ఏపీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ లకు వారాంతపు సెలవులు ఇవ్వాల్సిందే ఆంధ్రప్రదేశ్ స్ట్ర గుల్ కమిటీ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా

0
189

పత్రికా ప్రకటన!

ఏపీ.కాంట్రాక్టుస్టాఫ్ నర్స్ లకు

వారంతపు సెలవులు ఇవ్వాల్సిందే ---

ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా స్ట్రగుల్ కమిటీ

*******************

కృష్ణాజిల్లాలో ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉద్యోగాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ కృష్ణాజిల్లా స్ట్రగుల్ కమిటీ జిల్లా కార్యదర్శి సౌమ్య రేఖ ఆద్వర్యంలో పలువురు స్టాఫ్ నర్సులు కలిసి జిల్లా కలెక్టర్ డికె బాలాజీ కి ఫిర్యాదు అర్జీ అందజేశారు.

 తొలుత ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి సౌమ్య రేఖ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ముగ్గురు స్టాఫ్ నర్సులు మాత్రమే మూడు షిఫ్టులలో పని చేస్తున్నారని, ఒకరోజు తీసుకునే డే ఆఫ్ (వీక్లీ ఆఫ్) ఇవ్వడానికి జిల్లా వైద్యాధికారి నిరాకరిస్తున్నారని, అత్యవసర సమయంలో కూడా సాధారణ సెలవు ఇవ్వడానికి వైద్యాధికారి నిరాకరిస్తున్నట్లు ఆమే పేర్కొన్నారు. 

రాత్రి షిఫ్ట్ లో భద్రతా సిబ్బంది లేదా సపోర్టింగ్స్టాఫ్ లేకుండా మహిళా స్టాఫ్ నర్స్ ఒకరు మాత్రమే అభద్రత భావంతో విధులు నిర్వహించాల్సి వస్తుందని ఆరోపించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాలుగవ స్టాఫ్ నర్స్ సపోర్టింగ్ స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.నిరసనకుకార్యక్రమం సంఘీభావం తెలిపిన సి ఐ టి యు జిల్లా కార్యదర్శి బూర.సుబ్రమణ్యం మాట్లాడుతూ ఉద్యోగులకు వారంతపు సెలవులు అనేవి వారి హక్కు అని అలాంటిది జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి హక్కులను కాలరాసేలా, మీకు సెలవులు లేవు అని ప్రతి రోజు విధులకు హాజరు అవ్వాల్సిందేనని చెప్పడం నిబంధనలకు విరుద్ధం అన్నారు.కాబట్టి స్టాఫ్ నర్సులకు వారంతపు సెలవులు ఇవ్వాలని లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో స్టాఫ్ నర్సులు

 సి హెచ్ రాణి, ఎం.ప్రవీణా,ఎన్.సునీత,

పి.ఆదిలక్ష్మి,పి.వాసంతి,

కె.ఆశాజ్యోతి, కె.నాగలక్ష్మి,డి.విజయ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-06-16 13:02:42 0 61
Telangana
#రాజన్న సిరిసిల్ల జిల్లా నగునూరి శ్రీనివాస్ కి పురస్కారం
రాజన్న సిరిసిల్ల జిల్లా. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో నాదస్వరం విద్యన్ విధ్వంసుడు నగునూరి...
By Thalakokkula Sadanandam 2026-03-19 14:19:15 0 1K
Telangana
నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే...
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని లోటు తీరుస్తున్న రాజగోపాల్ రెడ్డి నిధులు మొత్తం ముగ్గురు...
By Ponnala Srinivasrao 2026-04-01 04:26:37 0 202
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:29:18 0 60
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:45:40 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com