ఆడపిల్లల విద్యాభివృద్ధి దిశగా కీలక అడుగు – జడవల్లి అడ్డరోడ్డులో మద్రసా హాస్టల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ళ.

0
29

పొన్నూరు మండలం, జడవల్లి గ్రామ సమీపంలో ముఫ్తి అబ్దుల్లా బేగ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన *దారుల్ ఉలూం మద్రసా & హిఫ్జ్-ఎ-ఖురాన్ ఎడ్యుకేషన్ సెంటర్ (బాలికల మద్రసా) హాస్టల్ బ్లాక్* ను పొన్నూరు శాసనసభ్యులు *శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్* గారు ఘనంగా ప్రారంభించారు...

 ఈ సందర్భంగా *శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్* గారు మాట్లాడుతూ....

సుమారు రూ. 8 కోట్ల రూపాయల వ్యయంతో మూడు ఎకరాల విస్తీర్ణంలో *మదర్సా భవనాలు, హాస్టల్ సౌకర్యాలు మరియు మసీదు నిర్మాణం* పూర్తి కావడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ముస్లిం సమాజం విద్యారంగంలో వెనుకబడి ఉందని, ముఖ్యంగా ఆడపిల్లల చదువుల విషయంలో వెనుకబాటుతనం గణాంకాల ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐదు జిల్లాల నుంచి బాలికలను తీసుకువచ్చి మతపరమైన విద్యతో పాటు ఆధునిక విద్యను అందించే విధంగా ఈ విద్యాసంస్థను ఏర్పాటు చేయడం సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు.

ముస్లిం సమాజంలో ముఖ్యంగా ఆడపిల్లల విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ విద్యా సంస్థ ఒక ఆదర్శప్రాయమైన ప్రయత్నం. ఖురాన్ విద్యతో పాటు ఆధునిక విద్య అందించడం వల్ల పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుంది. 

దాతల సహకారంతో ఈ నిర్మాణాలు పూర్తి చేయడం ప్రశంసనీయమని, అల్లాహ్ ఆశీస్సులతో రంజాన్ మాసం నుంచి మగపిల్లల కోసం కూడా ఇదే తరహా విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలియజేయడం సంతోషకరమని ఎమ్మెల్యే గారు చెప్పారు.

కుల, మతాలకు అతీతంగా పేద విద్యార్థులకు కూడా విద్య అందించాలనే ట్రస్ట్ సంకల్పం గొప్పదని కొనియాడారు. ముస్లిం సమాజ ప్రగతికి విద్యే ప్రధాన మార్గమని, ఇలాంటి విద్యాసంస్థలు భవిష్యత్తులో మరిన్ని విద్యార్థులకు వెలుగునిచ్చే కేంద్రాలుగా మారాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ముఫ్తి అబ్దుల్లా బేగ్ గారు మరియు ట్రస్ట్ కమిటీ సభ్యులను ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

 ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు, ముస్లిం పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు...

Search
Categories
Read More
Andhra Pradesh
PGRS వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*'పి.జి.ఆర్.ఎస్' వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2025-12-27 10:58:44 0 100
Andhra Pradesh
నేడు వసంత పంచమి... శుభకార్యాలు చేయరాదు
వసంత పంచమినాడు సరస్వతీ జన్మదినోత్సవం జరుపుకొంటారు. తెలివి తేటలు వృద్ధి చెందే రోజు గా...
By Karapati Gopi 2026-01-23 01:31:37 0 117
Andhra Pradesh
పుంగనూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఐజి కోయ ప్రవీణ్
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదివారం ఆకస్మికంగా...
By Kothuru Murali 2026-01-05 12:59:06 0 82
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 3K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com