము చాటుతూ నగర అభివృద్ధి కి తోడ్పాటు అందిస్తున్నారు. ఈ విదంగా తమ తమ ప్రాంతంలో సమస్యలు తలెత్తితే పరిష్కారం చూపుటకు టీచర్ నాగరత్నారావు మాదిరి ముందుండాలని ఇప్పటి పాలకులు, నాయకులు టీచర్ నాగరత్న రావు ను ఆదర్శం గా తిసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్త పరుస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ*...
By Rajini Kumari 2025-12-19 10:14:05 0 153
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్ అక్రమాస్తుల కేసు.. సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు నిరాశ.
సీబీఐ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులలో...
By Pagadala Venkateswar 2026-02-11 07:56:06 0 82
Andhra Pradesh
నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం పెంపకం రైతులు
విజయవాడ నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం రైతులు......    ...
By Rajini Kumari 2026-01-10 13:11:41 0 113
Andhra Pradesh
మదనపల్లె ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా నాగేష్ బాధ్యతలు స్వీకరణ.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా లక్కీ టైల్స్ మాల్ నాగేష్ శుక్రవారం...
By Pagadala Venkateswar 2026-03-20 13:50:40 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com