శుభకార్యానికి వెళ్ళొచ్చేలోపు ఇల్లు గుల్ల: అదే ఇంట్లో రెండోసారి దొంగతనం.

0
141

సికింద్రాబాద్:  శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్ల అయిన ఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కంసారీ బజార్ చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఇంటి ప్రహరీ గోడదూకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కంసారీ బజారుకు చెందిన రామచందర్ అనే వృద్ధుడి ఇంట్లో దొంగతనం జరిగినట్లు బేగంపేట ఏసిపి గోపాల కృష్ణమూర్తి తెలిపారు. తన మనవరాలి జన్మదిన వేడుకల కోసం సోమవారం మహబూబ్ నగర్ కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ గూడ దూకిన దుండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువాతారాలు పగలగొట్టి అందులో ఉన్న 8 తులాల బంగారంతో పాటు 50 వేల నగదు అపహరణ చేసుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు బేగంపేట్ ఏసీపీ గోపాల కృష్ణమూర్తి వెల్లడించారు. 2011లో కూడా తమ ఇంట్లో ఇదే విధంగా చోరి అప్ప్పుడు కూడా 8తులాల బంగారం, అరకిలో వెండి నగదు చోరీ జరిగిందని, ఇప్పటి వరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని, మళ్ళీ అదే తరహా చోరీ జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Karnataka
Dixon Tech, Karnataka Bank Trade Ex-Dividend Today |
Dixon Technologies and Karnataka Bank are trading ex-dividend today, September 16, 2025, along...
By Pooja Patil 2025-09-16 07:33:49 0 371
Andhra Pradesh
మదనపల్లి బస్టాండ్ వద్ద డ్రైనేజీ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
మదనపల్లి బెంగళూరు బస్టాండ్‌లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనుల్లో డిజైన్ లోపం ఉందని...
By Pagadala Venkateswar 2026-01-25 13:19:15 0 74
Andhra Pradesh
జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ
ప్రెస్ నోట్ తేదీ: 31.12.2026   జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో...
By Rajini Kumari 2026-01-31 10:47:11 0 82
Telangana
బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:59:46 0 156
Andhra Pradesh
ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా
పత్రికా ప్రకటన! ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే --- ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2025-12-16 07:19:47 0 97
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com