శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.

0
250

సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కంసారీ బజార్ చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఇంటి ప్రహరీ గోడదూకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కంసారీ బజారుకు చెందిన రామచందర్ అనే వృద్ధుడి ఇంట్లో దొంగతనం జరిగినట్లు బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి తెలిపారు. తన మనవరాలి జన్మదిన వేడుకల కోసం సోమవారం మహబూబ్ నగర్ కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ గూడ దూకిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాతారాలు పగలగొట్టి అందులో ఉన్న 8 తులాల బంగారంతో పాటు 50 వేల నగదు అపహరణ చేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణమూర్తి వెల్లడించారు. 2011లో కూడా తమ ఇంట్లో ఇదే విధంగా చోరి అప్ప్పుడు కూడా 8తులాల బంగారం, అరకిలో వెండి నగదు చోరీ జరిగిందని, ఇప్పటి వరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని, మళ్ళీ అదే తరహా చోరీ జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

Sidhumaroju 

Search
Categories
Read More
SURAKSHA
AP పోలీసులు వర్ష బాధితులకు తక్షణ సహాయం
 ఈరోజు కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో AP పోలీసులు విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో వీధి వ్యాపారులకు...
By Kalaga Sailaja 2026-07-06 06:18:33 0 45
Andhra Pradesh
గుంటూరు.... 💐క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని గుంటూరు జిల్లా ప్రజలందరికీ పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్ గారు ఐపిఎస్ శుభాకాంక్షలు తెలిపారు.
 *గుంటూరు జిల్లా పోలీస్...* *తేది: 24.12.2025* _*//క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని...
By KOTESWARARAO KVSR 2025-12-24 17:39:15 0 393
Telangana
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం...
By Vanmoj Suryamohan 2026-01-31 06:56:34 0 455
Andhra Pradesh
ములకలచెరువు: ఈ నెంబర్ సేవ్ చేసుకోండి
ములకలచెరువు MPDO హరినారాయణ శుక్రవారం బురకాయలకోటలో ప్రభుత్వ వాట్సప్ సేవల వినియోగంపై అవగాహన...
By Pagadala Venkateswar 2026-01-31 08:01:08 0 148
Andhra Pradesh
నిమ్మనపల్లె: పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రతిభకు ప్రశంసాపత్రం.
నిమ్మనపల్లె మండలంలోని రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కార్యదర్శి గాయత్రి గ్రామ పరిపాలన, పారిశుద్ధ్య...
By Pagadala Venkateswar 2026-06-26 03:17:46 0 52
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com